గ్యాంగ్ స్టర్లు, నేరస్థులను తెరమీద చూసి ఇలా ఎలా చేస్తారని ఆశ్చర్యపోతాం కానీ నిజ జీవితంలో పైరసీ దొంగల స్టోరీలు అంతకు మించిన ట్విస్టులతో ఉన్నాయి. సుప్రసిద్ధ పైరసీ యాప్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపిన సంగతి తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన వివరాలు పంచుకునేందుకు పోలీస్ కమీషనర్ సజ్జనార్ తో పాటు సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, దిల్ రాజు, సురేష్ బాబు తదితరులు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వెల్లడి చేసిన విషయాలతో ఏకంగా ఒక వెబ్ సిరీస్ తీసేంత మ్యాటర్ ఉండటం అతిశయోక్తి కాదు.
ఇమ్మడి రవి స్వస్థలం విశాఖపట్నం. బిఎస్సి కంప్యూటర్స్ చదివాడు. ప్రహ్లాద్ కుమార్ వెల్లల పేరుతో డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు తీసుకుని దందాలు మొదలుపెట్టాడు. ఒకటి రెండు కాదు ఏకంగా 65కి పైగా మిర్రర్ సైట్లు నిర్వహించి వాటి ద్వారా పైరసీని వ్యాప్తం చేయడమే కాక బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ద్వారా కోట్ల డబ్బు సంపాదించాడు. ఫోన్ నెంబర్లు సంపాదించి వాటికి ఏపికె ఫైల్స్ పంపేవాడు. ఎవరైనా దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే వాళ్ళ డేటా మొత్తం హ్యాక్ చేసి వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకునేవాడు. అతని దగ్గర ఉన్న హార్డ్ డిస్కుల్లో హాలీవుడ్ గాడ్ ఫాదర్ నుంచి టాలీవుడ్ ఓజి దాకా ఇరవై వేల సినిమాలున్నాయి.
ఇప్పటిదాకా ఇమ్మడి రవి పైరసీ ద్వారా సంపాదించిన మొత్తం 20 కోట్ల పైమాటే. అందులో 3 కోట్లు పోలీసులు సీజ్ చేశారు. 50 లక్షల మందికి సంబంధించిన సబ్స్క్రైబర్ డేటా ఇతని దగ్గర ఉందంటే ఏ స్థాయిలో నెట్ వర్క్ ని వాడుకున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఇతర రాష్ట్రాల్లో వేరే పేర్లతో ఐడి కార్డులు తీసుకున్నాడు. సినీ పెద్దలు ఫిర్యాదు చేసాక ఇండియన్ సిటిజెన్ షిప్ వదలుకుని కరేబియన్ దీవుల్లో పౌరసత్వం సంపాదించాడు. 2019లో ఐబొమ్మ మొదలుపట్టి 21 వేల సినిమాలను పైరసీ చేశాడు. అమెరికా, స్విజ్జర్ ల్యాండ్, నెదర్ లాండ్స్ లో సర్వర్లు పెట్టి ఆపరేట్ చేసేవాడు. 100కు పైగా డొమైన్లు కొన్నాడు. ఇలా ఒక పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న ఇమ్మిడి రవి ఏ పోలీసులనైతే సవాల్ చేశాడో చివరికి వాళ్ళ చేతికే చిక్కి కటకటాల పాలయ్యాడు.
This post was last modified on November 17, 2025 12:57 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…