Movie News

ఎస్ఎస్ఎంబి 29 – కెన్యా అడవుల్లో అరాచకం

అసలు ఎలాంటి ప్రకటన చేయకుండా, ప్రెస్ మీట్ పెట్టకుండా, అనౌన్స్ మెంట్ ఇవ్వకుండా నిర్మాణం నుంచే అంచనాలను ఆకాశానికి ఎలా తీసుకెళ్ళాలో రాజమౌళికి తెలిసినంతగా ఇండియాలో ఇంకెవరికి తెలియదని చెప్పడంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. దానికి సాక్ష్యంగా నిలుస్తోంది ఎస్ఎస్ఎంబి 29. తాజాగా కెన్యా దేశానికి వెళ్లిన జక్కన్న అక్కడి ప్రధాన కేబినెట్ సెక్రెటరీ ముసలియా డబ్ల్యు ముదలాడిని కలుసుకున్నారు. స్వయానా అంతటి స్థాయి వ్యక్తే ఈ కలయిక గురించి గర్వంగా చెప్పుకుంటూ ట్వీట్ చేశారంటే మన టాలీవుడ్ ఎంత ఎత్తుకు ఎదిగిందో అర్థం చేసుకోవచ్చు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

మొత్తం 120 టీమ్ సభ్యులతో కెన్యా వెళ్లిన రాజమౌళి అక్కడ చాలా కీలకమైన షెడ్యూల్స్ ప్లాన్ చేసుకున్నారు. మసై మర, నైవష, సంబూరు, అంబోసెలి లాంటి అద్భుతమైన ప్రదేశాల్లో చిత్రీకరణ చేయబోతున్నారు. నిజమైన జంతువులు కొన్ని ఇందులో భాగం కాబోతున్నాయని సమాచారం. ఇన్ సైడ్ లీక్స్ ప్రకారం కొన్ని పదుల జనరేషన్ల తర్వాత ఒక రహస్యాన్ని ఛేదించడానికి వెళ్లిన హీరోకు ఎదురయ్యే ప్రమాదాలు అడవి నుంచి మొదలవుతాయని, అందులో భాగంగా వచ్చే సన్నివేశాలన్నీ కెన్యాలోనే షూట్ చేయబోతున్నట్టు సమాచారం. ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో రూపొందే వరల్డ్ సినిమాలన్నీ తొంబై శాతం కెన్యాలోనే తీస్తారు.

ఫైట్లు, ఛేజులు, యాక్షన్ ఎపిసోడ్లు ఇప్పుడీ కెన్యా షెడ్యూల్ లో భాగం కాబోతున్నాయని సమాచారం. దీంతో సగానికి పైగా పూర్తవుతుందని వినికిడి. కెన్యా ప్రముఖ న్యూస్ పేపర్ ది స్టార్ కథనం ప్రకారం ఎస్ఎస్ఎంబి 29 రెండు భాగాలుగా వస్తుంది. కానీ దీనికి సంబంధించి రాజమౌళి ఇప్పటిదాకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇండియానా జోన్స్ స్ఫూర్తిగా తీసుకున్న రాజమౌళి దానికి ఇండియన్ నేటివిటీ జోడించి ఒక థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతున్నారు. ప్రాథమికంగా 1200 కోట్ల దాకా బడ్జెట్ అవ్వొచ్చని అంటున్నారు. వివిధ భాషల్లో ఒకేసారి 120 దేశాల్లో ఈ ప్యాన్ వరల్డ్ మూవీని 2027లో రిలీజ్ చేయబోతున్నారు.

This post was last modified on September 3, 2025 11:49 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

1 hour ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

2 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

2 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

4 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

5 hours ago

దమ్ముంటే నన్ను జైలుకు పంపు: జగన్ కు బీజేపీ మంత్రి సవాల్

మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…

6 hours ago