ఇటీవలే తమిళనాడు రాష్ట్రం కరూర్ లో విజయ్ రాజకీయ సభ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో నలభై ప్రాణాలు గాలిలో కలిసిపోవడం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం, ప్రతిపక్షాలు ఒకరిమీద ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. డ్యామేజ్ ని తగ్గించే ఉద్దేశంతో విజయ్ వదిలిన వీడియో మెసేజ్ కు సానుకూలత, వ్యతిరేకత రెండూ రావడం ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. చనిపోయిన వాళ్లకు క్షమాపణ చెప్పడం కన్నా స్టాలిన్ సర్కార్ తన పార్టీ వ్యక్తులను టార్గెట్ చేయడం పట్ల విచారం వ్యక్తం చేయడమే ఎక్కువగా కనిపించిందని కొందరు విమర్శించడం సోషల్ మీడియాలో వైరలయ్యింది.
ఈ ఘటన తాలూకు ప్రభావం జనవరి 9 విడుదల కాబోయే జన నాయకుడు మీద ఉంటుందని అభిమానులు అనుమాన పడుతున్నారు. అపోజిషన్ పార్టీలు ఏకమై ఈ సినిమాని బ్యాన్ చేయమని డిమాండ్ చేస్తారని వాళ్ళ అనుమానం. లీగల్ గా నిషేధించడానికి ఛాన్స్ లేదు కానీ రకరకాల మార్గాల్లో అడ్డుకునే అవకాశాలు లేకపోలేదు. అసలే కరూర్ ప్రమాదం వెనుక కుట్ర ఉందని, ఏకంగా రూలింగ్ పార్టీ మీదే అనుమానం వచ్చేలా మాట్లాడుతున్న విజయ్ కు దాని సెగలు సినిమా రిలీజ్ టైంలో ఎదురుకావొచ్చు. సెన్సార్ తో మొదలుపెట్టి థియేటర్ల కేటాయింపు దాకా సవాలక్ష సమస్యలను చవి చూడాల్సి రావొచ్చు.
తన రాజకీయ ప్రవేశానికి ముందు చేసిన చివరి సినిమాగా జన నాయకుడుకి విజయ్ చాలా బజ్ తీసుకొచ్చాడు. హెచ్ వినోత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మన భగవంత్ కేసరి రీమేకనే ప్రచారం కొన్ని నెలల క్రితం బలంగా తిరిగింది. ఒకవేళ పాయింట్ కొంచెం తీసుకున్నప్పటికీ ట్రీట్ మెంట్ పూర్తిగా వేరు ఉంటుందని కోలీవుడ్ టాక్. అయితే పొలిటికల్ గా ఇందులో చాలా సెటైర్లు, సంఘటనలు ఉంటాయని అంతర్గతంగా వినిపిస్తున్న మాట. అదే నిజమైతే డీఎంకే నేతలు ఊరికే ఉండరు. ఖచ్చితంగా అడ్డుకుంటారు. రాబోయే నెలల్లో జరిగే పరిణామాలు చాలా ఆసక్తికరంగా ఉండబోతున్నాయనేది వాస్తవం.
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…