బిగ్బాస్ తెలుగు సీజన్ని ఫెయిర్గా నడిపించడం చేతకాదని క్రియేటివ్ డైరెక్టర్లు గత సీజన్లలోనే నిరూపించుకున్నారు. సెలబ్రిటీలను సైన్ అప్ చేసుకుని, వాళ్లకు కచ్చితంగా టైటిల్ ఇస్తామని మాట ఇవ్వడం, లేదా ఫైనల్ ఫైవ్కి పంపిస్తామని చెప్పి తీసుకోవడం వల్ల ప్రతి సీజన్లోను ఆడియన్స్ అండర్ డాగ్స్ని ఎంచుకుని వారికి సపోర్ట్ చేసారు.
ఈ సీజన్ని బిగ్బాస్ డైరెక్టర్లు మరింత హీనంగా మార్చేసారు. ప్రేక్షకుల ఓట్లతో సంబంధం లేకుండా, లేదా నామినేషన్లతో పని లేకుండా ఎవరిని ఎక్కువ రోజులు వుంచాలనేది వాళ్లే డిసైడ్ అయి జెన్యూన్గా గేమ్ ఆడిన దేవి, కుమార్ సాయి లాంటి వాళ్లను త్వరగా ఇంటికి పంపించేసారు. జబర్దస్త్ కమెడియన్ అవినాష్ను ఎక్కువ రోజులు హౌస్లో వుంచడానికి చేసిన దారుణాలు అన్నీ ఇన్నీ కావు.
ఈ వారం కూడా అతడిని ఎలిమినేట్ కాకుండా చేయడానికి ఏకంగా ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఇచ్చేసారు. అతడు కచ్చితంగా ఎలిమినేట్ అయిపోతాడు కనుక ఇలా పాస్ ముందే ఇచ్చి అవినాష్ వెళ్లిపోకుండా జాగ్రత్త పడ్డారు. అయితే అతడిని పంపించే ఉద్దేశం లేనపుడు పోల్స్ పెట్టడమెందుకు? జనంతో ఓట్లు వేయించడం ఎందుకు? ఒకవేళ ఎలిమినేట్ చేసే ఉద్దేశం లేనపుడు జనాలను ఓట్ చేయమని అడగకుండా హౌస్మేట్స్ని మాత్రం ఓటింగ్ జరుగుతున్నట్టు టెన్షన్ పెడితే చాలు కదా? ఇలా జనాన్ని మెప్పించలేకపోయిన వారిని పర్సనల్ ప్రామిస్ల మీద లాగేట్టు అయితే ఇక ఫెయిర్గా గేమ్ ఆడేవాళ్ల పరిస్థితి ఏమిటి? ఇక పీఆర్ టీమ్ని పెట్టుకుని ఓట్లు వేయించుకుంటోన్న కంటెస్టెంట్లను కూడా బిగ్బాస్ ఇంతవరకు ఏమీ చేయలేకపోవడం రాబోయే సీజన్లకి బ్యాడ్ సిగ్నలే.
This post was last modified on November 27, 2020 1:56 pm
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…
నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఢిల్లీ నిరసనలో ఉగ్రవాదుల కుట్ర కోణం బయట పడిందని ఢిల్లీ టాస్క్ఫోర్స్…