Movie News

ఆ ప్రశ్నకు బైసన్ దర్శకుడు హర్ట్

తమిళంలో కుల వివక్ష మీద సినిమాలు మిగతా భాషలతో పోలిస్తే కాస్త ఎక్కువే వస్తుంటాయి. అక్కడ కొందరు దర్శకుడు ‘కులం’ కోణం లేకుండా సినిమాలే తీయరని పేరుంది. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది పా.రంజిత్ గురించి. చిన్నతనం నుంచి కులవివక్షను ఎదుర్కొని.. ఎన్నో కష్టాలు పడి ఎదిగిన రంజిత్.. తన ప్రతి సినిమాలోనూ ఆ అంశాలను స్పృశిస్తూ ఉంటాడు. ‘అట్టకత్తి’ నుంచి ‘తంగలాన్’ వరకు ప్రతి సినిమాలోనూ ఈ కోణాన్ని చూడొచ్చు.

రంజిత్ తర్వాత.. మారి సెల్వరాజ్ అనే మరో దర్శకుడు కూడా ఈ కోవకే చెందుతాడు. ‘పరియేరుమ్ పెరుమాల్’ అనే నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీతో అతను దర్శకుడిగా పరిచయం అయ్యాడు. దాంతో పాటు కర్ణన్, మామన్నన్, వాళై.. తాజాగా వచ్చిన ‘బైసన్’ కులం చుట్టూ తిరిగే సినిమాలే. ఐతే తన సినిమాలంటే ఇలాగే ఉంటాయి అనే ఒక ముద్ర పడిపోయింది. ‘బైసన్’ చూశాక కొంతమంది ఈ విషయంలో విమర్శలు కూడా చేశారు.

ఐతే ఈ కామెంట్లకు దర్శకుడు మారి సెల్వరాజ్ బాగానే హర్టయినట్లున్నాడు. ఎప్పుడూ ఇవే సినిమాలే అనే వాళ్లకు అతను ఒక ప్రెస్ మీట్లో సమాధానం చెప్పాడు. ఇలాంటి కామెంట్లు తనను చాలా బాధ పెడతాయన్నాడు. సంవత్సరంలో ఎంటర్టైన్మెంట్ బేస్డ్ సినిమాలు 250-300 దాకా వస్తాయని.. మరి అవే ఎందుకు తీస్తారని ఎవ్వరూ అడగరని.. కానీ సామాజిక సమస్యల మీద తన లాంటి వాళ్లు సినిమాలు తీస్తే మాత్రం వాటి మీద ప్రశ్నలు సంధిస్తారని అతనన్నాడు.

తాను ఎవరో ఏదో అన్నారని మారనని.. ఇలాంటి సినిమాలు తీయడంలో తాను చాలా మొండి పట్టుదలతో ఉన్నానని మారి తెలిపాడు. తన జీవితంలో ఎదురైన అనుభవాల నేపథ్యంలోనే తాను ఈ తరహా సినిమాలు తీస్తున్నానని.. ఇవి సమాజానికి చాలా అవసరమని అతను అభిప్రాయపడ్డాడు. బైసన్ మీద ప్రేమ చూపిస్తున్న వాళ్లందరికీ అతను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపాడు. దీపావళికి తమిళంలో విడుదలై విజయవంతమైన బైసన్.. ఈ వీకెండ్లో తెలుగులోనూ రిలీజై మంచి స్పందనే తెచ్చుకుంటోంది.

This post was last modified on October 26, 2025 4:27 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

బస్సు ప్రమాదం… కత్తితో 8 మందిని కాపాడిన రియల్ హీరో

మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తీరని విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. అయితే ఇదే ప్రమాదంలో మరోవైపు…

13 seconds ago

సంక్షోభాన్ని అడ్డుకునేందుకు భారత్ ప్లాన్ బీ

పశ్చిమ ఆసియాలో యుద్ధం ముదురుతున్న కొద్దీ భారత్ తన ఇంధన అవసరాల కోసం వ్యూహాలను వేగవంతం చేస్తోంది. చమురు, గ్యాస్…

22 minutes ago

భోజనంలో పురుగులు… వందేభారత్ రామానుజం ఏం చేశాడు?

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులకు అందించే భోజనం నాణ్యతపై మరోసారి పెద్ద వివాదం రాజుకుంది. పాట్నా నుంచి టాటానగర్ వెళ్లే…

2 hours ago

చిరు బాబీ మిస్… వెంకీ అనిల్ ఫిక్స్

వరసగా సినిమాలు చేస్తున్నా సక్సెస్ మాత్రం అందని ద్రాక్ష పండులా మారిపోయిన ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి సరైన బ్రేక్…

2 hours ago

ధైర్యం అనుమానం మధ్య ‘పెద్ది’ సందిగ్ధం

రేపు ప్రారంభం కావాల్సిన పెద్ది ఓవర్ సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఏప్రిల్ 8కి వాయిదా వేయడం అభిమానుల్లో ఖంగారు పుట్టిస్తోంది.…

2 hours ago

వెయ్యి కోట్ల విధ్వంసం వారం రోజుల్లోనే

అంచనాలకు మించి దురంధర్ ది రివెంజ్ అరాచకం చేస్తోంది. సరిగ్గా వారం రోజులు కావడం ఆలస్యం వెయ్యి కోట్ల క్లబ్బులోకి…

4 hours ago