రోజులో ఎన్ని షోలయినా వేసుకోవచ్చని, అలాగే టికెట్ ధర ఆయా సినిమా డిమాండ్కి తగ్గట్టుగా ఎంతయినా పెట్టుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చేసింది. త్వరలోనే ఏపీ గవర్నమెంట్ కూడా ఇదే ఉత్తర్వులు ఇస్తుందని తెలుగు చిత్ర పరిశ్రమ ఆశిస్తోంది. అయితే ఈ పెరిగిన టికెట్ రేట్లు చిన్న సినిమాలకు, మీడియం రేంజ్ సినిమాలకు ఏమంత ఉపయోగపడవు. అలాంటి చిత్రాలకు రేట్లు పెంచి అమ్మితే వచ్చే ప్రేక్షకులను స్వయంగా వెనక్కు పంపేసినట్టు అవుతుంది. ఈ పక్రియలో ముందుగా లాభపడే పెద్ద సినిమా వకీల్ సాబ్ అవుతుంది. ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయాలని దిల్ రాజు చూస్తున్నాడు.
సంవత్సరం తర్వాత రిలీజ్ అయ్యే పెద్ద సినిమా కావడం, అది కూడా పవన్ కళ్యాణ్ మూడేళ్ల తర్వాత తెరపై కనిపించే సినిమా కావడంతో వకీల్ సాబ్కు ఓపెనింగ్స్ పరంగా ఢోకా వుండదు. ఇప్పుడు రేట్లు కూడా బాగా పెంచుకోవచ్చు కాబట్టి ఇది దిల్ రాజుకి శుభవార్త. ఈ చిత్రానికి బడ్జెట్ కరోనా బ్రేక్కి ముందు వేసుకోగా, ఇప్పటి పరిస్థితుల్లో అది వర్కవుట్ అవడం లేదని దిల్ రాజు మల్లగుల్లాలు పడుతున్నాడు. ఈ టైమ్లో ఈ వార్త రావడంతో దిల్ రాజు మరోసారి లక్కీ రాజు అనిపించుకున్నాడు. వి సినిమాను లాక్డౌన్లో అమెజాన్ ద్వారా విడుదల చేసేసి దిల్ రాజు లాభపడిన సంగతి తెలిసిందే. అంత పెద్ద సినిమాను ఓటిటిలో విడుదల చేయడమేంటని అన్నవాళ్లే తెలివైన పని చేసాడని తర్వాత మెచ్చుకున్నారు.
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…
వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…
పెద్దిని ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రమోట్ చేసే ఉద్దేశంతో భోపాల్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్, ముంబైలో ట్రైలర్…