టాలీవుడ్ నిర్మాతల్లో సూర్యదేవర నాగవంశీని ఫైర్ బ్రాండ్గా చెప్పొచ్చు. సినిమా వేడుకలైనా, ఇంటర్వ్యూల్లో అయినా ఆయన చాలా అగ్రెసివ్గా, స్ట్రెయిట్గా మాట్లాడుతుంటారు. దీని వల్ల కొన్ని సందర్భాల్లో నాగవంశీ ఇబ్బంది పడ్డాడు కూడా. అయినా తన శైలేమీ మారదు. తన బేనర్ నుంచి రాబోతున్న కొత్త సినిమా ఎపిక్ టైటిల్ టీజర్ లాంచ్ సందర్భంగా నాగవంశీ తనదైన శైలిలో పంచ్లు విసిరాడు.
ఇటీవలే అరెస్ట్ అయిన పైరసీ సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు రవి గురించి సోషల్ మీడియా జనాలు స్పందించిన తీరుపై నాగవంశీ గట్టి కౌంటరే వేశాడు. 90వ దశకం కథతో ఎపిక్ మూవీ తెరకెక్కిన నేపథ్యంలో అప్పటి రోజులకు, ఇప్పటికి ఏం మారింది.. ఏం మిస్ అయింది అని ఒక ప్రశ్న ఎదురైంది నాగవంశీకి. దానికి ఆయన బదులిస్తూ.. మార్పు అంతా సోషల్ మీడియానే అని కామెంట్ చేశాడు. ఐబొమ్మ రవిని జనం రాబిన్ హుడ్ అని కీర్తిస్తున్నారని.. ఇంతకంటే అన్యాయం ఉందా అని ఆయన ప్రశ్నించాడు.
రవిని రాబిన్ హుడ్గా కొనియాడుతూ.. డబ్బులు పెట్టి, కష్టపడి సినిమాలు తీసే తమను దొంగల్లాగా చూస్తున్నారని.. 50 రూపాయలు టికెట్ రేటు పెంచితే దాన్ని తప్పుబడుతున్నారని.. ఇదే సోషల్ మీడియా వల్ల ఇప్పుడొచ్చిన మార్పు అని నాగవంశీ అసహనం వ్యక్తం చేశాడు. మరోవైపు విజయ్ దేవరకొండతో కింగ్డమ్ తీసిన మీరు, ఆయన తమ్ముడు ఆనంద్ దేవరకొండతో ఎపిక్ మూవీ తీశారు కదా.. ఈ అనుభవం గురించి ఏం చెబుతారని నాగవంశీని అడిగితే.. ఈ రెండు చిత్రాలకు పోలిక పెట్టొద్దని.. దానికి దీనికి ఏమాత్రం సంబంధం లేదని తేల్చేశాడు నాగవంశీ.
కింగ్డమ్ పెద్ద హిట్ అయి ఉంటే ఇలా పోల్చి మాట్లాడితే బాగుంటుందని.. కోరుకున్న ఫలితం రానపుడు దాని ప్రస్తావన ఎందుకని ఆయన ప్రశ్నించాడు. సంక్రాంతికి రాజాసాబ్, మన శంకర వరప్రసాద్ లాంటి పెద్ద సినిమాలతో మీ సినిమా అనగనగా ఒక రాజు పోటీ గురించి అడిగితే.. అన్నింట్లోకి చిన్న సినిమా తమదే కాబట్టి జనాలు సింపతీతో తమ సినిమాను ఆదరిస్తారని భావిస్తున్నట్లు నాగవంశీ సెటైరిగ్గా మాట్లాడాడు.
This post was last modified on December 1, 2025 11:19 pm
‘కేజీఎఫ్’ హీరో యశ్ కొత్త సినిమా ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం…
నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…
టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…
ఏపీ రాజధాని అమరావతిలో అద్భుత ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. శనివారం ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు.…
రాముడిని ఎవరైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవరైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుపడే ధార్మిక సంస్థలు.. ఇప్పుడు ఏమయ్యాయి? ఎక్కడున్నాయి. ఏపీ…