పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ అయిన ‘హనుమాన్’ సినిమా రిలీజై రెండేళ్లు కావస్తోంది. ఆ సినిమా చివర్లో దీని సీక్వెల్ గురించి హింట్ ఇచ్చారు. అప్పట్నుంచి ఈ చిత్రం ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. కానీ ఇదిగో అదిగో అంటున్నారే తప్ప ఈ సినిమా ముందుకు కదలడం లేదు. ఈ చిత్రంలో హనుమంతుడి పాత్రను కన్నడ నటుడు రిషబ్ శెట్టి పోషించబోతున్నట్లు ప్రకటన వచ్చి కూడా ఏడాది దాటిపోతోంది. కానీ ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లడానికి మాత్రం ముహూర్తం కుదరడం లేదు.
ఈ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ వేరే సినిమా కూడా ఏదీ మొదలుపెట్టనే లేదు. రకరకాల ప్రాజెక్టులను అనౌన్స్ చేస్తున్నాడే తప్ప ఏదీ ముందుకు కదలడం లేదు. మరి ‘జై హనుమాన్’ను అయినా ముందుకు తీసుకెళ్లొచ్చు కదా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఐతే ఎట్టకేలకు అందుకు ముహూర్తం కుదిరినట్లు సమాచారం.
2026 జనవరి నుంచే ‘జై హనుమాన్’ షూటింగ్ మొదలు కానుందట. కొత్త ఏడాదిలో వరుసగా ఆరు నెలల పాటు ఈ చిత్రానికి డేట్స్ ఇచ్చాడట రిషబ్ శెట్టి. ‘జై హనుమాన్’ ఆలస్యం కావడానికి రిషబ్ శెట్టి బిజీగా ఉండడం కూడా ఒక కారణం. ‘కాంతార: చాప్టర్-1’ సినిమాకు అతను రెండేళ్ల పాటు అంకితమై ఉన్నాడు. ఆ చిత్రంతో పాటే ‘జై హనుమాన్’ షూట్లో పాల్గొందామని అనుకున్నా కుదరలేదు.
ప్రశాంత్ వర్మ కూడా వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండడం వల్ల అది సాధ్యపడలేదు. ఐతే ఇప్పుడు ఇద్దరూ వీలు చూసుకుని సినిమాను పట్టాలెక్కించడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ‘హనుమాన్’ను ప్రొడ్యూస్ చేసిన నిరంజన్ రెడ్డితో ప్రశాంత్ వర్మకు విభేదాలు తలెత్తాయి. ‘జై హనుమాన్’ను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతోంది. 2027 సంక్రాంతికి ఈ సినిమా రిలీజయ్యే అవకాశాలున్నాయి.
This post was last modified on November 19, 2025 10:51 am
తెలంగాణ రాజకీయాల్లో ఒకప్పుడు తిరుగులేని శక్తిగా వెలిగిన గులాబీ గూటిలో ఇప్పుడు ఆసక్తికరమైన ఆధిపత్య పోరు మొదలైంది. కేసీఆర్ రాజకీయ…
పరిధి.. పరిమితులు ఉంటాయన్న విషయాన్ని మర్చిపోవటం కొంతమంది వైసీపీ నేతలకు అలవాటే. దూకుడే తమ ఆయుధం అన్నట్లుగా వ్యవహరించే తీరు…
వైసీపీ అధినేత జగన్ చేయలేనిది ఇప్పుడు అనేక విషయాల్లో కూటమి ప్రభుత్వం చేసి చూపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో…
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మంగళవారం తన పదవికి రాజీనామా చేసి గవర్నర్కు రాజీనామా పత్రాన్ని సమర్పించారు. దాదాపు 21…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా.. ఇచ్చిన మాట.. ఆరు మాసాలు కూడా తిరక్కుండానే వాస్తవంకానుంది.…
తన రాజకీయ ప్రత్యర్థి వైయస్సార్ పార్టీ అధినేత వైయస్ జగన్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. పార్లమెంట్లో…