Movie News

కాంతారను కాపాడిన కోర్టు తీర్పు

బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న కాంతార చాప్టర్ 1 ఏ లెజెండ్ ఇంకా థియేటర్ రన్ బలంగా కొనసాగిస్తూనే ఉంది. తెలుగులో నెమ్మదించినప్పటికీ మళ్లీ దీపావళికి పికప్ అవుతుందన్న నమ్మకం బయ్యర్లలో కనిపిస్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమా విడుదలకు ముందు కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిన ధరల నియంత్రణ జిఓ మీద హోంబాలే ఫిలిమ్స్ తో పాటు మల్టీప్లెక్స్ అసోసియేషన్ కోర్టుకు వెళ్లడం, వాళ్లకు అనుకూలంగా వాయిదా తీర్పు రావడం చేసిన మేలు అంతా ఇంతా కాదు. ఇప్పటిదాకా శాండల్ వుడ్ లో కాంతారా చాప్టర్ 1 వసూలు చేసిన గ్రాస్ సుమారు 160 కోట్లకు పైనే ఉంటుందని అక్కడి ట్రేడ్ రిపోర్ట్.

ఒకవేళ జిఓ యధాతథంగా అమలైపోయి టికెట్ రేట్ 200, 236 రూపాయలు మించకపోయి ఉంటే ఇప్పుడొచ్చిన మొత్తంలో కనీసం 50 కోట్లకు పైగా చిల్లు పడేదని ఓపెన్ గా చెప్పేస్తున్నారు. అంటే ఒక పెద్ద ఏరియాకు పాడుకున్నంత సొమ్ము ఇది. ఈ రకంగా చూసుకుంటే న్యాయస్థానం జడ్జ్ మెంట్ వల్ల కాంతారా చాలా పెద్ద ప్రయోజనం పొందింది. ఎందుకంటే బెంగళూరు మల్టీప్లెక్సుల్లో స్క్రీన్లు, వసతులను బట్టి 500 నుంచి 2000 రూపాయల దాకా టికెట్ రేట్లు ఉన్నాయి. అవన్నీ తగ్గించుకోవాల్సి వచ్చేది. తీర్పుకు ముందు దాన్ని పాటించారు కూడా. ఆ కొంత టైంలోనే జనాలు తక్కువ ధరల్లో ఎంజాయ్ చేశారు.

అయితే కోర్టు ఇచ్చింది తాత్కాలిక ఉపశమనం మాత్రమే. త్వరలో జరగబోయే వాయిదాలో సిద్దరామయ్య సర్కార్ తమవైపు వాదనలతో సిద్ధంగా ఉంది. ఒకవేళ అవి బలంగా ఉంటే జీవో మళ్లీ తిరగదోడే అవకాశాలు లేకపోలేదు. అదే జరిగితే భవిష్యత్తులో రాబోయే రాజా సాబ్, టాక్సిక్, అఖండ 2 లాంటి ప్యాన్ ఇండియా మూవీస్ కి సమస్య వస్తుంది. కానీ విశ్లేషకులు మాత్రం అంత రిస్క్ ఉండకపోవచ్చని, మధ్యేమార్గంగా ఒక పరిష్కారం దొరుకుతుందని అంటున్నారు. గవర్నమెంట్ మాత్రం పరిమితి ఉండాల్సిందేనని పట్టు బడుతోంది. ఏదైతేనేం కాంతారా చాప్టర్ 1 క్షేమంగా లాభాలు కళ్లజూసి కలెక్షన్ల పండగ చేసుకుంది.

This post was last modified on October 14, 2025 10:45 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Kantara

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

46 minutes ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

49 minutes ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

2 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

2 hours ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

5 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

6 hours ago