అయ్యప్పనుమ్ కోశియుమ్ చిత్రానికి మాటలు రాసి, స్క్రిప్టు పరంగా కాసిని మార్పులు చేసేందుకు గాను పది కోట్ల రూపాయలు చెల్లిస్తున్నారని బలంగా వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ సినిమాకు త్రివిక్రమ్ మాటలు రాస్తే కొంచెం క్రేజ్ వస్తుంది కానీ మలయాళం ఒరిజినల్ చూసిన వారికి దీనికి త్రివిక్రమ్ అవసరం దేనికనిపిస్తోంది. ఎందుకంటే ఆ చిత్రం కథ, పాత్రలు ప్రధానంగా సాగిపోతుంది. దానికంటూ ప్రత్యేక సంభాషణలు అవసరం లేదు.
మలయాళంలో వున్న డైలాగులను తర్జుమా చేసుకుని రాసుకుంటే సరిపోతుంది. దానికి త్రివిక్రమ్ ప్రాస కానీ, ఆయనకున్న పరిజ్ఞానం కానీ అవసరం లేదు. త్రివిక్రమ్ లాంటి రైటర్ను పెట్టుకుంటే సంభాషణల పరంగా తన ముద్ర చాటుకోవాలని లేనిపోని డైలాగులు రాసే ప్రమాదం కూడా లేకపోలేదు. అసలు ఈ చిత్రంలో అయ్యప్ప నాయర్ పాత్ర చేయడానికి పవన్ కళ్యాణ్ ఇమేజే సరిపోదని సాక్షాత్తూ పవన్ అభిమానులే చెబుతున్నారు. ఇక త్రివిక్రమ్ డైలాగులంటూ హంగామా చేస్తుండడంతో ఈ రీమేక్ రాంగ్ ట్రాక్లో వెళుతోందనే కామెంట్లు పడుతున్నాయి. పవన్కి జోడీగా సాయి పల్లవి నటిస్తుందనే రూమర్ కూడా ఒరిజినల్లో లేని హంగులన్నీ పెడుతున్నారనే ఫీలింగ్ మరింత పెంచింది.
This post was last modified on November 25, 2020 10:54 am
ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో కథానాయికగా నటిస్తూనే.. ఇంకోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ మెరుస్తోంది కీర్తి సురేష్. మహానటి తర్వాత…
విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు ఇన్నాళ్లూ ఏం జరిగినా పరిస్థితి…
తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న బాలీవుడ్ నటుడు ప్రదీప్ రావత్ హఠాత్తుగా కన్ను మూశారు. 74 ఏళ్ల ఈ లెజెండరీ…
ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి ఒక్క కొరియన్ కనకరాజు మీదే ఉంది. గత పది రోజులుగా…
రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే…
ఏపీలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిని ఆయన వివరించారు.…