తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ సినిమాల్లోకి రావడం ఇష్టమే లేదన్నట్లుగా మాట్లాడాడు విజయ్ దేవరకొండ ఒకప్పుడు. ఆనంద్ తొలి చిత్రం ‘దొరసాని’ లాంచ్ అయినపుడు.. ఫస్ట్ లుక్ రిలీజైనపుడు.. టీజర్ వచ్చినపుడు అతను పట్టించుకోనట్లే ఉన్నాడు. దీంతో తమ్ముడి మీద ఏమైనా కోపంగా ఉన్నాడా అనుకున్నారు అందరూ. కానీ ‘దొరసాని’ రిలీజ్ ముంగిట విజయ్ సోదర ప్రేమ బయటికి వచ్చింది. ఆ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా వచ్చి తమ్ముడిని, తమ్ముడి డెబ్యూ మూవీని తెగ పొగిడేశాడు. ఆ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందని జోస్యం చెప్పాడు. కానీ అతడి అంచనాలు తిరగబడ్డాయి. సినిమా ఆడలేదు. పైగా ఆనంద్ విమర్శల పాలయ్యాడు. ఐతేనేం ఆనంద్ కెరీర్ ఏమీ స్లో అయిపోలేదు. అవకాశాలు ఆగిపోలేదు. మూడు సినిమాలు చేతికొచ్చాయి. అందులో ఒకటి పూర్తయి విడుదలైంది. మంచి స్పందన కూడా తెచ్చుకుంటోంది. ఆ చిత్రమే.. మిడిల్ క్లాస్ మెలోడీస్.
ఈ నెల 20న అమేజాన్ ప్రైమ్లో విడుదలైన ‘మిడిల్ క్లాస్ మెలొడోస్’కు కొంచెం లేటుగా రివ్యూ ఇచ్చాడు విజయ్. కాస్ట్ అండ్ క్రూ అందరి మీదా అతను ప్రశంసలు కురిపించేశాడు. దర్శకుడు వినోద్ అనంతోజు సహా టెక్నీషియన్లందరూ అద్భుత పనితనం చూపారంటూ వారిని ప్రశంసించిన విజయ్.. ఆర్టిస్టుల పెర్ఫామెన్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కొండలరావు పాత్రలో అదరగొట్టిన గోపరాజు రమణకు వెంటనే ఏదైనా అవార్డు ఇవ్వాలన్న విజయ్.. హీరో ఫ్రెండు పాత్రలో మెరిసిన చైతన్యకు ఛాన్సులు ఇవ్వాలని కోరాడు. హీరో ఫ్రెండు లవర్ పాత్రలో ఆకట్టుకున్న దివ్య చేసే ప్రతి సినిమాలోనూ ఆకట్టుకుంటోందని అన్నాడు.
తన ఫ్రెండు తరుణ్ భాస్కర్ ఏదైనా చేసేయగలడని.. తాము అతడికి రుణ పడి ఉంటామని చెప్పాడు. వర్ష బొల్లమ్మ పెర్ఫామెన్స్ సూపర్ అన్న విజయ్.. చివరగా తమ్ముడు ఆనంద్ గురించి మాట్లాడాడు. అతణ్ని చూస్తే తనకు గర్వంగా ఉందని, అతను ఎంచుకుంటున్న సినిమాలు కూడా గర్వపడేలా ఉంటున్నాయని అన్నాడు. తనకంటూ ఒక ప్రత్యేకమైన దారి వేసుకుని అందులో సాగుతున్న ఆనంద్ నుంచి మరిన్ని మంచి సినిమాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశాడు. చివరగా సినిమాలో హీరో తండ్రి చెప్పే.. ‘‘కష్టపడు.. ఏదైనా అవసరం అయితే కాల్ చెయ్యి’’ అనే డైలాగ్తో తమ్ముడికి ఒక మెసేజ్ ఇచ్చి ముగించాడు విజయ్.
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…
మెగాస్టార్ చిరంజీవి సినిమా రహస్యాలను లీక్ చేయడంలో ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా టైటిల్ను అనుకోకుండా రివీల్…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ అగ్ర నటుడు నందమూరి…
"ఏనుగు పోతుంటే చూడరు.. చీమ కుడితే గగ్గోలు పెడతారు" అనే సామెత రాజకీయాలకు కూడా సరిగ్గా సరిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.…
ఇటీవలే విడుదలైన వంద దేవుళ్ళులో కథ మొత్తం ఆర్టిస్ట్ స్వసిక చుట్టూ నడుస్తుంది. భర్తను కోల్పోయి పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లల…
కంబ్యాక్ అవ్వాలనే సంకల్పంతో నిర్మాతగా మారి మరీ హీరోగా నటించిన వడ్డే నవీన్ కు ఆశించిన స్వాగతం దక్కలేదు. ట్రాన్స్…