నిన్న రాత్రి పది గంటల నుంచి ఏపీ తెలంగాణ థియేటర్లలో గేట్లు మూసేసి సిబ్బంది ఇంటికి వెళ్లిపోవడం, షోలు అయిపోయాయి కాబట్టి ఇవాళ్టికే దుకాణం బంద్ లాంటివి అనుకోవడం జరగలేదు. జాతరను తలపించేలా ప్రతిచోటా ప్రీమియర్ల కోసం అభిమానులు చేసిన సందడి తాలూకు వీడియోలతో సోషల్ మీడియా నిండిపోయింది. చాలా గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ మాస్ హిస్టీరియాని చూసి ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. ఇంటర్వెల్ కే సంతోషంతో కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు పలుచోట్ల కనిపించాయి. ఇన్నేళ్ల ఎదురు చూపులకు దర్శకుడు సుజిత్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ న్యాయం చేకూర్చారంటూ సంతోషం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ విమల్, శ్రీరాములు థియేటర్లు టాలీవుడ్ సెలబ్రిటీలతో నిండిపోయాయి. ప్రశాంత్ నీల్, సందీప్ రెడీ వంగా, సాయి ధరమ్ తేజ్, హరీష్ శంకర్, కిరణ్ అబ్బవరం, వరుణ్ తేజ్, వైష్ణవ్, అకీరానందన్, ఎస్కెఎన్, సాయిరాజేష్ తదితరులంతా సామాన్య అభిమానుల్లా ఆట టైంకి వచ్చేసి సీట్లలో కూర్చోవడం కనిపించింది. హరిహర వీరమల్లు గాయాన్ని పూర్తిగా మర్చిపోయేలా ఓజి ఉందని టాక్ అయితే పాజిటివ్ గా ఉంది. దీన్ని ఎంత బలంగా నిలబెట్టుకుంటుందనేది కీలకం కానుంది. నాలుగు రోజుల సుదీర్ఘ వీకెండ్ ని ఓజి వాడుకోవడం మీదే ఎలాంటి రికార్డులు బద్దలవుతాయనేది ఆధారపడి ఉంది.
ఆన్ లైన్ ట్రెండ్స్ చూస్తుంటే ఓజికి మినిమమ్ సూపర్ హిట్ ముద్ర పడిపోయింది. బ్లాక్ బస్టర్ స్థాయిని చేరుకుంటుందా లేదానేది బ్రేక్ ఈవెన్ ని వేగంగా అందుకోవడాన్ని బట్టి ఉంటుంది. హైదరాబాద్ లో మంచి స్క్రీన్లు, ప్రీమియం మల్టీప్లెక్సుల్లో షోలన్నీ సోల్డ్ అవుట్ చూపిస్తున్నాయి. ఇదే జోరుని నాలుగు రోజులు కొనసాగిస్తే సగానికి పైగానే రికవర్ అయ్యే అవకాశాలున్నాయి. పుష్ప 2, ఆర్ఆర్ఆర్ రేంజ్ లో ఓజి నిలబడటం చాలా అవసరం. ఎందుకంటే వారం తర్వాత కాంతార చాప్టర్ 1, ఇడ్లీ కొట్టు వస్తున్నాయి. రెండూ డబ్బింగ్ కాబట్టి టెన్షన్ అవసరం లేదని అనుకోవడానికి లేదు. ఓజిలాగే వాటికి మంచి టాక్ వస్తే పోటీ ఉంటుంది.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…