టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్ ఉన్నంతగా సోషల్ మీడియాలో ఇంకెవ్వరూ యాక్టివ్గా ఉండరనే సంగతి అందరికీ తెలిసిందే. ఆ మాటకొస్తే ఇండియా మొత్తంలో కూడా తమన్లా సోషల్ మీడియాలో చురుగ్గా కనిపించరు. తన సినిమాలను అతను సామాజిక మాధ్యమాల్లో బాగా ప్రమోట్ చేస్తాడు. ఫస్ట్ సింగిల్ రిలీజైన దగ్గర్నుంచి అతను సినిమాను భుజాల మీద మోస్తాడు. ఇక ఆఫ్ లైన్ ప్రమోషన్లలోనూ తమన్ చురుగ్గా ఉంటాడన్న సంగతి తెలిసిందే.
గత నెల ‘ఓజీ’ సినిమాను హీరో, దర్శకుడి కంటే తమనే ఎక్కువ ప్రమోట్ చేశాడన్న సంగతి తెలిసిందే. కానీ తన కొత్త సినిమా ‘తెలుసు కదా’ విషయంలో మాత్రం తమన్ ఎందుకు వెనుకంజ వేస్తున్నాడో అర్థం కావడం లేదు. ఈ సినిమాను కూడా ఒకప్పుడు బాగానే మోశాడు తమన్. ఈ చిత్రం నుంచి ‘మల్లిక గంద’ పాట రిలీజైనపుడు తమన్ చాలా యాక్టివ్గా ఉన్నాడు. కానీ సినిమా రిలీజ్ టైంకి తమన్ ఉన్నట్లుండి సైలెంట్ అయిపోయాడు. అసలీ మూవీ రిలీజవుతున్న సంగతే పట్టనట్లు ఉంటున్నాడు.
‘తెలుసు కదా’కు సంబంధించి నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా పెట్టిన ఒక పోస్టును రీట్వీట్ చేయడం తప్పితే.. దాని గురించి ఏమీ మాట్లాడలేదు తమన్. మామూలుగా తాను సంగీతం అందించిన సినిమాల ప్రి రిలీజ్ ఈవెంట్లలో తమన్ చేసే సందడే వేరుగా ఉంటుంది. కానీ ‘తెలుసు కదా’ ఈవెంట్కు మాత్రం అతను రాలేదు. ప్రెస్ మీట్లలో కూడా పాల్గొనలేదు.
ఇక సోషల్ మీడియాలోనూ ఎలాగూ ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయట్లేదు. తమన్ మనసుపెట్టి చేసిన సినిమాలాగే కనిపిస్తున్నా.. తన పాటలు, నేపథ్య సంగీతానికి మంచి స్పందన వస్తున్నా.. తమన్ ఎందుకు మౌనం వహిస్తున్నాడన్నది తెలియడం లేదు. మరి దర్శక నిర్మాతలతో ఏమైనా విభేదాలు తలెత్తాయా? దీని గురించి తమన్ తర్వాత ఎప్పుడైనా ఓపెనవుతాడేమో చూడాలి.
This post was last modified on October 18, 2025 9:56 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…