Movie News

జై హనుమాన్… ఎట్టకేలకు కదిలిన వర్మ?

పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ అయిన ‘హనుమాన్’ సినిమా రిలీజై రెండేళ్లు కావస్తోంది. ఆ సినిమా చివర్లో దీని సీక్వెల్ గురించి హింట్ ఇచ్చారు. అప్పట్నుంచి ఈ చిత్రం ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. కానీ ఇదిగో అదిగో అంటున్నారే తప్ప ఈ సినిమా ముందుకు కదలడం లేదు. ఈ చిత్రంలో హనుమంతుడి పాత్రను కన్నడ నటుడు రిషబ్ శెట్టి పోషించబోతున్నట్లు ప్రకటన వచ్చి కూడా ఏడాది దాటిపోతోంది. కానీ ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లడానికి మాత్రం ముహూర్తం కుదరడం లేదు.

ఈ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ వేరే సినిమా కూడా ఏదీ మొదలుపెట్టనే లేదు. రకరకాల ప్రాజెక్టులను అనౌన్స్ చేస్తున్నాడే తప్ప ఏదీ ముందుకు కదలడం లేదు. మరి ‘జై హనుమాన్’ను అయినా ముందుకు తీసుకెళ్లొచ్చు కదా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఐతే ఎట్టకేలకు అందుకు ముహూర్తం కుదిరినట్లు సమాచారం.

2026 జనవరి నుంచే ‘జై హనుమాన్’ షూటింగ్ మొదలు కానుందట. కొత్త ఏడాదిలో వరుసగా ఆరు నెలల పాటు ఈ చిత్రానికి డేట్స్ ఇచ్చాడట రిషబ్ శెట్టి. ‘జై హనుమాన్’ ఆలస్యం కావడానికి రిషబ్ శెట్టి బిజీగా ఉండడం కూడా ఒక కారణం. ‘కాంతార: చాప్టర్-1’ సినిమాకు అతను రెండేళ్ల పాటు అంకితమై ఉన్నాడు. ఆ చిత్రంతో పాటే ‘జై హనుమాన్’ షూట్‌లో పాల్గొందామని అనుకున్నా కుదరలేదు.

ప్రశాంత్ వర్మ కూడా వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండడం వల్ల అది సాధ్యపడలేదు. ఐతే ఇప్పుడు ఇద్దరూ వీలు చూసుకుని సినిమాను పట్టాలెక్కించడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ‘హనుమాన్’ను ప్రొడ్యూస్ చేసిన నిరంజన్ రెడ్డితో ప్రశాంత్ వర్మకు విభేదాలు తలెత్తాయి. ‘జై హనుమాన్’ను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతోంది. 2027 సంక్రాంతికి ఈ సినిమా రిలీజయ్యే అవకాశాలున్నాయి.

This post was last modified on November 19, 2025 10:51 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రక్తపాతం కోరుకుంటున్న విశ్వక్

ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…

23 minutes ago

సాక్షిపై రఘురామ దావా… అమరావతి రైతులకు కోటి

వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…

54 minutes ago

వారణాసికి అన్నీ పక్కా ప్లానింగ్

రాజమౌళి సినిమాలంటే చెప్పిన డేటుకి రావు అని ప్రేక్షకులు ముందే బలంగా ఫిక్సయిపోయి ఉంటారు. ఆయన చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’…

2 hours ago

ఈసారి డీఎస్సీలో వారిపైనే ప్రత్యేక దృష్టి?

ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగార్ధులకు మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే మరో డీఎస్సీ వేస్తామని ప్రకటించారు. దీంతో…

2 hours ago

ఉస్తాద్ బిజినెస్ కెపాసిటీ ఎంత

ఓజి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమాగా ఉస్తాద్ భగత్ సింగ్ మీద క్రమంగా హైప్ పెంచే ప్రయత్నాలు…

5 hours ago

మదనపల్లి ఘటన మరువకముందే… మరో మృగాడు!

మొన్న మదనపల్లి, నేడు విశాఖ.. మృగాళ్ల అకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. విశాఖపట్నం నగరంలోని పెదగంట్యాడ మండలంలో గురువారం…

5 hours ago