ప్రముఖ నటి సుమలత తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసిన ఒక పోస్ట్ అందరిని భావోద్వేగానికి గురి చేస్తోంది. తెలుగుతో పాటు పలు భాషల్లో నటించిన ఆమె.. తర్వాతి కాలంలో ప్రముఖ నటుడు అంబరీష్ ను పెళ్లాడటం.. ఈ మధ్యనే ఆయన మరణించటం తెలిసిందే. హ్యాపీ కఫుల్ గా పేరున్న వీరి బంధం ఎంతోమందికి స్ఫూర్తిని ఇచ్చేది. అనారోగ్యానికి గురైన అంబరీష్ మరణం ఆమెను ఎంతలానో కుంగదీసింది. అదేమీ బయటకు కనిపించకుండా ఉండేలా.. ధైర్యంగా కనిపిస్తుంటారు.
ఆమె గుండెల్లోని భావోద్వేగాన్ని తాజాగా ఒక పోస్ట్ లో పంచుకున్నారు. ఆ పోస్టును చదివినంతనే కన్నీటి చెమ్మ కమ్మేయటమే కాదు.. వారిద్దరి అనుబంధం ఎంతటిదన్న దానిపై మరింత స్పష్టత రావటం ఖాయం. నవంబరు 24తో అంబరీష్ మరణించి రెండేళ్లు అవుతుంది. ఈ సందర్భంగా తన మనసులోని భావోద్వేగానని ఇన్ స్టా పోస్టులో పంచుకున్నారు.
‘‘కళ్లు మూసి ఉంచగలను. చెవులను కూడా మూయగలను. కానీ నా హృదయాన్ని మాత్రం మూయలేను. ఎందుకంటే ఒక అనంతమైన ప్రేమ.. ఒక అపూర్వమైన శక్తి.. ఎన్నో జ్ఞాపకాలు దాగి ఉన్న హృదయం అది. మీరు లేకుండా రెండేళ్లు గడిచాయి. మీతో గడిపిన ప్రతి క్షణం.. ఎంత విలువైనదో తలుచుకుంటుననాను. మనం పంచుకున్న ఆ తీయని క్షణాలు.. జ్ఞాపకాలు.. నవ్వులు.. ప్రేమ.. అన్నీ అపూర్వమైనవి. సవాళ్లు ఎదురైనప్పుడు నా చెయ్యి పట్టుకొని నడిపించిన క్షణాలు.. కలిగించిన ఆత్మవిశ్వాసం.. నింపిన ధైర్యం.. చీకటి క్షణాల్లో నింపిన నమ్మకం.. ప్రేమ.. వదిలి వెళ్లిన వారసత్వం.. ఇవన్నీ నా జీవితం మొత్తం నన్ను నడిపిస్తాయి. మీ మంచితనం తాలూకు వెలుగు జీవితంలో నాకెదురయ్యే కష్టాల నుంచి కాపాడుతుంది. నా చివరి శ్వాస వరకూ మీరు ఉంటారు. నా నవ్వు.. నా ఏడుపు అన్నింట్లోనూ ఉంటారు. నేను పడిపోయినా.. తడబడినా.. మీ అనంతమైన బలం నన్ను నిలబడేలా చేస్తుంది నాకు తెలుసు. ఇప్పుడు బతికి ఉన్నది నేను కాదు. నా ద్వారా బతికి ఉన్నది మీరే.. మళ్లీ మనం ఒక్కటయ్యే వరకూ నా హృదయాన్ని పదిలంగా పట్టుకునే ఉండండి.. నన్ను బలంగా ఉంచండి’’ అంటూ తనకున్న అపారమైన ప్రేమాభిమానాల్ని తాజా పోస్ట్ తో వెల్లడించారు.
This post was last modified on November 25, 2020 10:34 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…