అయ్యప్పనుమ్ కోశియుమ్ చిత్రానికి మాటలు రాసి, స్క్రిప్టు పరంగా కాసిని మార్పులు చేసేందుకు గాను పది కోట్ల రూపాయలు చెల్లిస్తున్నారని బలంగా వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ సినిమాకు త్రివిక్రమ్ మాటలు రాస్తే కొంచెం క్రేజ్ వస్తుంది కానీ మలయాళం ఒరిజినల్ చూసిన వారికి దీనికి త్రివిక్రమ్ అవసరం దేనికనిపిస్తోంది. ఎందుకంటే ఆ చిత్రం కథ, పాత్రలు ప్రధానంగా సాగిపోతుంది. దానికంటూ ప్రత్యేక సంభాషణలు అవసరం లేదు.
మలయాళంలో వున్న డైలాగులను తర్జుమా చేసుకుని రాసుకుంటే సరిపోతుంది. దానికి త్రివిక్రమ్ ప్రాస కానీ, ఆయనకున్న పరిజ్ఞానం కానీ అవసరం లేదు. త్రివిక్రమ్ లాంటి రైటర్ను పెట్టుకుంటే సంభాషణల పరంగా తన ముద్ర చాటుకోవాలని లేనిపోని డైలాగులు రాసే ప్రమాదం కూడా లేకపోలేదు. అసలు ఈ చిత్రంలో అయ్యప్ప నాయర్ పాత్ర చేయడానికి పవన్ కళ్యాణ్ ఇమేజే సరిపోదని సాక్షాత్తూ పవన్ అభిమానులే చెబుతున్నారు. ఇక త్రివిక్రమ్ డైలాగులంటూ హంగామా చేస్తుండడంతో ఈ రీమేక్ రాంగ్ ట్రాక్లో వెళుతోందనే కామెంట్లు పడుతున్నాయి. పవన్కి జోడీగా సాయి పల్లవి నటిస్తుందనే రూమర్ కూడా ఒరిజినల్లో లేని హంగులన్నీ పెడుతున్నారనే ఫీలింగ్ మరింత పెంచింది.
This post was last modified on November 25, 2020 10:54 am
రాజకీయాల్లో జంపింగులు కొత్తకాదు. ఎవరికి నచ్చిన దిక్కుకు వారు వెళ్లిపోవడమూ కొత్తకాదు. ఎవరికి అవసరం.. అవకాశం ఉన్న దిశగా నాయకులు,…
ఎటు చూసినా వైసీపీకి ఛాన్స్ కనిపించడం లేదా? ఏ వర్గం కూడా వైసీపీకి ఆశించిన మేరకు చేరువ అయ్యే అవకాశం…
గత రెండు వారాలుగా ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేసేస్తోంది ‘దురంధర్-2’ సినిమా. దేశ విదేశాల్లో ఈ సినిమా ప్రభంజనం మామూలుగా…
గతంలో నెల మారుతున్నా.. ఏడాది మారుతున్నా నిబంధనల్లో మార్పులు పెద్దగా ఉండేవి కావు. ఇటీవల కాలంలో ఆ తీరులో పెను…
ఆపన్న హస్తం అందించడంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తనదైన శైలి స్పీదును చూపిస్తున్నారు. ఆపదలో ఉన్న వారికి ఏదో హామీ…
జనవరి సంక్రాంతి పండక్కు రావాల్సిన జన నాయకుడు వాయిదా పడి మూడు నెలలు గడిచిపోయాయి. ఒక స్టార్ హీరో సినిమా…