Movie News

ప్రేక్షకులను వెర్రి వెంగళాయ్‍లను చేస్తోన్న బిగ్‍బాస్‍

బిగ్‍బాస్‍ తెలుగు సీజన్‍ని ఫెయిర్‍గా నడిపించడం చేతకాదని క్రియేటివ్‍ డైరెక్టర్లు గత సీజన్లలోనే నిరూపించుకున్నారు. సెలబ్రిటీలను సైన్‍ అప్‍ చేసుకుని, వాళ్లకు కచ్చితంగా టైటిల్‍ ఇస్తామని మాట ఇవ్వడం, లేదా ఫైనల్‍ ఫైవ్‍కి పంపిస్తామని చెప్పి తీసుకోవడం వల్ల ప్రతి సీజన్లోను ఆడియన్స్ అండర్‍ డాగ్స్ని ఎంచుకుని వారికి సపోర్ట్ చేసారు.

ఈ సీజన్‍ని బిగ్‍బాస్‍ డైరెక్టర్లు మరింత హీనంగా మార్చేసారు. ప్రేక్షకుల ఓట్లతో సంబంధం లేకుండా, లేదా నామినేషన్లతో పని లేకుండా ఎవరిని ఎక్కువ రోజులు వుంచాలనేది వాళ్లే డిసైడ్‍ అయి జెన్యూన్‍గా గేమ్‍ ఆడిన దేవి, కుమార్‍ సాయి లాంటి వాళ్లను త్వరగా ఇంటికి పంపించేసారు. జబర్దస్త్ కమెడియన్‍ అవినాష్‍ను ఎక్కువ రోజులు హౌస్‍లో వుంచడానికి చేసిన దారుణాలు అన్నీ ఇన్నీ కావు.

ఈ వారం కూడా అతడిని ఎలిమినేట్‍ కాకుండా చేయడానికి ఏకంగా ఎవిక్షన్‍ ఫ్రీ పాస్‍ ఇచ్చేసారు. అతడు కచ్చితంగా ఎలిమినేట్‍ అయిపోతాడు కనుక ఇలా పాస్‍ ముందే ఇచ్చి అవినాష్‍ వెళ్లిపోకుండా జాగ్రత్త పడ్డారు. అయితే అతడిని పంపించే ఉద్దేశం లేనపుడు పోల్స్ పెట్టడమెందుకు? జనంతో ఓట్లు వేయించడం ఎందుకు? ఒకవేళ ఎలిమినేట్‍ చేసే ఉద్దేశం లేనపుడు జనాలను ఓట్‍ చేయమని అడగకుండా హౌస్‍మేట్స్ని మాత్రం ఓటింగ్‍ జరుగుతున్నట్టు టెన్షన్‍ పెడితే చాలు కదా? ఇలా జనాన్ని మెప్పించలేకపోయిన వారిని పర్సనల్‍ ప్రామిస్‍ల మీద లాగేట్టు అయితే ఇక ఫెయిర్‍గా గేమ్‍ ఆడేవాళ్ల పరిస్థితి ఏమిటి? ఇక పీఆర్‍ టీమ్‍ని పెట్టుకుని ఓట్లు వేయించుకుంటోన్న కంటెస్టెంట్లను కూడా బిగ్‍బాస్‍ ఇంతవరకు ఏమీ చేయలేకపోవడం రాబోయే సీజన్లకి బ్యాడ్‍ సిగ్నలే.

This post was last modified on November 27, 2020 1:56 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

3 minutes ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

10 minutes ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

2 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

2 hours ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

3 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

3 hours ago