నిన్న హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన రామోజీ ఎక్సలెన్స్ జాతీయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఇద్దరూ ఒకే ఫ్రేమ్ లో కనిపించడం, నవ్వుతూ మాట్లాడుకోవడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇద్దరు సీఎంలు కలవడం ఇది తొలిసారి కాదు.
పెట్టుబడిదారుల సదస్సు విజయవంతం అయిన జోష్ లో చంద్రబాబు ఉన్నారు. అటు జూబ్లీహిల్స్ అభ్యర్దిని గెలిపించుకున్న ఆనందంలో రేవంత్ ఉన్నారు. నాడు గురు శిష్యులు, నేడు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయినా గురువు చంద్రబాబు ముందు ఎప్పుడూ నేను శిష్యుడనే అన్నట్టు రేవంత్ రెడ్డి ఉన్నారు. తెలుగుదేశం నుండి వెళ్ళిపోయి ఇన్ని సంవత్సరాలైనా , రాజకీయంగా ఉన్నత స్థానానికి వెళ్లినా తన మాటల్లో, ప్రవర్తనలో గురువు పట్ల గౌరవం, అభిమానం అణువణువునా కనిపించాయని అక్కడున్న వారంతా అనుకున్నారు.
ఇదే వేదికపై మాట్లాడిన ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్.. ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఆంధ్రా తెలంగాణ ముఖ్యమంత్రులు గురు శిష్యులు అని మాకు తెలుసు. ఆంధ్రా – తెలంగాణ రెండు కలిసి అభివృద్ధి చెందాలి అని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇద్దరూ నవ్వులు చిందిస్తూ ముచ్చటించుకున్న దృశ్యాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాజకీయ, న్యాయ, సాంస్కృతిక, సామాజిక రంగాలన్నిటి నుండి ప్రముఖులు హాజరయ్యారు.
This post was last modified on November 17, 2025 12:15 pm
మోహన్ లాల్ దృశ్యం 3 మరోసారి రిలీజ్ డేట్ ప్రకటించింది. మే 21 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అడుగు పెట్టబోతున్నట్టు అధికారికంగా…
బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ల తర్వాత సూర్య సినిమాలు వరసగా రాబోతున్నాయి. వాటిలో మొదటిది వీరభద్రుడు. తమిళంలో కరుప్పుగా రూపొందిన…
సొంత పార్టీ నాయకుడు తప్పు చేస్తే ఒకవిధంగా.. ప్రత్యర్థి పార్టీ నేతలు తప్పులు చేస్తే మరో విధంగా మారి పోయిన…
మే 1 విడుదల కాబోతున్న గాయపడ్డ సింహం మీద టీమ్ కన్నా ఎక్కువగా బయ్యర్ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే…
వెనకటికి పాత కథ ఒకటుంది. ఒక రొట్టె కోసం రెండు పిల్లులు పోట్లాడుకుంటే తీర్పు చెప్పడానికి వచ్చిన కోతి దాన్ని…
చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేసే సాయిపల్లవి కాంబోల కన్నా ఎక్కువగా కంటెంట్ కి ప్రాధాన్యం ఇవ్వడం అందరికీ తెలిసిన…