హైదరాబాద్ ఎల్బి స్టేడియం అభిమాన సంద్రంతో పోటెత్తిపోయింది. ఓజి కన్సర్ట్ దెబ్బకు పవన్ కళ్యాణ్ తానో రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిననే సంగతే కాసేపు మర్చిపోయారు. ఎప్పుడూ లేనిది మొదటిసారి తన సినిమా కాస్ట్యూమ్ తో ఈవెంట్ కి రావడంతో ఫ్యాన్స్ ఆనందం హద్దులు దాటేసింది. అది కూడా చేతిలో కాటన ఆయుధం పట్టుకుని చుట్టూ బాడీ గార్డ్స్, పైన గొడుగులు, భారీగా కురుస్తున్న తుంపర్ల మధ్య పవన్ స్టేజి మీద రావడం చూస్తే, రేపు స్క్రీన్ మీద చూపించే ఇంట్రో ఎలివేషన్ ఇంతకన్నా గొప్పగా ఉంటుందా అనే అనుమానం కలిగిందంటే ఆశ్చర్యం లేదు. సోషల్ మీడియాలో ఆ విజువల్స్ రచ్చ చేస్తున్నాయి.
స్పీచ్ లో సైతం పవన్ జోష్ మాములుగా లేదు. దర్శకుడు సుజిత్ వల్ల ఇలా ఓజాస్ గంభీరగా రావాల్సి వచ్చిందని, ఇలాంటి డైరెక్షన్ టీమ్ తనకు ఉండి ఉంటే పాలిటిక్స్ లో వచ్చే వాడిని కాదని చెప్పడం చూస్తే కంటెంట్ ఏ స్థాయిలో ఉందోనని ఫ్యాన్స్ అంచనాలు మరింత పెంచేసుకుంటున్నారు. ఈ సినిమా క్రెడిట్ మొదట సుజిత్, తర్వాత తమన్ కు చెందుతుందని చెప్పిన పవన్ కళ్యాణ్ ఎప్పుడో ఖుషి తర్వాత మళ్ళీ అంతటి జోష్ ఇప్పుడే చూస్తున్నానని చెప్పడం ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. శ్రియ రెడ్డి, ప్రియాంక మోహన్, ఇమ్రాన్ హష్మీల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించి వాళ్ళ మీద పొగడ్తల వర్షం కురిపించారు.
వర్షం అంతకంతా పెరిగి పోవడంతో ఈవెంట్ అర్ధాంతరంగా ఆపేయాల్సి వచ్చింది కానీ లేదంటే ఓజి సంబరం ఇంకో గంటకు పైగానే పీక్స్ కు చేరుకునేది. చినుకుల తాకిడి పెరగడం గమించిన పవన్ తన ప్రసంగాన్ని త్వరగా ముగించాల్సి వచ్చింది. తగ్గుతుందేమోనని చూసినప్పటికీ ఆ సూచనలు కనిపించలేదు. కొన్ని క్షణాల పాటు పవర్ కట్ కూడా ఇబ్బంది పెట్టింది. ఇంకొంచెం ముందుగా మొదలుపెట్టి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదేమో కానీ మొత్తానికి ఏది ఆశించి అన్ని వేల అభిమానులు ఈవెంట్ కు వచ్చారో దానికి రెట్టింపు ఒక్క పవన్ కళ్యాణ్ నుంచే వచ్చేసింది. ఇక మిగిలింది సెప్టెంబర్ 24 ప్రీమియర్ చూడటమే.
This post was last modified on September 21, 2025 9:35 pm
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…