Movie News

ఇంట్రెస్టింగ్ : రేడియో స్టేషన్లో దెయ్యాల గోల

చాలా గ్యాప్ తర్వాత ఇటీవలే భైరవంతో రీ ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సెప్టెంబర్ 12 కిష్కిందపురితో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చావు కబురు చల్లగా ఫేమ్ కౌశిక పెగళ్లపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ ఇవాళ విడుదల చేశారు. కాన్సెప్ట్ ఏంటో చెప్పేశారు. దెయ్యాలు ఉన్నాయని ప్రచారంలో ఉన్న సువర్ణ మాయ అనే పాడుబడిన రేడియో స్టేషన్ లోకి సాయిశ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ తో పాటు ఓ మిత్రబృందం దిగుతుంది. ముందు సరదాగా మొదలైన ప్రయాణం ఊహించని మలుపులు తిరిగి ప్రమాదాలతో ప్రాణాల మీదకు తెస్తుంది. ఆ తర్వాత ఏమయ్యిందనేది స్టోరీ.

అరటిపండు వలిచినట్టు స్టోరీ ఇంత నీట్ గా చెప్పారంటే అసలు కంటెంట్ లో చాలా ట్విస్టులు ఉంటాయని అర్థమవుతోంది. చివరి షాట్ లో హాస్పిటల్ బెడ్ మీద అనుపమనే దెయ్యంగా చూపించడం లాంటివి ఆసక్తి రేపుతున్నాయి. రాజుగారి గది, మంత్ర, గీతాంజలి, మంగళవారం, విరూపాక్ష ఛాయలు అన్నీ కలిసినట్టు కనిపిస్తున్నప్పటికీ ఇంటెన్సిటీ చూపడంలో కౌశిక్ నేర్పరితనం అంచనాలు రేపుతోంది. రాక్షసుడు తర్వాత సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ కలిసి చేసిన మూవీ ఇది. చేతన్ భరద్వాజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మంచి ఎలివేషన్లతో భయం పుట్టించేలా సాగింది.

ఇక ట్రైలర్ సంగతి కాసేపు పక్కపెడితే కిష్కిందపురికి సెప్టెంబర్ 12 న మిరాయ్ రూపంలో పెద్ద పోటీనే స్వాగతం చెబుతోంది. వేర్వేరు జానర్లు అయినప్పటికీ రెండు సినిమాలు విఎఫ్ఎక్స్ మీద ఆధారపడినవి కావడం గమనించాల్సిన విషయం. కాకపోతే కిష్కింధపురిలో హారర్ ఎలిమెంట్స్ డామినేట్ చేస్తుండగా మిరాయ్ లో ఫాంటసీ అంశాలకు పెద్ద పీఠ వేశారు. పవన్ కళ్యాణ్ ఓజి వస్తున్న రెండు వారాల ముందు తలపడుతున్న ఈ రెండు సినిమాలు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయో వేచి చూడాలి. హిట్టు కోసం ఎదురు చూస్తున్న బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తో పాటు దర్శకుడికీ ఇది హిట్ కావడం చాలా అవసరం.

This post was last modified on September 3, 2025 11:56 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రాధేశ్యామ్ దర్శకుడెక్కడ?

‘బాహుబలి’ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించుకున్నాడు ప్రభాస్. అలాంటి హీరోతో సినిమా తీసే…

8 minutes ago

కేసీఆర్‌ కావాల‌నే మౌనంగా ఉన్నారా?

తెలంగాణ రాష్ట్ర సేన‌.. అంటూ టీఆర్ ఎస్ పార్టీని స్థాపించిన క‌విత వ్య‌వ‌హారంపై బీఆర్ ఎస్ నాయ‌కులు మౌనంగా ఉన్నారు.…

5 hours ago

దాగుడుమూతల దృశ్యానికి మోక్షం దక్కింది

మోహన్ లాల్ దృశ్యం 3 మరోసారి రిలీజ్ డేట్ ప్రకటించింది. మే 21 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అడుగు పెట్టబోతున్నట్టు అధికారికంగా…

5 hours ago

మనసు మారిందా వీరభద్రుడా

బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ల తర్వాత సూర్య సినిమాలు వరసగా రాబోతున్నాయి. వాటిలో మొదటిది వీరభద్రుడు. తమిళంలో కరుప్పుగా రూపొందిన…

6 hours ago

తప్పు చేస్తే చంద్రబాబుకి ఎవరైనా ఒకటే

సొంత పార్టీ నాయ‌కుడు త‌ప్పు చేస్తే ఒక‌విధంగా.. ప్ర‌త్య‌ర్థి పార్టీ నేత‌లు త‌ప్పులు చేస్తే మ‌రో విధంగా మారి పోయిన…

7 hours ago

సింహాన్ని దాచకుండా మంచి పని చేశారు

మే 1 విడుదల కాబోతున్న గాయపడ్డ సింహం మీద టీమ్ కన్నా ఎక్కువగా బయ్యర్ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే…

8 hours ago