ఎప్పుడు ఏ సమయంలో పవన్ కళ్యాణ్ బిజీ అవుతారో తెలియదు కాబట్టి తనకిచ్చిన బంగారం లాంటి డేట్లను వృథా చేయకుండా దర్శకుడు హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ ని పరుగులు పెట్టిస్తున్నారు. ఈ ఏడాది విడుదల లేకపోయినా పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ సమయం కేటాయించి ప్రమోషన్ల కోసం ప్రత్యేక ప్లానింగ్ లో ఉన్నట్టు ఇన్ సైడ్ టాక్. ఇటీవలే ఒక పాట షూట్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. మొన్న పవన్ పుట్టినరోజుకి విడుదల చేసింది దాని స్టిల్లే. నిజానికి స్టెప్పుతో కూడిన చిన్న వీడియోని వదలాలనే ఆలోచన వచ్చిందట గాని ఓజి ఫీవర్ లో ఉన్న ఫ్యాన్స్ ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక పోస్టర్ తో సరిపెట్టారు.
ఇప్పుడు మరో సాంగ్ కోసం రంగం సిద్ధమైపోయింది. దినేష్ మాస్టర్ కొరియోగ్రఫీలో శనివారం నుంచి దీని షూట్ మొదలుపెట్టబోతున్నట్టు సమాచారం. ఇందులో కూడా క్రేజీ నృత్య భంగిమలు ఉంటాయని తెలిసింది. హరీష్ శంకర్ ముందు పలు సవాళ్లున్నాయి. తేరి రీమేకనే ప్రచారం ఉస్తాద్ భగత్ సింగ్ హైప్ మీద తీవ్ర ప్రభావం చూపించింది. ఇప్పుడిది ఒరిజినల్ కథని ఆయన చెబుతున్నారు కానీ తెరమీద చూశాక తప్ప అభిమానులు నమ్మలేని పరిస్థితి. ఇదలా ఉంచితే హైప్ లో పీక్స్ ని చూసిన ఓజి తర్వాత వస్తున్న సినిమాని హరీష్ శంకర్ డైరెక్ట్ చేశారు. సో ఆ హిట్టుని హీటుని అదే రీతిలో కొనసాగించాలి.
అందుకే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండేలా స్క్రిప్ట్ లో పలు మార్పులు చేసుకున్న హరీష్ శంకర్ మీద గబ్బర్ సింగ్ రేంజ్ విజయం ఇవ్వాల్సిన అతి పెద్ద బాధ్యత నెత్తి మీద ఉంది. ఇవి కాకుండా మిస్టర్ బచ్చన్ చేసిన గాయం పెద్దదే. రవితేజకో మర్చిపోలేని హిట్టు పడుతుందనుకుంటే పెద్ద డిజాస్టర్ దక్కింది. ఇప్పుడది పూర్తిగా సమిసిపోయేలా సక్సెస్ సాధించాలి. ఉస్తాద్ భగత్ సింగ్ అయ్యాక హరీష్ శంకర్ లిస్టులో సల్మాన్ ఖాన్, రామ్ లాంటి క్రేజీ స్టార్లు ఉన్నారు. వాళ్లలో ఎవరిని ఒప్పిస్తారో ఇంకా తేలలేదు. పవన్ మూవీ కనక పెద్ద హిట్టయితే ఆటోమేటిక్ గా పెద్ద కాంబోనే సెట్ అవుతుంది. అందులో సందేహం లేదు.
This post was last modified on September 5, 2025 7:48 am
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…
టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…