అసలు ఎలాంటి ప్రకటన చేయకుండా, ప్రెస్ మీట్ పెట్టకుండా, అనౌన్స్ మెంట్ ఇవ్వకుండా నిర్మాణం నుంచే అంచనాలను ఆకాశానికి ఎలా తీసుకెళ్ళాలో రాజమౌళికి తెలిసినంతగా ఇండియాలో ఇంకెవరికి తెలియదని చెప్పడంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. దానికి సాక్ష్యంగా నిలుస్తోంది ఎస్ఎస్ఎంబి 29. తాజాగా కెన్యా దేశానికి వెళ్లిన జక్కన్న అక్కడి ప్రధాన కేబినెట్ సెక్రెటరీ ముసలియా డబ్ల్యు ముదలాడిని కలుసుకున్నారు. స్వయానా అంతటి స్థాయి వ్యక్తే ఈ కలయిక గురించి గర్వంగా చెప్పుకుంటూ ట్వీట్ చేశారంటే మన టాలీవుడ్ ఎంత ఎత్తుకు ఎదిగిందో అర్థం చేసుకోవచ్చు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
మొత్తం 120 టీమ్ సభ్యులతో కెన్యా వెళ్లిన రాజమౌళి అక్కడ చాలా కీలకమైన షెడ్యూల్స్ ప్లాన్ చేసుకున్నారు. మసై మర, నైవష, సంబూరు, అంబోసెలి లాంటి అద్భుతమైన ప్రదేశాల్లో చిత్రీకరణ చేయబోతున్నారు. నిజమైన జంతువులు కొన్ని ఇందులో భాగం కాబోతున్నాయని సమాచారం. ఇన్ సైడ్ లీక్స్ ప్రకారం కొన్ని పదుల జనరేషన్ల తర్వాత ఒక రహస్యాన్ని ఛేదించడానికి వెళ్లిన హీరోకు ఎదురయ్యే ప్రమాదాలు అడవి నుంచి మొదలవుతాయని, అందులో భాగంగా వచ్చే సన్నివేశాలన్నీ కెన్యాలోనే షూట్ చేయబోతున్నట్టు సమాచారం. ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో రూపొందే వరల్డ్ సినిమాలన్నీ తొంబై శాతం కెన్యాలోనే తీస్తారు.
ఫైట్లు, ఛేజులు, యాక్షన్ ఎపిసోడ్లు ఇప్పుడీ కెన్యా షెడ్యూల్ లో భాగం కాబోతున్నాయని సమాచారం. దీంతో సగానికి పైగా పూర్తవుతుందని వినికిడి. కెన్యా ప్రముఖ న్యూస్ పేపర్ ది స్టార్ కథనం ప్రకారం ఎస్ఎస్ఎంబి 29 రెండు భాగాలుగా వస్తుంది. కానీ దీనికి సంబంధించి రాజమౌళి ఇప్పటిదాకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇండియానా జోన్స్ స్ఫూర్తిగా తీసుకున్న రాజమౌళి దానికి ఇండియన్ నేటివిటీ జోడించి ఒక థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతున్నారు. ప్రాథమికంగా 1200 కోట్ల దాకా బడ్జెట్ అవ్వొచ్చని అంటున్నారు. వివిధ భాషల్లో ఒకేసారి 120 దేశాల్లో ఈ ప్యాన్ వరల్డ్ మూవీని 2027లో రిలీజ్ చేయబోతున్నారు.
This post was last modified on September 3, 2025 11:49 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…