ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ వెర్సస్ థియేటర్స్ అన్నట్లుగా నడుస్తోంది ఇప్పటిదాకా ట్రెండ్. ఒకప్పుడు కొత్త సినిమాలు థియేటర్లలో రిలీజయ్యేవి. తర్వాత ఓటీటీల్లోకి వచ్చేవి. కానీ కరోనా కారణంగా థియేటర్లు మూత పడ్డాక కథ మారిపోయింది. ముందు ఓటీటీల్లో సినిమాలు విడుదలవడం మొదలైంది. ఆర్నెల్ల ముందు మొదలైన ఈ ఒరవడి ఇంకా కొనసాగుతూనే ఉంది.
ఐతే మొదట్లో నేరుగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్లో సినిమాలు రిలీజ్ చేయడం పట్ల థియేటర్ల యాజమాన్యాలు తీవ్రంగా స్పందించాయి. దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. అయినా సరే ఇటు నిర్మాతలు, అటు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ముందుకెళ్లిపోయాయి. అన్ని భాషల్లో కలిపి గత ఆరేడు నెలల్లో 50 దాకా సినిమాలు ఓటీటీల్లోకి వచ్చాయి. ఐతే థియేటర్లు పూర్తి స్థాయిలో మొదలయ్యాక పరిస్థితి ఎలా ఉంటుందన్నది చూడాలి.
ఐతే భిన్న ధ్రువాల్లా సాగిన ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్, థియేటర్ల యాజమాన్యాలు కూడా కలిసి పని చేసే అవకాశాలు లేకపోలేదని సంకేతాలు అందుతున్నాయి. ఇందుకు జీ స్టూడియోస్ వాళ్లు వేసిన ముందడుగే నిదర్శనం. ఆ సంస్థ సాయిధరమ్ తేజ్ సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్నట్లు ముందు వార్తలొచ్చాయి. ప్రిమియర్స్ ఇదిగో అదిగో అన్నారు. కానీ ఇటీవల ఆ చిత్రాన్ని థియేటర్లలోనే రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. కానీ జీ స్టూడియోస్ భాగస్వామ్యంతోనే రిలీజ్ అంటూ ట్విస్ట్ ఇచ్చారు. ఆ సంస్థ ఈ సినిమా థియేట్రికల్ హక్కులతో పాటు డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కూడా సొంతం చేసుకుంది. ఎప్పుడు ఎక్కడ రిలీజ్ చేయాలన్నది వాళ్లిష్టమే. బహుశా థియేటర్లలో రిలీజ్ చేసిన కొన్ని రోజులకే.. ఓటీటీలో సినిమాను విడుదల చేసే అవకాశముంది. ఒకేసారి రెండు చోట్లా రిలీజ్ చేసే రోజులు కూడా వస్తే ఆశ్చర్యం లేదేమో.
ఇదే కోవలో శ్రీ విష్ణు సినిమా ‘రాజ రాజ చోర’ చిత్రాన్ని కూడా జీ స్టూడియోస్ వాళ్లే సొంతం చేసుకోవడం విశేషం. మున్ముందు ఇలా ఓటీటీ ప్లస్ థియేటర్స్ డీల్స్ మరిన్ని జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
తెలుగులో వచ్చిన ఉత్తమ హార్రర్ చిత్రాల్లో.. ‘మసూద’ కచ్చితంగా చెప్పుకోవాల్సిన పేరు. ఇందులో పెద్దగా పేరున్న నటులేమీ నటించలేదు. అప్…
తెలుగులో వచ్చిన చిన్న సినిమాల్లో అతి పెద్ద సంచలనాల్లో ‘బేబీ’ ఒకటి. వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్…
సీఎం చంద్రబాబు మీద మాజీ సీఎం జగన్ నోరు పారేసుకోవడం కొత్తేమీ కాదు. చంద్రబాబును నడిరోడ్డుపై ఉరి తీసినా తప్పులేదు…
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్…
రాజకీయ నాయకులకు కొన్ని ప్రత్యేకమైన మేనరిజాలు, సిగ్నేచర్లు ఉంటాయి. అవే వారికి ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి…
మాములుగా మన తెలుగు తమిళ సినిమాల్లో మాఫియా అంటే ముంబైనే చూపిస్తారు. రజనీకాంత్ బాషా నుంచి పవన్ కళ్యాణ్ ఓజి…