Movie News

సూర్య ప్లాన్ మారింది తెలుగు కోసమే

హిట్టు ఫ్లాపు సంగతి పక్కనపెడితే సూర్య మీద తెలుగు తమిళ ప్రేక్షకుల్లో ఒక గౌరవముంది. కాకపోతే ఆ నమ్మకాన్ని బలపరిచే స్థాయిలో హిట్లు పడటం లేదు. కంగువ మరీ అన్యాయంగా ట్రోలింగ్ చవి చూడాల్సి వచ్చింది. రెండు భాగాలుగా ప్లాన్ చేసుకున్న ఈ విజువల్ గ్రాండియర్ ని ఒక్క పార్ట్ తోనే సరి పుచ్చేశారు. దీని ప్రభావం సూర్య కొత్త మూవీ కరుప్పు మీద పడుతోంది. షూటింగ్ ఆలస్యంతో పాటు థియేటర్ బిజినెస్, ఓటిటి డీల్స్ వల్ల విడుదల తేదీ వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఫైనల్ గా జనవరి 23 లాక్ చేసినట్టుగా చెన్నై టాక్. అయితే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కానీ సూర్య ఫ్యాన్స్ డిమాండ్ వేరే ఉంది.

కరుప్పు కమర్షియల్ సినిమానే అయినప్పటికీ మంచి డివోషనల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ముఖ్యంగా తమిళనాడు గ్రామ దేవతలకు సంబంధించిన బలమైన అంశాలు దర్శకుడు ఆర్జె బాలాజీ జోడించాడు. ఇలాంటి వాటికి సంక్రాంతి బెస్ట్ సీజన్. ఆరవ ప్రేక్షకులు ఎగబడి చూస్తారు. కానీ సూర్య వద్దని చెప్పాడట. ఎందుకంటే తెలుగుతో పాటు సమాంతరంగా రిలీజ్ చేయాల్సిన నేపథ్యంలో ఇక్కడ పోటీ తీవ్రంగా ఉంది. చిరంజీవి, రవితేజ, నవీన్ పోలిశెట్టి, శర్వానంద్, శివ కార్తికేయన్, విజయ్ అందరికీ థియేటర్లు సర్దుబాటు చేయడమే కష్టంగా ఉంది. అలాంటిది కరుప్పు వస్తే ఈ పోటీలో నలిగిపోవడం ఖాయం. అందుకే వద్దన్నాడట.

సో రిపబ్లిక్ డేని టార్గెట్ చేసుకుని కరుప్పు రాబోతోంది. నిజానికి విజయ్ జన నాయకుడుకి జంకి పొంగల్ కి రావట్లేదేమోనని యాంటీ ఫ్యాన్స్ అనుకున్నారు కానీ దాంట్లో నిజం లేదట. పైగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా బ్యాలన్స్ ఉండటంతో హడావిడి వద్దని అనుకున్నారు. అర్థం కానీ కరుప్పు టైటిల్ తెలుగులో మార్చమని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. నిర్మాతలు ఏ మేరకు వింటారో చూడాలి. కార్తీ అయితే తన వా వాతియర్ ని అన్నగారు వస్తారుగా మార్పించి మంచి పని చేశాడు. మరి తమిళ వాసన గుప్పున కొడుతున్న కరుప్పుకి ఒరిజినల్ పేరే పెడతారో లేక తెలుగు వరకు మారుస్తారో చూడాలి.

This post was last modified on November 24, 2025 10:41 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

1 hour ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

1 hour ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

2 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

3 hours ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

6 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

6 hours ago