సలార్ ఇంటర్వెల్ ఎపిసోడ్ అంతగా పేలడానికి ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ ఒక కారణమైతే, అంతే సమానంగా ఆర్టిస్ట్ శ్రీయ రెడ్డి బిగ్గరగా దేవరత మన్నార్ అంటూ ఎలివేషన్లు ఇచ్చిన తీరు థియేటర్లు హోరెత్తిపోయేలా చేసింది. ఝాన్సీతో మెల్లగా మాట్లాడుతూ క్రమంగా గొంతుని పెంచుతూ ఆవిడ డైలాగు చెప్పిన విధానం ఓ రేంజ్ లో పేలింది. తర్వాత టాలీవుడ్ నుంచి చాలా ఆఫర్లు వచ్చినా తొందరపడి ఒప్పుకోకుండా కేవలం పవన్ కళ్యాణ్ ఓజికి మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులోనూ మరీ ఎక్కువ స్పేస్ దొరకలేదు. కానీ ఉన్నంతలో గుర్తుండిపోయే సన్నివేశాలు పడాయి. ముఖ్యంగా విలన్ తో నవ్వుతూ పవన్ గురించి చెప్పే సీన్ లో.
ఒకరకంగా చెప్పాలంటే ఈ రెండు క్యారెక్టర్లు నిడివి పరంగా చిన్నవి. కానీ చూపించిన ప్రభావం మాత్రం పెద్దవి. ఇంకా ఎడిటింగ్ లో కొంత భాగం పోయిందంటున్నారు కాబట్టి అందులోనూ శ్రీయ రెడ్డికి తగినంత స్కోప్ దొరికి ఉండొచ్చు. హీరో విశాల్ కు స్వయానా వదినైన శ్రీయ రెడ్డి 2003లో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. రాజా హీరోగా రూపొందిన అప్పుడప్పుడు సినిమా కమర్షియల్ గా సక్సెస్ అందుకోలేదు. ఆ తర్వాత మూడేళ్లకు అమ్మ చెప్పిందిలో నటించినా ఫలితం డిజాస్టరే. విశాల్ పొగరుతో శ్రీయ రెడ్డికి చాలా పేరొచ్చింది. హీరో వద్దన్నా వెంటపడే శాడిస్ట్ పాత్రలో జీవించేసి మాస్ ఆడియన్స్ కి దగ్గరయ్యింది.
ఆ సమయంలోనే విశాల్ అన్నయ్య విక్రమ్ తో ప్రేమలో పడటం అది వివాహానికి దారి తీయడం జరిగిపోయాయి; ఇరవై మూడు సంవత్సరాల సుదీర్ఘ కెరీర్ లో శ్రీయ రెడ్డి నటించిన సినిమాలు ఇరవై కూడా లేవు. కాకపోతే క్వాలిటీ ఉన్నవే ఎక్కువ. కాంచీవరంలో నటనకు ఫిలిం ఫేర్, విజయ్ అవార్డులకు నామినేట్ అయినా పురస్కారం రాలేదు. మొన్న ఏడాది వెబ్ సిరీస్ సుజల్ తనకు చాలా పేరు తీసుకొచ్చింది. సలార్, ఓజిలు చూసిన ఇతర దర్శక నిర్మాతలు శ్రీయ రెడ్డికు అవకాశాలు ఇస్తున్నారు కానీ ఆవిడే ఒక పట్టాన ఒప్పుకోవడం లేదట. ప్రభాస్, పవన్ రేంజ్ స్టార్లైతేనే రెస్పాన్స్ వేగంగా ఉంటుందేమో.
This post was last modified on September 27, 2025 9:51 pm
తెలంగాణ రాష్ట్ర సేన.. అంటూ టీఆర్ ఎస్ పార్టీని స్థాపించిన కవిత వ్యవహారంపై బీఆర్ ఎస్ నాయకులు మౌనంగా ఉన్నారు.…
మోహన్ లాల్ దృశ్యం 3 మరోసారి రిలీజ్ డేట్ ప్రకటించింది. మే 21 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అడుగు పెట్టబోతున్నట్టు అధికారికంగా…
బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ల తర్వాత సూర్య సినిమాలు వరసగా రాబోతున్నాయి. వాటిలో మొదటిది వీరభద్రుడు. తమిళంలో కరుప్పుగా రూపొందిన…
సొంత పార్టీ నాయకుడు తప్పు చేస్తే ఒకవిధంగా.. ప్రత్యర్థి పార్టీ నేతలు తప్పులు చేస్తే మరో విధంగా మారి పోయిన…
మే 1 విడుదల కాబోతున్న గాయపడ్డ సింహం మీద టీమ్ కన్నా ఎక్కువగా బయ్యర్ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే…
వెనకటికి పాత కథ ఒకటుంది. ఒక రొట్టె కోసం రెండు పిల్లులు పోట్లాడుకుంటే తీర్పు చెప్పడానికి వచ్చిన కోతి దాన్ని…