ఏపీలో కూటమి పాలన వచ్చాక పవన్ కళ్యాణ్ పెండింగ్ పడిపోయి అభిమానులకు తక్కువ నమ్మకం ఉన్న సినిమాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఉంది. తేరికి రీమేక్ అనే ప్రచారం కాస్త నెగటివ్ బజ్ తీసుకొచ్చిన మాట వాస్తవం. పైగా దర్శకుడు హరీష్ శంకర్ ముందు రాసుకున్న భవదీయుడు భగత్ సింగ్ ని పక్కనపెట్టి దాని స్థానంలో ఉస్తాద్ ని తేవడం అభిమానుల్లో అనుమానాలు పెంచింది. అయితే ఒకటి రెండు పోలికలు అనిపించినప్పటికీ ఇది పూర్తిగా కొత్త స్టోరీ అని, కంపారిజన్ చేయడానికి ఛాన్స్ లేనట్టుగా డైరెక్టర్ తో పాటు ఆ టీమ్ లో ఉన్న దశరథ్ లాంటి సీనియర్లు చెప్పారు. ఇదంతా బాగానే ఉంది కానీ అసలు విషయానికి వద్దాం.
నిన్న జరిగిన ఆంధ్రకింగ్ తాలూకా ఈవెంట్ లో నిర్మాత మైత్రి రవిశంకర్ మాట్లాడుతూ ఓజిని మించి ఉస్తాద్ భగత్ సింగ్ ఉంటుందని చెప్పి ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కెరీర్ మొత్తంలో అనౌన్స్ మెంట్ స్టేజి నుంచి ప్రీమియర్ షో దాకా భారీ క్రేజ్ మోసిన మూవీ ఓజినే. దీనికి సంబంధించిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ బులెట్ లాగా దూసుకుపోయింది. అంచనాలకు తగ్గట్టే బ్లాక్ బస్టర్ అయ్యింది. కానీ ఉస్తాద్ దానికి మించి అని చెప్పడం చాలా పెద్ద స్టేట్ మెంట్. ఎందుకంటే దీన్ని ఆధారంగా చేసుకుని ఫ్యాన్స్ ఎక్కడలేని అంచనాలు పెంచేసుకుంటారు. ఇదే అసలు రిస్క్.
మరి అంతగా హరీష్ శంకర్ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ని ఎలా చూపించాడనేది వేచి చూడాలి. వచ్చే నెల మొదటి ఆడియో సింగల్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ మొదటి రెండు వారాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ ఉంటుందని రవిశంకర్ చెప్పారు. అయితే మైత్రినే నిర్మాణ భాగస్వామిగా ఉన్న పెద్ది మార్చి 27 రానుంది. అబ్బాయికి బాబాయికి కేవలం వారం గ్యాప్ మాత్రమే ఉంటుందా అనేది అసలు ప్రశ్న. స్టార్ హీరోల సినిమాల విషయంలో ఏదీ మాట మీద ఉండే పరిస్థితి లేదు కాబట్టి ఆలోగా ఏమేం మార్పులు, షాకులు జరుగుతాయో వేచి చూడాలి. ప్రస్తుతం ఉస్తాద్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
This post was last modified on November 23, 2025 2:17 pm
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…
ఢిల్లీలో జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సమ్మిట్లో గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రదర్శించిన ఒక రోబో డాగ్ ఇప్పుడు పెద్ద వివాదానికి…