హైదరాబాద్ ఎల్బి స్టేడియం అభిమాన సంద్రంతో పోటెత్తిపోయింది. ఓజి కన్సర్ట్ దెబ్బకు పవన్ కళ్యాణ్ తానో రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిననే సంగతే కాసేపు మర్చిపోయారు. ఎప్పుడూ లేనిది మొదటిసారి తన సినిమా కాస్ట్యూమ్ తో ఈవెంట్ కి రావడంతో ఫ్యాన్స్ ఆనందం హద్దులు దాటేసింది. అది కూడా చేతిలో కాటన ఆయుధం పట్టుకుని చుట్టూ బాడీ గార్డ్స్, పైన గొడుగులు, భారీగా కురుస్తున్న తుంపర్ల మధ్య పవన్ స్టేజి మీద రావడం చూస్తే, రేపు స్క్రీన్ మీద చూపించే ఇంట్రో ఎలివేషన్ ఇంతకన్నా గొప్పగా ఉంటుందా అనే అనుమానం కలిగిందంటే ఆశ్చర్యం లేదు. సోషల్ మీడియాలో ఆ విజువల్స్ రచ్చ చేస్తున్నాయి.
స్పీచ్ లో సైతం పవన్ జోష్ మాములుగా లేదు. దర్శకుడు సుజిత్ వల్ల ఇలా ఓజాస్ గంభీరగా రావాల్సి వచ్చిందని, ఇలాంటి డైరెక్షన్ టీమ్ తనకు ఉండి ఉంటే పాలిటిక్స్ లో వచ్చే వాడిని కాదని చెప్పడం చూస్తే కంటెంట్ ఏ స్థాయిలో ఉందోనని ఫ్యాన్స్ అంచనాలు మరింత పెంచేసుకుంటున్నారు. ఈ సినిమా క్రెడిట్ మొదట సుజిత్, తర్వాత తమన్ కు చెందుతుందని చెప్పిన పవన్ కళ్యాణ్ ఎప్పుడో ఖుషి తర్వాత మళ్ళీ అంతటి జోష్ ఇప్పుడే చూస్తున్నానని చెప్పడం ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. శ్రియ రెడ్డి, ప్రియాంక మోహన్, ఇమ్రాన్ హష్మీల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించి వాళ్ళ మీద పొగడ్తల వర్షం కురిపించారు.
వర్షం అంతకంతా పెరిగి పోవడంతో ఈవెంట్ అర్ధాంతరంగా ఆపేయాల్సి వచ్చింది కానీ లేదంటే ఓజి సంబరం ఇంకో గంటకు పైగానే పీక్స్ కు చేరుకునేది. చినుకుల తాకిడి పెరగడం గమించిన పవన్ తన ప్రసంగాన్ని త్వరగా ముగించాల్సి వచ్చింది. తగ్గుతుందేమోనని చూసినప్పటికీ ఆ సూచనలు కనిపించలేదు. కొన్ని క్షణాల పాటు పవర్ కట్ కూడా ఇబ్బంది పెట్టింది. ఇంకొంచెం ముందుగా మొదలుపెట్టి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదేమో కానీ మొత్తానికి ఏది ఆశించి అన్ని వేల అభిమానులు ఈవెంట్ కు వచ్చారో దానికి రెట్టింపు ఒక్క పవన్ కళ్యాణ్ నుంచే వచ్చేసింది. ఇక మిగిలింది సెప్టెంబర్ 24 ప్రీమియర్ చూడటమే.
This post was last modified on September 21, 2025 9:35 pm
నాని ది ప్యారడైజ్ షూటింగ్ చివరి ఘట్టానికి వచ్చేసింది. ఇంకో వారం పది రోజుల్లో గుమ్మడికాయ కొట్టేలా ఉన్నారు. కీర్తి…
దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పరిణామాలను గమనిస్తే.. ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇమేజ్కు యువత పెద్ద ఎత్తున…
సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ డెబ్యూ ఫలితం తేలిపోయింది. కుర్రాడి నటనకు కాసిన్ని ప్రశంసలు దక్కినప్పటికీ కంటెంట్ పరంగా…
త్వరలోనే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు తెరదీయనున్నారు. సెప్టెంబరు-అక్టోబరు మధ్య మునిసిపాలిటీ… నవంబరు-డిసెంబరు మధ్య కార్పోరేషన్లు, జనవరిలో పంచాయతీ ఎన్నికలు…
శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ నుంచి బుమ్రా గాయం కారణంగా తప్పుకున్నాడు. అయితే అతని స్థానంలో సీనియర్ బౌలర్…
ప్రధాని నరేంద్ర మోదీ వీడియోను ఫేస్బుక్ నుంచి తొలగించిన వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సోషల్ మీడియా దిగ్గజం మెటా…