ఎంత పోటీ ఉన్నా సరే సంక్రాంతికి వచ్చే తీరతాం అని శపధం చేసిన సినిమాల్లో అనగనగా ఒక రాజు ఉంది. నవీన్ పోలిశెట్టి హీరోగా మారి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఎంటర్ టైనర్ జనవరి 14 డేట్ ఎప్పుడో వేసుకుంది. దానికి తగ్గట్టే పండగలకు పబ్బాలకు నవీన్ వీడియో కంటెంట్ రూపంలో ఏదో ఒక హడావిడి చేస్తూనే వచ్చాడు. అవి రీచ్ అయ్యాయి కూడా. కానీ ఉన్నట్టుండి దీపావళి తర్వాత హఠాత్తుగా సైలెంట్ అయిపోవడం పలు అనుమానాలు రేకెత్తిస్తోంది. ఎందుకంటే అనగనగా ఒక రాజు నుంచి ఇప్పటిదాకా ఒక్క లిరికల్ సాంగ్ రిలీజ్ కాలేదు. మిక్కీ జె మేయర్ పాటలైతే ఇచ్చాడు కానీ ఎందుకో ఆలస్యం చేస్తున్నారు.
ఇన్ సైడ్ టాక్ అయితే మరోలా ఉంది. షూటింగ్ ఇంకో ముప్పై రోజుల దాకా ఉందట. ఇది నిజమైతే వర్క్ చాలా టైట్ అయిపోతుంది. లేనిపోని ఒత్తిడితో సతమతమవ్వాల్సి ఉంటుంది. కానీ నిర్మాత నాగవంశీ ఈ మధ్య అందుబాటులోకి రావడం లేదు. విజయ్ జన నాయకుడు హక్కులు కొంటారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏదైనా అడుగుదామంటే దొరికే ఛాన్స్ లేదు. మాస్ జాతర రిజల్ట్ తర్వాత బొత్తిగా దర్శనం లేదు. అఖండ 2 ప్రొడ్యూసర్లతో ఇంటర్వ్యూ చేయడం ద్వారా వీడియోలో కనిపించారు కానీ డైరెక్ట్ కాంటాక్ట్ నో. సో రాజుగారు గురించి క్లారిటీ రావాలంటే ఇంకొద్దిరోజులు ఆగాల్సి వచ్చేలా ఉంది.
అనుమానం లేకుండా రాజా సాబ్ జనవరి 9 రావడం ఫిక్స్ అయిపోయింది. మన శంకవవరప్రసాద్ గారుని ఎట్టి పరిస్థితుల్లో అనిల్ రావిపూడి పండగకు దించడం ఖాయం. భర్త మహాశయులకు విజ్ఞప్తి సైతం కాంపిటీషన్ కు సై అంటోంది. డబ్బింగ్ బొమ్మలు జన నాయకుడు, పరాశక్తికి సంబంధించిన తెలుగు బయ్యర్లు త్వరలో ఫైనల్ కాబోతున్నారు. నారి నారి నడుమ మురారి రావడం డౌటేనని ఇన్ సైడ్ టాక్. కానీ టీమ్ మాత్రం తగ్గేదేలే అంటోంది. ఇక అనగనగా ఒక రాజు అప్పుడప్పుడు సౌండ్ చేస్తే బెటర్. ఒకవేళ వాయిదా పడిందంటే మాత్రం జనవరి చివరి వారంలో రిపబ్లిక్ డే సందర్భంగా రావాల్సి ఉంటుంది.
This post was last modified on November 24, 2025 10:50 pm
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…