Political News

‘చంద్రబాబు రేవంత్ రెడ్డి గురు శిష్యులని మాకు తెలుసు’

నిన్న హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన రామోజీ ఎక్సలెన్స్ జాతీయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఇద్దరూ ఒకే ఫ్రేమ్ లో కనిపించడం, నవ్వుతూ మాట్లాడుకోవడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇద్దరు సీఎంలు కలవడం ఇది తొలిసారి కాదు.

పెట్టుబడిదారుల సదస్సు విజయవంతం అయిన జోష్ లో చంద్రబాబు ఉన్నారు. అటు జూబ్లీహిల్స్ అభ్యర్దిని గెలిపించుకున్న ఆనందంలో రేవంత్ ఉన్నారు. నాడు గురు శిష్యులు, నేడు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయినా గురువు చంద్రబాబు ముందు ఎప్పుడూ నేను శిష్యుడనే అన్నట్టు రేవంత్ రెడ్డి ఉన్నారు. తెలుగుదేశం నుండి వెళ్ళిపోయి ఇన్ని సంవత్సరాలైనా , రాజకీయంగా ఉన్నత స్థానానికి వెళ్లినా తన మాటల్లో, ప్రవర్తనలో గురువు పట్ల గౌరవం, అభిమానం అణువణువునా కనిపించాయని అక్కడున్న వారంతా అనుకున్నారు. 

ఇదే వేదికపై మాట్లాడిన ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్.. ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఆంధ్రా తెలంగాణ ముఖ్యమంత్రులు గురు శిష్యులు అని మాకు తెలుసు. ఆంధ్రా – తెలంగాణ రెండు కలిసి అభివృద్ధి చెందాలి అని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇద్దరూ నవ్వులు చిందిస్తూ ముచ్చటించుకున్న దృశ్యాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాజకీయ, న్యాయ, సాంస్కృతిక, సామాజిక రంగాలన్నిటి నుండి ప్రముఖులు హాజరయ్యారు.

This post was last modified on November 17, 2025 12:15 pm

Share

Recent Posts

పంజా మీద ఇంత ప్రేమ దాచుకున్నారా

ఏంటో జెన్ జీ ఆడియన్స్ మహా విచిత్రంగా ఉన్నారు. కొన్ని కొత్త సినిమాలను అస్సలు పట్టించుకోరు. కొన్ని రీ రిలీజులకేమో…

11 minutes ago

పవన్ కళ్యాణ్ – ఒక జన సేవకుడి ప్రస్థానం

సినిమా నటులు ఎందరో రాజకీయ నాయకులయ్యారు. అయితే ప్రజల మనసులో బలమైన ముద్ర వేసిన వాళ్ళు మాత్రం కొందరే ఉంటారు.…

2 hours ago

తమిళనాడులో అప్పుడే పెడాకులా…

మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే సీ ఓటర్ చేసిన సర్వే తమిళనాడు టీవీకే, కాంగ్రెస్ కాపురం…

2 hours ago

స్థానిక ఎన్నికలకు SIR చిక్కుముడి?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ( SIR ) చిక్కుముడిగా మారింది.…

2 hours ago

జనసేన ఎమ్మెల్యేపై చంద్రబాబు అసంతృప్తి

కూటమిలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేని…

4 hours ago

ఏపీలో పెరిగిపోతున్న బీపీ… ఆ జిల్లాలో మరీ ఎక్కువ!

ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…

5 hours ago