Movie News

ఆ ప్రశ్నకు బైసన్ దర్శకుడు హర్ట్

తమిళంలో కుల వివక్ష మీద సినిమాలు మిగతా భాషలతో పోలిస్తే కాస్త ఎక్కువే వస్తుంటాయి. అక్కడ కొందరు దర్శకుడు ‘కులం’ కోణం లేకుండా సినిమాలే తీయరని పేరుంది. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది పా.రంజిత్ గురించి. చిన్నతనం నుంచి కులవివక్షను ఎదుర్కొని.. ఎన్నో కష్టాలు పడి ఎదిగిన రంజిత్.. తన ప్రతి సినిమాలోనూ ఆ అంశాలను స్పృశిస్తూ ఉంటాడు. ‘అట్టకత్తి’ నుంచి ‘తంగలాన్’ వరకు ప్రతి సినిమాలోనూ ఈ కోణాన్ని చూడొచ్చు.

రంజిత్ తర్వాత.. మారి సెల్వరాజ్ అనే మరో దర్శకుడు కూడా ఈ కోవకే చెందుతాడు. ‘పరియేరుమ్ పెరుమాల్’ అనే నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీతో అతను దర్శకుడిగా పరిచయం అయ్యాడు. దాంతో పాటు కర్ణన్, మామన్నన్, వాళై.. తాజాగా వచ్చిన ‘బైసన్’ కులం చుట్టూ తిరిగే సినిమాలే. ఐతే తన సినిమాలంటే ఇలాగే ఉంటాయి అనే ఒక ముద్ర పడిపోయింది. ‘బైసన్’ చూశాక కొంతమంది ఈ విషయంలో విమర్శలు కూడా చేశారు.

ఐతే ఈ కామెంట్లకు దర్శకుడు మారి సెల్వరాజ్ బాగానే హర్టయినట్లున్నాడు. ఎప్పుడూ ఇవే సినిమాలే అనే వాళ్లకు అతను ఒక ప్రెస్ మీట్లో సమాధానం చెప్పాడు. ఇలాంటి కామెంట్లు తనను చాలా బాధ పెడతాయన్నాడు. సంవత్సరంలో ఎంటర్టైన్మెంట్ బేస్డ్ సినిమాలు 250-300 దాకా వస్తాయని.. మరి అవే ఎందుకు తీస్తారని ఎవ్వరూ అడగరని.. కానీ సామాజిక సమస్యల మీద తన లాంటి వాళ్లు సినిమాలు తీస్తే మాత్రం వాటి మీద ప్రశ్నలు సంధిస్తారని అతనన్నాడు.

తాను ఎవరో ఏదో అన్నారని మారనని.. ఇలాంటి సినిమాలు తీయడంలో తాను చాలా మొండి పట్టుదలతో ఉన్నానని మారి తెలిపాడు. తన జీవితంలో ఎదురైన అనుభవాల నేపథ్యంలోనే తాను ఈ తరహా సినిమాలు తీస్తున్నానని.. ఇవి సమాజానికి చాలా అవసరమని అతను అభిప్రాయపడ్డాడు. బైసన్ మీద ప్రేమ చూపిస్తున్న వాళ్లందరికీ అతను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపాడు. దీపావళికి తమిళంలో విడుదలై విజయవంతమైన బైసన్.. ఈ వీకెండ్లో తెలుగులోనూ రిలీజై మంచి స్పందనే తెచ్చుకుంటోంది.

This post was last modified on October 26, 2025 4:27 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

బాలీవుడ్ బయ్యర్ల నరాలు చిట్లిపోతున్నాయ్

అంతా సవ్యంగా ఉంది, మార్చి 19 నుంచి థియేటర్లలో నాన్ స్టాప్ ఇరవై నాలుగు గంటలు షోలు వేసుకుంటూ పెద్ద…

10 minutes ago

అక్కడ ‘పవన్’ పేరు బాగా వినిపిస్తుంది

గ్రామీణ భార‌తంపై జ‌న‌సేన సైలెంట్ వేవ్‌తో దూసుకుపోతోందా? ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల‌కే ప‌రిమితం అయిన జ‌న‌సేన ఇప్పుడు గ్రామీణ…

2 hours ago

కమిన్స్ రేంజ్ లో సైలెంట్ చేస్తాడట

టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ పోరు మొదలవ్వక ముందే మాటల యుద్ధం మొదలైంది. ముంబై వేదికగా జరగనున్న భారత్ vs…

2 hours ago

మైత్రి దగ్గరే దేవికి ఈ పంచాయితీ ఏంటో?

టాలీవుడ్ సంగీత దర్శకుల్లో దేవిశ్రీ ప్రసాద్‌ది సపరేట్ స్టయిల్. కొంచెం టైం తీసుకుని అయినా ప్రత్యేకమైన పాటలు, బీజీఎం ఇవ్వాలని…

2 hours ago

మిర్చి అందాలతో పర్యాటక అభివృద్ధి?

ఆకాశం నుంచి చూస్తే భూమంతా ఎర్రటి దుప్పటి కప్పుకున్నట్టుగా కనిపించే గుంటూరు మిర్చి దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా…

2 hours ago

భార్యతో విజయ్ భారీ డీల్?

ఒక ప్రముఖ సినీ నటుడు రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నాడంటే.. అతడి బలహీనతల మీద అవతలి రాజకీయ పక్షాలు దృష్టిసారించడం.. ముఖ్యంగా…

3 hours ago