రకరకాల ప్రచారాలు, వదంతులు, డిస్కషన్లు, సోషల్ మీడియా తిట్లు, ఎన్నెన్నో కథలు వెరసి గత అయిదు రోజులుగా పెద్ద చర్చగా మారిన అఖండ 2 వాయిదా కథ క్లైమాక్స్ కు చేరుకుంది. అభిమానుల ఒత్తిడో లేక ఇంకేదైనా కారణమో తర్వాత చూసుకోవచ్చు కానీ ముందైతే విడుదల తేదీని డిసెంబర్ 12 లాక్ చేస్తూ నిర్మాతలు అధికారిక ప్రకటన ఇచ్చారు. జరిగిన పరిణామాలకు సారీ చెప్పి డబుల్ బ్లాక్ బస్టర్ ఖాయమనే హామీ ఇచ్చేశారు. డిసెంబర్ 11 రాత్రి స్పెషల్ ప్రీమియర్లు వేయబోతున్నారు. ఇక ఇప్పుడు ఎలాంటి మార్పు ఉండబోవడం లేదు. ఖచ్చితంగా చెప్పిన టైంకే షోలు మొదలైపోతాయి.
ఇప్పుడు అందరి చూపు పదకొండు అర్ధరాత్రి వచ్చే టాక్ మీద ఉంది. ప్రత్యేకంగా రిలీజ్ ట్రైలర్ కూడా సిద్ధం చేసినట్టు సమాచారం. ప్రమోషన్ల పరంగా బాలకృష్ణ. బోయపాటి శీను, సంయుక్త మీనన్, ఇతర నటీనటులు చేయాల్సిందంతా చేశారు కాబట్టి ఈ రెండు రోజుల్లో ఎలాంటి పబ్లిసిటీ ఉండకపోవచ్చు. వాయిదా మొదట కొంచెం నెగటివ్ గా అనిపించినా క్రమంగా ఇదే సానుకూలాంశంగా మారిందని భావించిన ఫ్యాన్స్ లేకపోలేదు. డిసెంబర్ 25కి వెళ్తే ఆలస్యమవుతుందని టెన్షన్ పడిన వాళ్ళు ఉన్నారు. కానీ అలాంటిదేమి లేకుండా ఫ్యాన్స్ కోరుకున్న ప్రకారమే ప్రొడ్యూసర్లు నిర్ణయం తీసుకోవడం శుభ పరిణామం.
ఎలాగూ ఇది జరుగుతుందని ముందే తెలిసిన ఇతర సినిమాలు ప్రమోషన్లను ఆపేశాయి. మోగ్లీ నుంచి ఇంకా ఎలాంటి నోట్ రాలేదు. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ వైపు నుంచి బుకింగ్స్ మొదలైనట్టుగా ట్వీట్లు పెట్టారు కానీ దర్శకుడు సందీప్ రాజ్ నిరాశని వ్యక్తం చేస్తూ మెసేజ్ పెట్టడం టాక్ అయ్యింది. ఈషా మరో వారం ఆలస్యం కావొచ్చు. సైక్ సిద్దార్థ్ మాత్రం రిలీజ్ లో ఎలాంటి లేదు అంటున్నాడు. కార్తీ అన్నగారు వస్తారులో సైతం ఎలాంటి మార్పు లేదు. ఇదంతా అలా ఉంచితే గత పది రోజులుగా డల్లుగా ఉన్న థియేటర్లను హౌస్ ఫుల్స్ తో కళకళలాడించేలా చేయడం బాలయ్య భుజాల మీద ఉంది. చూడాలి ఏం చేస్తారో.
This post was last modified on December 9, 2025 10:45 pm
బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…
ఒక గంట నిలబడేందుకే ఇబ్బంది పడతాం. అలాంటిది ఏకంగా ఏడున్నరగంటల పాటు ఏకబిగిన నిలబడడం అంటే మాటలా? ఊహించేందుకే కష్టమైన…
కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు, సీజేపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీ ఛార్జ్ ను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ…
నీట్ పేపర్ లీక్ వ్యవహారం నేపథ్యంలో సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్ష భగ్నం, కాక్రోచ్ జనతా…