బిగ్బాస్ తెలుగు సీజన్ని ఫెయిర్గా నడిపించడం చేతకాదని క్రియేటివ్ డైరెక్టర్లు గత సీజన్లలోనే నిరూపించుకున్నారు. సెలబ్రిటీలను సైన్ అప్ చేసుకుని, వాళ్లకు కచ్చితంగా టైటిల్ ఇస్తామని మాట ఇవ్వడం, లేదా ఫైనల్ ఫైవ్కి పంపిస్తామని చెప్పి తీసుకోవడం వల్ల ప్రతి సీజన్లోను ఆడియన్స్ అండర్ డాగ్స్ని ఎంచుకుని వారికి సపోర్ట్ చేసారు.
ఈ సీజన్ని బిగ్బాస్ డైరెక్టర్లు మరింత హీనంగా మార్చేసారు. ప్రేక్షకుల ఓట్లతో సంబంధం లేకుండా, లేదా నామినేషన్లతో పని లేకుండా ఎవరిని ఎక్కువ రోజులు వుంచాలనేది వాళ్లే డిసైడ్ అయి జెన్యూన్గా గేమ్ ఆడిన దేవి, కుమార్ సాయి లాంటి వాళ్లను త్వరగా ఇంటికి పంపించేసారు. జబర్దస్త్ కమెడియన్ అవినాష్ను ఎక్కువ రోజులు హౌస్లో వుంచడానికి చేసిన దారుణాలు అన్నీ ఇన్నీ కావు.
ఈ వారం కూడా అతడిని ఎలిమినేట్ కాకుండా చేయడానికి ఏకంగా ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఇచ్చేసారు. అతడు కచ్చితంగా ఎలిమినేట్ అయిపోతాడు కనుక ఇలా పాస్ ముందే ఇచ్చి అవినాష్ వెళ్లిపోకుండా జాగ్రత్త పడ్డారు. అయితే అతడిని పంపించే ఉద్దేశం లేనపుడు పోల్స్ పెట్టడమెందుకు? జనంతో ఓట్లు వేయించడం ఎందుకు? ఒకవేళ ఎలిమినేట్ చేసే ఉద్దేశం లేనపుడు జనాలను ఓట్ చేయమని అడగకుండా హౌస్మేట్స్ని మాత్రం ఓటింగ్ జరుగుతున్నట్టు టెన్షన్ పెడితే చాలు కదా? ఇలా జనాన్ని మెప్పించలేకపోయిన వారిని పర్సనల్ ప్రామిస్ల మీద లాగేట్టు అయితే ఇక ఫెయిర్గా గేమ్ ఆడేవాళ్ల పరిస్థితి ఏమిటి? ఇక పీఆర్ టీమ్ని పెట్టుకుని ఓట్లు వేయించుకుంటోన్న కంటెస్టెంట్లను కూడా బిగ్బాస్ ఇంతవరకు ఏమీ చేయలేకపోవడం రాబోయే సీజన్లకి బ్యాడ్ సిగ్నలే.
This post was last modified on November 27, 2020 1:56 pm
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీకి సంబంధించిన ఒక ముఖ్యమైన అనౌన్స్ మెంట్…
మిరపకాయ్ కాంబినేషన్ రిపీట్ అవుతుందని అభిమానులు బోలెడు ఆశలు పెట్టుకున్న మిస్టర్ బచ్చన్ గత ఏడాది తీవ్రంగా నిరాశ పరచడం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు మంగళవారం నిజంగానే ఓ విచిత్ర అనుభవాన్ని మిగిల్చింది. మంగళవారం…
ఈ రోజు అల్లు అర్జున్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అట్లీ దర్శకత్వంలో అతను చేయబోయే మెగా మూవీకి సంబంధించిన…
సింగపూర్ లో సోమవారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదం భారీదేనని చెప్పాలి. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సింగపూర్ లో చదువుతున్న తన కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్…