ప్రస్తుతం దేశంలో గత నెల 22 నుంచి వస్తు, సేవల పన్ను.. జీఎస్టీ-2.0 సంస్కరణలు అమల్లోకి వచ్చాయి. తద్వారా జీఎస్టీలో శ్లాబులు మారి.. ప్రజలకు ఊరట కలిగిస్తుందని కేంద్రం చెబుతోంది. నిత్యావసరాల నుంచి ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు, చెప్పుల నుంచి దుస్తుల వరకు కూడా ధరలు తగ్గాయి. దీంతో ప్రభుత్వాలకు వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గింది. తాజా లెక్కల ప్రకారం.. తెలంగాణ ప్రభుత్వం సుమారు 4 వేల కోట్ల రూపాయలను కోల్పోయిందన్నది గణాంకాలు చెబుతున్న మాట.
దీంతో తెలంగాణ సర్కారు ఉక్కిరిబిక్కిరికి గురవుతోంది. అయితే.. అటు కేంద్రం, ఇటు ఏపీ రాష్ట్రాల్లో మాత్రం జీఎస్టీ పన్ను ఆదాయం పెరిగింది. గత 2024, సెప్టెంబరు చివరితో పోల్చుకుంటే.. ఈ ఏడాది సెప్టెంబరులో ఏపీకి జీఎస్టీ ఆదాయం భారీగా పెరిగింది. సుమారు ఇది 1800 కోట్ల రూపాయలకు పైగానే ఉందని గణాంకాలు చెబుతున్నాయి. ఇక, కేంద్రానికి కూడా నిధుల రాబడి పెరిగిందని ఆర్థిక శాఖ పేర్కొంది. మరి ఇతర రాష్ట్రాల్లో ఆదాయం తగ్గగా.. ఏపీలో ఏం జరిగింది? అనేది ప్రశ్న.
దీనికి ప్రధాన కారణం.. చంద్రబాబు వేసిన సంక్షేమ మంత్రమేనని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. జీఎస్టీ శ్లాబులు తగ్గుతున్న సమయంలోనే ఏపీలో రెండు కీలక పథకాలను చంద్రబాబు అందుబాటులోకి తీసుకువచ్చారు. 1) తల్లికి వందనం. ఇది సెప్టెంబరు చివరి వరకు ఇస్తూనే ఉన్నారు. ఇక, 2) అన్నదాత సుఖీభవ కింద నిధులు ఇచ్చారు. దీనికి తోడు నెల నెలా ఇస్తున్న సామాజిక భద్రతా పింఛన్లు ఎలానూ ఉన్నాయి. వీటి వల్ల ప్రజల చేతిలో సొమ్ములు చేసి.. విక్రయాలు పెరిగాయన్నది నిపుణుల అభిప్రాయం.
విక్రయాల పరంగా చూసుకున్నా.. గత సెప్టెంబరు.. గత 2024 సెప్టెంబరు మధ్య ఇవి పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. ప్రజల చేతిలో సొమ్ములు ఉండడం.. వరుసగా పండుగలు రావడంతో విక్రయాలు పుంజుకుని.. జీఎస్టీ ఆదాయం పెరిగిందన్నది నిపుణులు చెబుతున్న మాట. అందుకే.. రాష్ట్రానికి జీఎస్టీ ఆదాయం మరింతగా పెరిగిందని అంటున్నారు. ఇదే విధానం వచ్చే మూడేళ్లు కొనసాగుతున్న నేపథ్యంలో జీఎస్టీ శ్లాబులు తగ్గినప్పటికీ.. ఏపీకి వచ్చిన ఇబ్బంది లేదని అంటున్నారు.
కొన్ని నెలల క్రితం అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఒక ప్రకటన వెలువడింది. 2027 సంక్రాంతికి థియేటర్లను బ్లాస్ట్ చేయబోతున్నాం అనే…
గత ఏడాది పవన్ కళ్యాణ్ ఓజితో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. కెరీర్ లో మొదటిసారి మూడు వందల కోట్ల క్లబ్బులోకి…
సీనియర్లలో ఎక్కువ వేగంగా సినిమాలు చేస్తున్న హీరోల్లో మొదటి స్థానం బాలకృష్ణకే ఇవ్వాలి. ఎందుకంటే భోళాశంకర్ తర్వాత చిరంజీవి ఏకంగా…
ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క.. అన్నట్టుగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పరిస్థితి…
పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు…
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…