Political News

‘చంద్రబాబు రేవంత్ రెడ్డి గురు శిష్యులని మాకు తెలుసు’

నిన్న హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన రామోజీ ఎక్సలెన్స్ జాతీయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఇద్దరూ ఒకే ఫ్రేమ్ లో కనిపించడం, నవ్వుతూ మాట్లాడుకోవడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇద్దరు సీఎంలు కలవడం ఇది తొలిసారి కాదు.

పెట్టుబడిదారుల సదస్సు విజయవంతం అయిన జోష్ లో చంద్రబాబు ఉన్నారు. అటు జూబ్లీహిల్స్ అభ్యర్దిని గెలిపించుకున్న ఆనందంలో రేవంత్ ఉన్నారు. నాడు గురు శిష్యులు, నేడు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయినా గురువు చంద్రబాబు ముందు ఎప్పుడూ నేను శిష్యుడనే అన్నట్టు రేవంత్ రెడ్డి ఉన్నారు. తెలుగుదేశం నుండి వెళ్ళిపోయి ఇన్ని సంవత్సరాలైనా , రాజకీయంగా ఉన్నత స్థానానికి వెళ్లినా తన మాటల్లో, ప్రవర్తనలో గురువు పట్ల గౌరవం, అభిమానం అణువణువునా కనిపించాయని అక్కడున్న వారంతా అనుకున్నారు. 

ఇదే వేదికపై మాట్లాడిన ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్.. ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఆంధ్రా తెలంగాణ ముఖ్యమంత్రులు గురు శిష్యులు అని మాకు తెలుసు. ఆంధ్రా – తెలంగాణ రెండు కలిసి అభివృద్ధి చెందాలి అని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇద్దరూ నవ్వులు చిందిస్తూ ముచ్చటించుకున్న దృశ్యాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాజకీయ, న్యాయ, సాంస్కృతిక, సామాజిక రంగాలన్నిటి నుండి ప్రముఖులు హాజరయ్యారు.

This post was last modified on November 17, 2025 12:15 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

హనుమాన్ 3D వర్కౌట్ అవుతుందా

తేజ సజ్జ కెరీర్ ని ఒక్కసారిగా మలుపు తిప్పిన బ్లాక్ బస్టర్ హనుమాన్. మహేష్ బాబు, నాగార్జున, వెంకటేష్ లాంటి…

2 hours ago

త్రిష ‘నో’ చెప్పడానికి సిద్ధపడిందా

రజనీకాంత్, కమల్ హాసన్ కలయికలో తెరకెక్కబోతున్న మల్టీస్టారర్ క్యాస్టింగ్ సెట్ చేసుకోవడం దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కు పెద్ద…

3 hours ago

కూతురి డేటింగ్.. కియారా కామెంట్‌పై దుమారం

బాలీవుడ్ అగ్ర క‌థానాయిక‌ల్లో ఒక‌రైన కియారా అద్వానీ.. కెరీర్ పీక్స్‌లో ఉండ‌గానే త‌న స‌హ న‌టుడు సిద్దార్థ్ మ‌ల్హోత్రాను పెళ్లి…

5 hours ago

మూడో బిడ్డకు 30 వేలు.. నాలుగో బిడ్డకు 40 వేలు

ఏపీలో జనాభా పెరుగుదలకు కూటమి సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కూటమి రథసారధి టీడీపీ అధినేత, ఏపీ…

6 hours ago

భ‌గీర‌థ్ కోసం లుకౌట్ నోటీసులు

బాలిక‌పై లైంగిక వేధింపుల కేసును ఎదుర్కొంటున్న భ‌గీర‌థ్ విష‌యంలో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ఆయ‌న దేశం విడిచి పారిపోకుండా…

6 hours ago

ప్రెస్ మీట్లో హీరో క‌న్నీళ్లు

త‌మిళ టాప్ స్టార్లలో ఒక‌డైన ర‌వి మోహ‌న్.. రెండేళ్ల ముందు భార్య ఆర్తి నుంచి విడిపోవ‌డం.. కెనీషా అనే సింగ‌ర్‌తో…

6 hours ago