స్పిరిట్, కల్కి-2 లాంటి భారీ చిత్రాల నుంచి దీపికా పదుకొనే తప్పుకోవడం ఈ మధ్య సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ‘కల్కి’లో కీలక పాత్ర పోషించిన ఆమె.. రెండో భాగానికి దూరం కావడం చర్చనీయాంశం అయింది. ఇది ‘కల్కి’ టీంకు, ఆ సినిమాను ఇష్టపడ్డ వాళ్లకు ఎంతో ఇబ్బంది కలిగించే విషయమే. అదే సమయంలో దీపికకు కూడా అదంత మేలు కలిగించే నిర్ణయంలా అనిపించలేదు.
అయినా దీపిక ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందనే విషయంలో పెద్ద చర్చే జరిగింది. దీపిక డిమాండ్లకు తట్టుకోలేకే స్పిరిట్, కల్కి-2 టీమ్స్ ఆమెను తప్పించినట్లు జోరుగా ప్రచారం జరిగింది. దీని గురించి దీపిక ఇప్పటిదాకా స్పందించలేదు. ఆమె పీఆర్ టీం మాత్రం సోషల్ మీడియా వేదికగా ఎదురుదాడి చేస్తూ వచ్చింది. ఇప్పుడు స్వయంగా దీపికే ఈ విషయం మీద స్పందించింది.
సినీ పరిశ్రమలో పని వాతావరణం గురించి ఆమె మాట్లాడింది. రోజుకు 8 గంటలే పని చేయాలని తనకు తాను ఒక నియమం పెట్టుకున్నానని.. దానికి అడ్జస్ట్ కాని వాళ్లు తనతో పని చేయాల్సిన అవసరం లేదని ఆమె తేల్చేసింది. అదే సమయంలో ఎప్పట్నుంచో 8 గంటలు మాత్రమే పని చేస్తున్న మగ సూపర్ స్టార్లు లేరా.. వాళ్లు శుక్రవారం వరకే పని చేసి, వీకెండ్స్ సెలవు తీసుకుంటారన్నది తెలియదా అని ఆమె ప్రశ్నించింది. ఐతే కేవలం ఈ ఒక్క కండిషన్ వల్లే దీపికాను స్పిరిట్, కల్కి-2 టీమ్స్ దూరం చేసుకున్నాయా అన్నది ప్రశ్న. 8 గంటల నిడివిలో దీపికతో పని చేయించుకోవడం వాళ్లకు పెద్ద సమస్యేమీ కాదు.
కానీ అంతకుమించి ఆమె పెట్టిన కండిషన్లకు, డిమాండ్లకు జడిసే ఆమెను దూరం పెట్టారన్నది స్పష్టం. ‘కల్కి’కి తీసుకున్న పారితోషకం కంటే దాదాపు 50 శాతం అదనంగా అడగడం నిజమా కాదా అన్నది ప్రశ్న. అలాగే దాదాపు 25 మంది దాకా ఉణ్న దీపిక స్టాఫ్కు ప్రయాణ, వసతి, ఇతర ఖర్చులు నిర్మాణ సంస్థే భరించాల్సిన పరిస్థితి రావడంతో.. ఇవన్నీ తట్టుకోలేకే ఆమెకు టాటా చెప్పారన్నది ఆయా చిత్ర వర్గాల సమాచారం. తన పీఆర్ టీం ద్వారా సెట్ చేసుకున్న ఇంటర్వ్యూలో కేవలం 8 గంటల పని విధానం గురించి మాత్రమే ప్రశ్న అడిగించుకుని.. దానికి ముందే ప్రిపేర్ చేసిపెట్టుకున్న జవాబు చెప్పి ఈ వివాదంలో తన తప్పేమీ లేదని చాటాలని దీపిక ప్రయత్నిస్తోందని క్లియర్గా తెలిసిపోతోంది. అందుకే దీపిక మీద మరోసారి సోషల్ మీడియాలో విమర్శలు తప్పట్లేదు.
This post was last modified on October 10, 2025 1:45 pm
బీహార్లో బిజెపి ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. కుష్వాహా సామాజిక వర్గానికి చెందిన సామ్రాట్ చౌదరి…
వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని అన్ని విధాలా దోచుకున్న జగన్.. పేదలకు పట్టెడన్నం కూడా పెట్టలేక పోయారని సీఎం చంద్రబాబు విమర్శించారు.…
ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ నాయకులు అదే అక్కసు ప్రదర్శిస్తున్నారు. రాజధానిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. జగన్ ప్రతిపాదించిన…
కనుమూరి రఘురామకృష్ణరాజు... ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. లోక్ సభ సభ్యుడిగా, ఆ తర్వాత శాసనసభ్యుడిగా ఎన్నికైన రాజు..…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసిన ఎస్వీఎస్ఎన్ వర్మకు ఎట్టకేలకు ఫలితం…
వైసీపీ అధినేత జగన్ ఎప్పుడు బయటకు వచ్చినా భారీ ఎత్తున జన సమీకరణ ఉంటుంది. ఆయన వెనక యువత ఎక్కువగా…