పేరుకు ఢిల్లీ భామే కానీ.. రాశి ఖన్నాను తెలుగమ్మాయిలాగే చూస్తారు మన ప్రేక్షకులు. ఈ మధ్య తెలుగులో సినిమాలు తగ్గాయి కానీ.. ఆమె కెరీర్లో ఎక్కువ చిత్రాలు చేసింది తెలుగులోనే. ఇటీవలే ‘తెలుసు కదా’ చిత్రంలో మంచి పెర్ఫామెన్స్తో ఆకట్టుకుంది రాశి. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తన లవ్ లైఫ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది రాశి. తాను రెండుసార్లు ప్రేమలో పడ్డానని.. అందులో ఒకటి సినిమాల్లోకి రాకముందు అని చెప్పింది.
రెండోది ఇండస్ట్రీలోకి వచ్చాక అని, ఐతే తాను ప్రస్తుతం రిలేషన్షిప్లో ఉన్నానా లేనా అన్నది మాత్రం చెప్పలేనని ఆమె అంది. ఆ వ్యాఖ్యలు చూస్తే.. ప్రస్తుతం రాశి ఎవరితోనో ప్రేమలో ఉన్నట్లే కనిపించింది. ఇప్పుడు ఆ రిలేషన్షిప్ గురించి ఒక ఫొటో ద్వారా పరోక్షంగా హింట్ కూడా ఇచ్చేసింది రాశి.
తాజాగా తన ఇన్స్టా స్టోరీలో రాశి ఒక ఫొటో షేర్ చేసింది. అందులో ఆమె ఒక వ్యక్తిని కౌగిలించుకుని ఉంది. తన ముఖం మాత్రం కనిపించడం లేదు. ఆ ఫొటోకు.. ‘‘కౌగిలించుకుంటే ఈ ప్రపంచ సున్నితంగా కనిపిస్తుంది’’ అని వ్యాఖ్య జోడించింది రాశి. ఈ ఫొటో, కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫొటోలో ఉన్నది రాశి సీక్రెట్ లవరే అని.. తాను రిలేషన్షిప్లో ఉన్నట్లు రాశి కన్ఫమ్ చేసేసినట్లే అని.. ఇక తెలియాల్సిందల్లా ఆ వ్యక్తి ఎవరన్నదే అని చర్చించుకుంటున్నారు.
రాశితో ప్రేమలో ఉన్న వ్యక్తి సినీ రంగానికి చెందిన వాడా కాదా అనే డిస్కషన్ నడుస్తోంది. మరి ఈ విషయాన్ని రాశి ఎప్పుడు బయటపెడుతుందో చూడాలి. ప్రస్తుతం ఆమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. హిందీలోనూ ఆమె ఒక సినిమా చేస్తున్నట్లు సమాచారం.
This post was last modified on October 29, 2025 6:35 pm
2009లో అవతార్ సినిమా రిలీజైనపుడు వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ ఎలా షేక్ అయిపోయిందో తెలిసిందే. అప్పటిదాకా ఉన్న అన్ని బాక్సాఫీస్…
ఉప్పెన సినిమా చేసే సమయానికి కృతి శెట్టి వయసు కేవలం 17 ఏళ్లే. అంత చిన్న వయసులోనే ఆమె భారీ…
ఒకప్పుడు అప్పు చేయాలంటే భయపడేవాళ్లు, అది అవసరానికి మాత్రమే తీసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు సీన్ మారింది. అప్పు చేయడం తప్పు…
కూలీ సినిమా విడుదలకు ముందు దర్శకుడు లోకేష్ కనకరాజ్ భవిష్యత్ ప్రాజెక్టుల గురించి ఎంత చర్చ జరిగిందో.. ఎన్ని ఊహాగానాలు…
అఖిల్ కెరీర్ను మార్చేస్తుందని.. అతడిని పెద్ద స్టార్ను చేస్తుందని అక్కినేని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా.. ఏజెంట్. అతనొక్కడే,…
ప్రముఖ శ్రీ కృష్ణ క్షేత్రం ఉడిపిలోని పుట్టిగే శ్రీ కృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన బృహత్ గీతోత్సవ కార్యక్రమంలో ఏపీ…