కొన్ని బాక్సాఫీస్ ఫలితాలు అంతుచిక్కవు. అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి తరహాలో ఎంత విశ్లేషించుకున్నా వాటి వెనుక నిజాలు అర్థం కావు. కుబేరది అలాంటి పరిస్థితే. నెలల క్రితం వచ్చిన సినిమా ప్రస్తావన ఇప్పుడు తేవడానికి కారణం ఉంది. కుబేర నిర్మాణ సంస్థ అధినేత సునీల్ నారంగ్ కూతురు జాన్వీ నారంగ్ తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో కుబేర ప్రస్తావన వచ్చింది. తెలుగు రాష్ట్రాలు, యుఎస్, యుకెలో యునానిమస్ గా పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్న మూవీ, ధనుష్ స్వంత రాష్ట్రమైన తమిళనాడులో ఫ్లాప్ కావడం అంతు చిక్కలేదని, ప్రమోషన్ల పరంగా తాము చేయాల్సిందంతా చేశామని చెప్పుకొచ్చారు.
ఇక్కడ అనాలిసిస్ చేసుకోవాల్సిన విషయాలు కొన్నున్నాయి. మొదటిది దర్శకుడు శేఖర్ కమ్ముల స్టైల్ తమిళ ప్రేక్షకులకు పరిచయం లేకపోవడం. హ్యాపీ డేస్, గోదావరి, లీడర్, ఆనంద్ లాంటివి ఎంత సక్సెస్ అయినా అవి కోలీవుడ్ లో రీమేక్ కాకపోవడానికి కారణమేంటో చెప్పనక్కర్లేదు. అక్కడి ఆడియన్స్ కి నచ్చేలా నేటివిటీని చూపించడంలో శేఖర్ కమ్ముల పడే తడబాటు ఆయన రీచ్ ని పరిమితం చేస్తుంది. రెండోది ధనుష్ పాత్రకు కమర్షియల్ టచ్ ఎక్కువగా లేకపోవడంతో తమిళ ఫ్యాన్స్ కు రుచించలేదు. దీంతో సహజంగానే కుబేరకు వాళ్ళు అంతగా కనెక్ట్ కాలేకపోయారు. వసూళ్ల మీద ఇది ప్రభావం చూపించింది.
ఇటీవలే వచ్చిన ఇడ్లి కొట్టు తమిళంలో చెప్పుకోదగ్గ స్థాయిలో డీసెంట్ గా ఆడితే తెలుగులో డిజాస్టర్ అయ్యింది. దీనికి రీజన్ అర్థమయ్యిందిగా. ఓవర్ సెంటిమెంట్ డోస్, ఎమోషన్స్, లోకల్ ఫ్లేవర్ మన దగ్గర పని చేయలేదు. దీంతో ఫ్లాప్ తప్పలేదు. అంతే కుబేరకు వచ్చిన రిజల్ట్ ఇడ్లి కొట్టుకి పూర్తిగా రివర్స్ అయ్యింది. ఫాంటసీ, మాస్ ఎలివేషన్లున్న సినిమాలే ప్యాన్ ఇండియా పరంగా వర్కౌట్ అవుతాయి కానీ కుబేర లాంటి డిఫరెంట్ కంటెంట్ అన్ని వర్గాలను మెప్పించలేదు. రాజమౌళి, ప్రశాంత్ నీల్, సుకుమార్ లాంటి వాళ్ళు ఇది దృష్టిలో ఉంచుకునే యునానిమస్ గా రీచ్ అయ్యే కథలనే తెరకెక్కిస్తారు. సక్సెసవుతారు.
తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువ ఉద్యోగుల మరణ వార్తలు అమెరికా నుంచి వరుసగా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు…
వైసీపీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో ఆదివారం నిర్వహించిన కాపుల సభలో మాజీ మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన బొత్స…
బిచ్చగాడు హీరోగా విజయ్ ఆంటోనీకి ఫ్లాపులతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది. అయితే వరస డిజాస్టర్లు తన…
అగ్రరాజ్యం అమెరికాలో చదువుకునేందుకు వెళ్లేవారు అప్రమత్తం కావాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటి వరకు ఈ దేశంలో చదువుకునేందుకు వెళ్లేవారు.. ఎడ్యుకేషన్…
400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…
ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…