ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఆయన తనయుడు అకిరా నందన్ మరోసారి ఒకే ఫ్రేమ్ లో కనిపించారు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. డిసెంబర్ 4వ తేదీన జరగబోయే నేవీ డే ఉత్సవాలకు ముందస్తుగా తూర్పు ప్ర్రాంత నావికాదళ కమాండ్ విశాఖపట్నంలో ఏర్పాటు చేశారు.
సర్గం 2025 – ఇండియన్ నేవల్ సింఫనిక్ ఆర్కెస్ట్రా పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ ప్రోగ్రామ్ లో పవన్ తనయుడు అకిరా నందన్ కూడా హాజరవ్వడం, నాన్న పక్కనే ఉండటంతో ఫ్యాన్స్ ఈ ఫోటోలను వైరల్ చేస్తున్నారు.
గతంలో పలు సందర్భాల్లో ఇద్దరూ కలిసి కనిపించారు. పవన్ కల్యాణ్ ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన సందర్భంలో అకీరా ను కూడా తీసుకు వెళ్లారు. తమిళనాడు తిరుపరకుండ్రం సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయాన్ని సందర్శించిన సమయంలో తనయుడు వెంట ఉన్నారు.
పవన్ కళ్యాణ్ సినీ వారసుడిగా అకీరా ఎంట్రీ కానున్నారు. ఓజీ సీక్వెల్ లో అకీరా ఉంటాడనే ఊహాగానాలు వినిపించాయి. అకీరా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నాడు. అకీరా నందన్ ని సినిమాల్లో హీరోగా పరిచయం చేసే అవకాశం ఇవ్వమని పవన్ కళ్యాణ్ చుట్టూ పెద్ద పెద్ద నిర్మాతలు తిరుగుతున్నట్లు సమాచారం. మంచి కథ తో హై ప్రొఫైల్ లాంచ్ రెండేళ్ల లో చేస్తారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే. అకీరా ఎంట్రీపై ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.
This post was last modified on November 30, 2025 2:02 pm
నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…
సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…