Movie News

ధనుష్ పట్టు ఎక్కడుందో అర్థమయ్యిందిగా

కాంతార చాప్టర్ 1 ఏ లెజెండ్ దెబ్బకు తెలుగులో ఇడ్లి కొట్టుని జనాలు లైట్ తీసుకున్నారు. టాక్ అంతంతమాత్రంగా రావడం, నెగటివ్ రివ్యూలు, ఆడియన్స్ లో ఆసక్తి లేకపోవడం లాంటి కారణాలు చాలా తక్కువ ఓపెనింగ్స్ ని తీసుకొచ్చాయి. కొన్ని మెయిన్ సెంటర్స్ లో కాంతార ఓవర్ ఫ్లోస్ తో పాటు ధనుష్ ఇమేజ్ వల్ల కాసిన్ని నెంబర్లు కనిపించాయి కానీ ఓవరాల్ గా చూసుకుంటే ఇడ్లి కొట్టు మన దగ్గర ఫెయిల్యూర్ వైపే వెళ్లేలా ఉంది. కాకపోతే లాంగ్ వీకెండ్ ఉన్న నేపథ్యంలో దీని వల్ల ఏమైనా లాభం పొందుతుందేమో చూడాలి. కానీ తమిళనాడులో ఇడ్లి కడై సీన్ ఇక్కడికి భిన్నంగా పూర్తి రివర్స్ లో ఉంది.

నిన్న బుక్ మై షోలో ఇడ్లి కడై అమ్మిన టికెట్లు 1 లక్షా 70 వేలకు పైనే. రెండు రోజులు వరల్డ్ వైడ్ వసూళ్లు 21 కోట్లు దాటేశాయని ట్రేడ్ రిపోర్ట్. ఇందులో ఏపీ తెలంగాణ కాంట్రిబ్యూషన్ పది శాతం కూడా లేదంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. నిన్న సాయంత్రం, ఈవెనింగ్ షోల ఆక్యుపెన్సీలు కొంచెం మెరుగ్గా అనిపించాయి కానీ బెస్ట్ అయితే కాదు. తమిళనాడులో సగటున 40 నుంచి 70 శాతం హాజరు నమోదు కాగా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం 25 శాతం లోపే పరిమితం కావడం గమనార్హం. అయితే ఓవరాల్ ఓపెనింగ్ గా చూసుకుంటే కుబేర, రాయన్ లను ఇడ్లి కడై దాటలేకపోయింది. అదొక్కటే ఫ్యాన్స్ కి లోటు.

చాలా తక్కువ హైప్ తో ఇడ్లి కడై ఇంత రాబట్టడం విశేషం. పూర్తి తమిళ నేటివిటీతో రూపొందిన ఈ సినిమా తెలుగు ఆడియన్స్ కి కనెక్ట్ కాలేకపోవడానికి ఓవర్ సెంటిమెంట్ ప్రధాన కారణంగా చెప్పొచ్చు. గతంలో కార్తీ చినబాబు లాంటివి కోలీవుడ్ లో బాగా పెర్ఫార్మ్ చేసినప్పటికి మన దగ్గర మాత్రం ఫ్లాప్ ముద్ర వేయించుకున్నాయి. ఒకవేళ కాంతార చాప్టర్ 1, ఓజి కనక ఇంత దూకుడుగా లేకపోయి ఇడ్లి కొట్టు సోలోగా వచ్చి ఉంటే బెటర్ రిజల్ట్ దక్కేదేమో కానీ అరవ సాంబార్ మనకు రుచించలేదన్నది వాస్తవం. ధనుష్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ ఎమోషనల్ డ్రామాలో నిత్య మీనన్ హీరోయిన్ గా నటించింది.

Kumar

Recent Posts

ప్రశ్న రావణ్ విషయంలో చేతులెత్తేసిన జడ శ్రావణ్?

ఏపీలో ఆసక్తి రేకెత్తించిన జోసెఫ్ రావణ్ అలియాస్ ప్రశ్న రావణ్ వ్యవహారంపై కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. జనసేన అదినేత,…

2 hours ago

ట్రంప్ తిప్పలు… వీడియో కాల్ లో నిశ్చితార్థం

అమెరికా అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విచిత్రమైన నిర్ణయాలతో ఆ దేశ ప్రజలతో పాటు ఆ దేశంలోని విదేశీయులు నానా ఇబ్బందులు పడుతున్నారు.…

3 hours ago

విహార యాత్రలో విషాదం… 15 మంది భారతీయులు మృతి

విహార యాత్రల్లో ప్రమాదం జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటిదే ఇప్పుడు వియత్నాంలో జరిగింది. వియత్నాంలో…

3 hours ago

పవన్ ఏళ్ల గాయానికి గంటల తరబడి ఆపరేషన్

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు శనివారం శస్త్ర చికిత్స జరిగింది. ముంబైలో జరిగిన ఈ శస్త్ర…

5 hours ago

స్టేజీపై ఏడ్చేసిన భాగ్యశ్రీ బోర్సే

ఫిలిం ఇండస్ట్రీలో అవకాశాలు అందుకోవడం ఒకెత్తయితే.. విజయాలు సాధించడం మరో ఎత్తు. వచ్చిన అవకాశాలు సద్వినియోగం అయ్యేలా సక్సెస్ సాధించకపోతే…

5 hours ago

ఢమాల్ అన్నారు… అయినా వసూళ్లు ఇస్తున్నారు

బాలీవుడ్ లో కొంత కాలంగా విచిత్రమైన ట్రెండ్ నడుస్తోంది. రొటీన్ కథలు, సిల్లీ కాన్సెప్ట్స్ తో సినిమాలు వస్తుంటాయి. క్రిటిక్స్…

5 hours ago