టాలీవుడ్ నిర్మాతల్లో సూర్యదేవర నాగవంశీని ఫైర్ బ్రాండ్గా చెప్పొచ్చు. సినిమా వేడుకలైనా, ఇంటర్వ్యూల్లో అయినా ఆయన చాలా అగ్రెసివ్గా, స్ట్రెయిట్గా మాట్లాడుతుంటారు. దీని వల్ల కొన్ని సందర్భాల్లో నాగవంశీ ఇబ్బంది పడ్డాడు కూడా. అయినా తన శైలేమీ మారదు. తన బేనర్ నుంచి రాబోతున్న కొత్త సినిమా ఎపిక్ టైటిల్ టీజర్ లాంచ్ సందర్భంగా నాగవంశీ తనదైన శైలిలో పంచ్లు విసిరాడు.
ఇటీవలే అరెస్ట్ అయిన పైరసీ సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు రవి గురించి సోషల్ మీడియా జనాలు స్పందించిన తీరుపై నాగవంశీ గట్టి కౌంటరే వేశాడు. 90వ దశకం కథతో ఎపిక్ మూవీ తెరకెక్కిన నేపథ్యంలో అప్పటి రోజులకు, ఇప్పటికి ఏం మారింది.. ఏం మిస్ అయింది అని ఒక ప్రశ్న ఎదురైంది నాగవంశీకి. దానికి ఆయన బదులిస్తూ.. మార్పు అంతా సోషల్ మీడియానే అని కామెంట్ చేశాడు. ఐబొమ్మ రవిని జనం రాబిన్ హుడ్ అని కీర్తిస్తున్నారని.. ఇంతకంటే అన్యాయం ఉందా అని ఆయన ప్రశ్నించాడు.
రవిని రాబిన్ హుడ్గా కొనియాడుతూ.. డబ్బులు పెట్టి, కష్టపడి సినిమాలు తీసే తమను దొంగల్లాగా చూస్తున్నారని.. 50 రూపాయలు టికెట్ రేటు పెంచితే దాన్ని తప్పుబడుతున్నారని.. ఇదే సోషల్ మీడియా వల్ల ఇప్పుడొచ్చిన మార్పు అని నాగవంశీ అసహనం వ్యక్తం చేశాడు. మరోవైపు విజయ్ దేవరకొండతో కింగ్డమ్ తీసిన మీరు, ఆయన తమ్ముడు ఆనంద్ దేవరకొండతో ఎపిక్ మూవీ తీశారు కదా.. ఈ అనుభవం గురించి ఏం చెబుతారని నాగవంశీని అడిగితే.. ఈ రెండు చిత్రాలకు పోలిక పెట్టొద్దని.. దానికి దీనికి ఏమాత్రం సంబంధం లేదని తేల్చేశాడు నాగవంశీ.
కింగ్డమ్ పెద్ద హిట్ అయి ఉంటే ఇలా పోల్చి మాట్లాడితే బాగుంటుందని.. కోరుకున్న ఫలితం రానపుడు దాని ప్రస్తావన ఎందుకని ఆయన ప్రశ్నించాడు. సంక్రాంతికి రాజాసాబ్, మన శంకర వరప్రసాద్ లాంటి పెద్ద సినిమాలతో మీ సినిమా అనగనగా ఒక రాజు పోటీ గురించి అడిగితే.. అన్నింట్లోకి చిన్న సినిమా తమదే కాబట్టి జనాలు సింపతీతో తమ సినిమాను ఆదరిస్తారని భావిస్తున్నట్లు నాగవంశీ సెటైరిగ్గా మాట్లాడాడు.
This post was last modified on December 1, 2025 11:19 pm
స్క్రీన్ మీద చూసే థ్రిల్లర్ ని మించిపోతోంది కేరళ 2 స్టోరీ వివాదం. ఇవాళ విడుదల కావాల్సిన ఈ సినిమాని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాలని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ తగిలింది.…
మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…
ఢిల్లీ మద్యం కేసులోతనను నిరపరాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రకటించడం పట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయన…
టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న సంస్థలు కూటమి ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల అత్యంత విశ్వసనీయత ప్రదర్శిస్తున్న విషయం…