కేవలం రెండు సినిమాల అనుభవంతో ఇండియాలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడైపోయాడు ప్రశాంత్ నీల్. ఇదంతా ‘కేజీఎఫ్’ మహిమ. ఆ సినిమా సంచలన విజయం సాధించి వివిధ భాషల స్టార్లు ప్రశాంత్ వైపు చూసేలా చేసింది. ముఖ్యంగా టాలీవుడ్ స్టార్లు అతడితో సినిమా చేయడానికి అమితాసక్తి చూపించారు. ప్రశాంత్ కూడా టాలీవుడ్ను నిరాశపరచకుండా ప్రభాస్, ఎన్టీఆర్లతో సినిమాలకు కమిట్మెంట్ ఇచ్చాడు. ముందుగా ప్రభాస్తో ‘సలార్’ సినిమాను అతను మొదలుపెట్టబోతున్నాడు.
ఐతే తనకు లైఫ్ ఇచ్చిన శాండిల్వుడ్ను నిర్లక్ష్యం చేసి టాలీవుడ్ స్టార్ల కోసం పరుగులు పెడుతున్నాడంటూ ప్రశాంత్ మీద కన్నడిగులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. సోషల్ మీడియాలో అతణ్ని ఓ ఆట ఆడుకుంటున్నారు. ఇంతకుముందు ఎన్టీఆర్ సినిమాను కన్ఫమ్ చేసినపుడు, ఇప్పుడు ప్రభాస్ సినిమాను ప్రకటించినపుడు ఇది స్పష్టంగా కనిపించింది.
ఐతే సొంతగడ్డ నుంచి ఈ వ్యతిరేకత చూశాక ప్రశాంత్ అప్రమత్తం అయ్యాడు. తాను ప్రభాస్తోనే ఎందుకు సినిమా చేస్తున్నానో అతను వివరణ ఇచ్చుకున్నాడు. ‘‘నేను దర్శకుడిగా పేరు తెచ్చుకున్నది కన్నడ సినిమాలతోనే. ఉగ్రం, కేజీఎఫ్ సినిమాలతో నాకు పేరొచ్చింది. ఐతే ఇప్పుడు ఇక్కడున్న హీరోలను కాకుండా తెలుగు ఇండస్ట్రీకి చెందిన ప్రభాస్ను నా తర్వాతి సినిమాకు హీరోగా ఎంచుకోవడం గురించి చాలామంది అడుగుతున్నారు. ఐతే నేను రాసుకున్న ‘సలార్’ కథకు ప్రభాస్ అయితేనే సరిపోతాడని అనిపించే అతడితో చేస్తున్నా. మిగతా విషయాలు సినిమా విడుదలయ్యాక మాట్లాడుకుందాం’’ అని ప్రశాంత్ అన్నాడు.
ఇక ‘సలార్’ టైటిల్కు అర్థం వివరిస్తూ.. ‘‘ఈ టైటిల్ గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అది ఒక సామాన్యమైన పదం. ఉర్దూలో సమర్థమంతమైన నాయకుడు అని దానికర్థం. రాజుకు కుడి భుజంగా ఉంటూ ప్రజల సంరక్షణ కోసం పాటుపడే వ్యక్తి అని కూడా అనొచ్చు. కథకు అద్దం పట్టేలా ఫస్ట్ లుక్ తీర్చిదిద్దాం. అది చూసి ప్రభాస్ ఆర్మీ మ్యాన్ అనుకుంటారనే ‘సలార్’ అనే టైటిల్ కూడా ప్రకటించాం’’ అని ప్రశాంత్ అన్నాడు.
This post was last modified on December 4, 2020 4:24 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…