టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్త మైత్రీ మూవీ మేకర్స్ బాలీవుడ్లోకి అడుగుపెడుతూ తెరకెక్కించిన చిత్రం.. జాట్. బాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఒకరైన సన్నీ డియోల్ ఇందులో లీడ్ రోల్ చేశాడు. సన్నీకి మూడేళ్ల ముందు అస్సలు డిమాండ్ లేదు కానీ.. ‘గదర్-2’తో సెన్సేషనల్ హిట్ అందుకోవడంతో ఆయనకు మళ్లీ క్రేజ్ వచ్చింది. ఆ క్రేజ్ను క్యాష్ చేసుకుందామని ‘జాట్’ తీశారు కానీ.. అది థియేటర్లలో పెద్దగా వర్కవుట్ కాలేదు.
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని మాస్ మసాలా కథతో, ఫుల్ ఎలివేషన్లతో ఈ సినిమా తీశాడు. కానీ ఎందుకో జనం థియేటర్లకు వచ్చి సినిమా చూడలేదు. కానీ నెట్ ఫ్లిక్స్లో రిలీజ్ చేస్తే మాత్రం విరగబడి చూశారు. థియేటర్లలో యావరేజ్ అనిపించుకున్న సినిమా.. ఓటీటీలో మాత్రం బ్లాక్బస్టర్ అయింది.
‘జాట్’ సినిమా వచ్చాక నెట్ ఫ్లిక్స్కు లక్షల్లో కొత్త సబ్స్క్రైబర్లు వచ్చారట. దీంతో ఆ సంస్థ ‘జాట్-2’ తీస్తే డిజిటల్ రైట్స్ కోసం భారీగా రేటు ఇవ్వడానికి సిద్ధంగా ఉందట. ఈ విషయాన్ని వివరంగా చెప్పలేదు కానీ.. డిజిటల్ రిలీజ్ విషయంలో ఉన్న డిమాండ్ వల్లే ‘జాట్-2’ తీయబోతున్నట్లుగా మైత్రీ అధినేతలు విలేకరులతో చెప్పడం విశేషం. థియేటర్లలో ‘జాట్’ అనుకున్నంత బాగా ఆడలేదని కూడా వారు అంగీకరించారు.
ఐతే ‘జాట్-2’ చేయడానికి సన్నీ డియోల్ రెడీగానే ఉన్నప్పటికీ.. దర్శకుడు గోపీచంద్ మాత్రం అందుబాటులో లేడు. తన దగ్గర కథ కూడా రెడీగా లేదు. గోపీచంద్.. బాలయ్యతో సినిమాకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వేరే దర్శకుడితో ‘జాట్-2’ తీయడానికి చూస్తున్నారు మైత్రీ అధినేతలు. భలే మంచి రోజు, దేవదాస్, మనమే చిత్రాల దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తాడని వార్తలు వస్తున్నాయి. కానీ అతను ఇలాంటి మాస్ మూవీని డీల్ చేయగలడా అన్నదే డౌటు.
This post was last modified on October 16, 2025 9:53 pm
గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…