ఇటీవలే తమిళనాడు రాష్ట్రం కరూర్ లో విజయ్ రాజకీయ సభ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో నలభై ప్రాణాలు గాలిలో కలిసిపోవడం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం, ప్రతిపక్షాలు ఒకరిమీద ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. డ్యామేజ్ ని తగ్గించే ఉద్దేశంతో విజయ్ వదిలిన వీడియో మెసేజ్ కు సానుకూలత, వ్యతిరేకత రెండూ రావడం ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. చనిపోయిన వాళ్లకు క్షమాపణ చెప్పడం కన్నా స్టాలిన్ సర్కార్ తన పార్టీ వ్యక్తులను టార్గెట్ చేయడం పట్ల విచారం వ్యక్తం చేయడమే ఎక్కువగా కనిపించిందని కొందరు విమర్శించడం సోషల్ మీడియాలో వైరలయ్యింది.
ఈ ఘటన తాలూకు ప్రభావం జనవరి 9 విడుదల కాబోయే జన నాయకుడు మీద ఉంటుందని అభిమానులు అనుమాన పడుతున్నారు. అపోజిషన్ పార్టీలు ఏకమై ఈ సినిమాని బ్యాన్ చేయమని డిమాండ్ చేస్తారని వాళ్ళ అనుమానం. లీగల్ గా నిషేధించడానికి ఛాన్స్ లేదు కానీ రకరకాల మార్గాల్లో అడ్డుకునే అవకాశాలు లేకపోలేదు. అసలే కరూర్ ప్రమాదం వెనుక కుట్ర ఉందని, ఏకంగా రూలింగ్ పార్టీ మీదే అనుమానం వచ్చేలా మాట్లాడుతున్న విజయ్ కు దాని సెగలు సినిమా రిలీజ్ టైంలో ఎదురుకావొచ్చు. సెన్సార్ తో మొదలుపెట్టి థియేటర్ల కేటాయింపు దాకా సవాలక్ష సమస్యలను చవి చూడాల్సి రావొచ్చు.
తన రాజకీయ ప్రవేశానికి ముందు చేసిన చివరి సినిమాగా జన నాయకుడుకి విజయ్ చాలా బజ్ తీసుకొచ్చాడు. హెచ్ వినోత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మన భగవంత్ కేసరి రీమేకనే ప్రచారం కొన్ని నెలల క్రితం బలంగా తిరిగింది. ఒకవేళ పాయింట్ కొంచెం తీసుకున్నప్పటికీ ట్రీట్ మెంట్ పూర్తిగా వేరు ఉంటుందని కోలీవుడ్ టాక్. అయితే పొలిటికల్ గా ఇందులో చాలా సెటైర్లు, సంఘటనలు ఉంటాయని అంతర్గతంగా వినిపిస్తున్న మాట. అదే నిజమైతే డీఎంకే నేతలు ఊరికే ఉండరు. ఖచ్చితంగా అడ్డుకుంటారు. రాబోయే నెలల్లో జరిగే పరిణామాలు చాలా ఆసక్తికరంగా ఉండబోతున్నాయనేది వాస్తవం.
This post was last modified on October 1, 2025 6:07 am
స్పై సినిమాల మీద ఒక యూనివర్శ్నే క్రియేట్ చేసి.. భారీ విజయాలు అందుకుంది బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యశ్…
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో బీఆర్ఎస్ కు వచ్చిన స్థానాల నేపథ్యంలో ఆ పార్టీకి జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత…
జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లో ఒక కల్ట్ కామెడీ ఎంటర్ టైనర్ గా నిలిచిపోయిన అదుర్స్ వచ్చి పదహారు సంవత్సరాలు గడిచిపోయాయి.…
ఇటలీ వేదికగా జరుగుతున్న 2026 వింటర్ ఒలింపిక్స్లో ఒక వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆటల పోటీలు మొదలైన కొన్ని…
క్రికెట్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ మహా సంగ్రామానికి కౌంట్డౌన్ మొదలైంది. అయితే ఈ హై వోల్టేజ్ మ్యాచ్కు…
మునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలాకాలంగా సొంత పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు…