ఆంధ్రప్రదేశ్ లో ఓజి టికెట్ రేట్లకు ఇచ్చిన ప్రత్యేక పెంపు అక్టోబర్ 4తో ముగిసింది. ఆదివారం నుంచి సాధారణ రేట్లతో ప్రేక్షకులు ఈ సినిమాని ఎంజాయ్ చేయొచ్చు. అంటే మల్టీప్లెక్స్ 177, సింగల్ స్క్రీన్ 110 నుంచి 145 రూపాయలకు టికెట్లు దొరికేస్తాయి. స్కూళ్ళు, కాలేజీల సెలవులు అయిపోతున్న నేపథ్యంలో ఆక్యుపెన్సీ పరంగా సండే చాలా కీలకం కానుంది. ఇప్పటిదాకా ప్రతి టికెట్ మీద 150, 100 రూపాయలు అదనంగా ఉన్నా సరే పవన్ కళ్యాణ్ కోసం ఖర్చు పెట్టుకున్న ఆడియన్స్ కి అతి పెద్ద ఊరట దక్కడంతో మళ్ళీ కలెక్షన్లు ఊపందుకుంటాయనే నమ్మకంతో బయ్యర్లు ఎదురు చూస్తున్నారు.
కాకపోతే కాంతార చాప్టర్ 1 ఏ లెజెండ్ రూపంలో ఓజికి పెద్ద స్పీడ్ బ్రేకర్ ఎదురయ్యింది. కేవలం వారం గ్యాప్ తో ఇంత పెద్ద సూపర్ హిట్ రావడం కలెక్షన్ల పరంగా ప్రభావం చూపించేదే. ఓజికి సెన్సార్ ఏ సర్టిఫికెట్ ఇవ్వడం చాలా చోట్ల ఇబ్బందికరంగా మారగా కాంతారకు ఆ టెన్షన్ ఏది లేదు. ఏపీ తెలంగాణలో అడ్వాన్స్ బుకింగ్స్ చాలా బాగా జరుగుతున్నాయి. కోర్టు తీర్పు పుణ్యమాని ఓజికి నాలుగో రోజే నార్మల్ రేట్లు పెట్టాల్సి రావడం ప్రేక్షకుల కోణంలో ప్లస్ కాగా ఏపీలో ఆలస్యం జరగడం పట్ల ఫ్యాన్స్ కొంత అసంతృప్తిగా ఉన్నారు. మూడు వందల కోట్లు దాటేసిన ఓజికి ఇంకో పది రోజులు మంచి రన్ దక్కొచ్చు.
ఎలాగూ టికెట్ ధరలు సాధారణ స్థితికి చేరుకున్నాయి కాబట్టి దీన్ని మరింత బాగా ప్రొజెక్ట్ చేసుకుని మరో విడత ప్రమోషన్లు చేయాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ అటు పాలనలో బిజీ అయిపోయారు. సక్సెస్ మీట్ కు హాజరు కావడంతో పబ్లిసిటీ పరంగా తన డ్యూటీని పూర్తి చేశారు. తమన్, సుజిత్ అమెరికా వెళ్తున్నారు. ప్రియాంక మోహన్ చెన్నై చేరుకుంది. శ్రియ రెడ్డిది కూడా అదే దారి. నిర్మాత దానయ్య ఒక్కరే ఏం చేయలేరు. సో లోకల్ ప్రమోషన్లకు ఎవరూ అందుబాటులో ఉండటం లేదు కాబట్టి ఉన్నంతలో సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్సే అన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. సోమవారం నుంచి ఆక్యుపెన్సీలు స్టడీగా ఉండటం ముఖ్యం.
This post was last modified on October 4, 2025 10:12 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…