చాలా గ్యాప్ తర్వాత ఇటీవలే భైరవంతో రీ ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సెప్టెంబర్ 12 కిష్కిందపురితో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చావు కబురు చల్లగా ఫేమ్ కౌశిక పెగళ్లపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ ఇవాళ విడుదల చేశారు. కాన్సెప్ట్ ఏంటో చెప్పేశారు. దెయ్యాలు ఉన్నాయని ప్రచారంలో ఉన్న సువర్ణ మాయ అనే పాడుబడిన రేడియో స్టేషన్ లోకి సాయిశ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ తో పాటు ఓ మిత్రబృందం దిగుతుంది. ముందు సరదాగా మొదలైన ప్రయాణం ఊహించని మలుపులు తిరిగి ప్రమాదాలతో ప్రాణాల మీదకు తెస్తుంది. ఆ తర్వాత ఏమయ్యిందనేది స్టోరీ.
అరటిపండు వలిచినట్టు స్టోరీ ఇంత నీట్ గా చెప్పారంటే అసలు కంటెంట్ లో చాలా ట్విస్టులు ఉంటాయని అర్థమవుతోంది. చివరి షాట్ లో హాస్పిటల్ బెడ్ మీద అనుపమనే దెయ్యంగా చూపించడం లాంటివి ఆసక్తి రేపుతున్నాయి. రాజుగారి గది, మంత్ర, గీతాంజలి, మంగళవారం, విరూపాక్ష ఛాయలు అన్నీ కలిసినట్టు కనిపిస్తున్నప్పటికీ ఇంటెన్సిటీ చూపడంలో కౌశిక్ నేర్పరితనం అంచనాలు రేపుతోంది. రాక్షసుడు తర్వాత సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ కలిసి చేసిన మూవీ ఇది. చేతన్ భరద్వాజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మంచి ఎలివేషన్లతో భయం పుట్టించేలా సాగింది.
ఇక ట్రైలర్ సంగతి కాసేపు పక్కపెడితే కిష్కిందపురికి సెప్టెంబర్ 12 న మిరాయ్ రూపంలో పెద్ద పోటీనే స్వాగతం చెబుతోంది. వేర్వేరు జానర్లు అయినప్పటికీ రెండు సినిమాలు విఎఫ్ఎక్స్ మీద ఆధారపడినవి కావడం గమనించాల్సిన విషయం. కాకపోతే కిష్కింధపురిలో హారర్ ఎలిమెంట్స్ డామినేట్ చేస్తుండగా మిరాయ్ లో ఫాంటసీ అంశాలకు పెద్ద పీఠ వేశారు. పవన్ కళ్యాణ్ ఓజి వస్తున్న రెండు వారాల ముందు తలపడుతున్న ఈ రెండు సినిమాలు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయో వేచి చూడాలి. హిట్టు కోసం ఎదురు చూస్తున్న బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తో పాటు దర్శకుడికీ ఇది హిట్ కావడం చాలా అవసరం.
This post was last modified on September 3, 2025 11:56 am
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…