Political News

విజయ్ కు షాక్… టీవీకే పిటిషన్ కొట్టివేత

తమిళ స్టార్ హీరో విజయ్ కు శుక్రవారం ఊహించని షాక్ ఎదురైంది. ఆయన స్థాపించిన పార్టీ తమిళ వెట్రిగ కళగం (టీవీకే) మద్రాస్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన మద్రాస్ హైకోర్టులోని మధురై బెంచి కొట్టివేసింది. కరూర్ తొక్కిసలాట ఘటనపై అటు దర్యాప్తు గానీ, ఇటు విచారణ గానీ ప్రాథమిక దశలో ఉండగానే సీబీఐ దర్యాప్తును ఎలా కోరతారని కోర్టు ప్రశ్నించింది. కనీసం ఘటనపై ప్రాథమిక సమాచారం రాకుండానే సీబీఐ విచారణ కోరడం సబబు కాదని పేర్కొంటూ పిటిషన్ కు విచారణ అర్హత లేదని కొట్టివేసింది.

7 నెలల్లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా విజయ్ భారీ సన్నాహాల్లో ఉన్నారు. ఈ నెలల పాటు ప్రజల్లోనే ఉండాలని భావిస్తున్న ఆయన రాష్ట్రవ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా గత నెల చివర్లో కరూర్ లో జరిగిన ర్యాలీలో భారీ తొక్కిసలాట జరిగగా… 41 మంది చనిపోగా, వంద మందికి పైగా గాయపడ్డారు. వీరిలో మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున, గాయపడ్డ వారికి రూ.2 లక్షల చొప్పున విజయ్ పరిహారం ప్రకటించారు. త్వరలోనే ఆయన బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

బలంగా రాజకీయాల్లోకి వస్తున్న తనను అభాసుపాలు చేసి ఆదిలోనే రాజకీయాల నుంచి పంపించివేయాలని పథకం పన్నిన అధికార, విపక్షలు ఈ ఘటనకు కారణమని విజయ్ భావిస్తున్నారు. ఈ క్రమంలో కరూర్ ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం జరిపే ఏ విచారణలోనూ నిజానిజాలు నిగ్గు తేలవని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. ఈ క్రమంలోనే ఘటన జరిగిన రెండు రోజుల్లోనే హైకోర్టును ఆశ్రయించారు. అయితే దీనిని తొందరపాటు చర్యగా పరిగణిస్తూ హైకోర్టు కొట్టివేయడం టీవీకే వర్గాలతో పాటు విజయ్ ను షాక్ కు గురి చేసిందని చెప్పక తప్పదు.

This post was last modified on October 3, 2025 3:04 pm

Share
Show comments
Published by
Kumar
Tags: TVKVijay

Recent Posts

పెద్ద ప్రభాస్ రిటర్న్స్… టికెట్ ధరలు నార్మల్

నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…

1 hour ago

శ్రీలీల కోరుకున్న బ్రేక్ దొరికిందా

సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…

2 hours ago

ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయితే రచ్చే

రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…

3 hours ago

ప్రతిచోట చీపురు పట్టుకొని పవన్ ఊడవాలా?

పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…

5 hours ago

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…

7 hours ago

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…

7 hours ago