దుబాయ్ సైమా అవార్డుల వేడుకలో యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా దర్శకుడు సుకుమార్ పుష్ప 3 ది ర్యాంపేజ్ ఉంటుందని చెప్పడం ఒక్కసారిగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని యాక్టివేట్ చేసింది. వినడానికి సూపర్ ఎగ్జైటింగ్ గా ఉంది కానీ నిజంగా సాధ్యమా అనే కోణంలో విశ్లేషించుకుంటే అంత సులభంగా సమాధానం దొరకదు. ఎందుకంటే అట్లీ సినిమా షూట్ పూర్తయి విడుదలయ్యేనాటికి 2027 వచ్చేస్తుంది. ఒకవేళ ఇది కనక రెండు భాగాలైతే ఇంకో ఏడాది లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టొచ్చు. అప్పటికంతా సుకుమార్ హీరో రామ్ చరణ్ తో ఫిక్స్ చేసుకున్న ప్యాన్ ఇండియా మూవీని పూర్తి చేయొచ్చు.
ఒకవేళ నిజంగా పుష్ప 3 ఫిక్స్ చేసుకుంటే బన్నీ మరోసారి చాలా కాలం త్యాగం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ముందు హెయిర్ స్టైల్ పెంచాలి. ఆ బాడీ మ్యానరిజంకు తగ్గట్టు మళ్ళీ ఒంటిని కష్టపెట్టాలి. కానీ పుష్ప 1, పుష్ప 2 కోసం అయిదేళ్ళు ఆల్రెడీ ఖర్చు పెట్టేసిన బన్నీ మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తాడా అనే అనుమానాలు ఇండస్ట్రీ వర్గాల్లో లేకపోలేదు. కేవలం పుష్ప బ్రాండ్ తోనే మార్కెట్ కాకుండా కొత్త సినిమాలతో నార్త్ ఆడియన్స్ కి దగ్గరవ్వాలని అల్లు అర్జున్ ప్లాన్. దానికి తగ్గట్టే బాలీవుడ్ దర్శకులతో అప్పుడప్పుడు టచ్ లో ఉన్నాడట. కానీ ఇప్పుడప్పుడే ఎలాంటి ప్రకటనలు వచ్చే ఛాన్స్ లేదు.
పుష్ప 3 ర్యాంపేజ్ కార్యరూపం దాలిస్తే ఫ్యాన్స్ కు పండగే. కాకపోతే ఇప్పటిదాకా టాలీవుడ్ లో మూడో భాగం వచ్చిన ప్యాన్ ఇండియా మూవీ పెద్దగా లేవు. అప్పుడెప్పుడో దశాబ్దాల క్రితం రామ్ గోపాల్ వర్మ నిర్మాతగా మనీ, మనీ, మనీ మనీ మొర్ మనీ అనే సిరీస్ వచ్చింది కానీ మొదటిది తప్ప మిగిలినవి ఫెయిలయ్యాయి. పుష్పకు అంత రిస్క్ లేకపోయినా థర్డ్ పార్ట్ జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంటుంది. ఇక సుకుమార్ సంగతి తెలిసిందే. పర్ఫెక్షన్ కోసం ఏళ్ళకేళ్ళు ఒకే ప్రాజెక్టు మీద ఉండిపోతారు. రామ్ చరణ్ 17 అయ్యేక ఏ హీరోతో లాక్ కాని సుకుమార్ అన్నమాట ప్రకారం పుష్ప 3ని తెరకెక్కిస్తే ఇంకో హిస్టరీ రెడీ అవుతుంది.
This post was last modified on September 6, 2025 1:28 pm
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…
ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…
సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…