నందమూరి అభిమానులు విపరీతమైన ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్న అఖండ 2 విడుదల సెప్టెంబర్ 25 ఉండదనే క్లారిటీ దాదాపు వచ్చినట్టే. నిజానికి ఈ డేట్ ని ఎలాగైనా చేరుకోవాలనే లక్ష్యంతో దర్శకుడు బోయపాటి శీను తన రెగ్యులర్ స్టైల్ ని పక్కనపెట్టి మరీ షూటింగ్ వేగంగా చేశారు. బాలకృష్ణ పూర్తిగా సహకరించి సకాలంలో డబ్బింగ్ కూడా అయిపోగొట్టేసి టీమ్ కి టెన్షన్ లేకుండా చేశారు. అయినా సరే పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు విఎఫెక్స్ వర్క్స్ ఇంకా పెండింగ్ ఉండటంతో ఒత్తిడి తీసుకోవడం ఇష్టం లేక వాయిదా నిర్ణయం తీసుకున్నారని ఇన్ సైడ్ టాక్. కొత్త డేట్ ఇంకా ప్రకటించలేదు.
అదే రోజు ఓజి ఉంది కాబట్టి పోస్ట్ పోన్ చేస్తున్నారనే ప్రచారంలో నిజం లేదనేది యూనిట్ చెబుతున్న మాట. దసరా సెలవులు ఉంటాయి కాబట్టి క్లాష్ ఉన్నా లేకపోయినా అఖండ 2 చూసే ఆడియన్స్ శాతం ఎంత మాత్రం తగ్గిపోదని అంటున్నారు. సరే దీని సంగతలా ఉంచితే రాజా సాబ్ వదులుకోబోయే డిసెంబర్ 5న అఖండ 2 రావొచ్చనే ప్రచారానికి ఇంకా అధికారిక ముద్ర పడాల్సి ఉంది. ఎలాగూ 2026 సంక్రాంతి ప్యాక్ అయిపోయింది కాబట్టి అప్పటిదాకా ఆగే ఛాన్స్ లేదు. పుష్ప 2, యానిమల్, అఖండ గతంలో డిసెంబర్ లోనే వచ్చి బ్లాక్ బస్టర్లు సాధించి రికార్డులు తుడిచిపెట్టాయి. సో అది ఖచ్చితంగా మంచి ఆప్షనే.
ప్రమోషన్లు మాత్రం అఖండ 2కి ఇప్పట్లో మొదలుపెట్టేలా లేరు. ఒకవేళ డిసెంబర్ అయితే ఇంకా చాలా టైం ఉంది కాబట్టి వెయిట్ చేస్తారు. తమన్ పాటలు ఇంకా బయటికి రాలేదు. ఈసారి అదిరిపోయే ఆల్బమ్ ఉంటుందని ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ డివోషనల్ యాక్షన్ డ్రామాలో ఆది పినిశెట్టి విలన్ గా నటించాడు. రషెస్ చూసిన వాళ్ళు కంటెంట్ టెర్రిఫిక్ గా ఉందని, అఖండని మించి విజువల్స్ అదిరిపోయాయని అంటున్నారు. అదే నిజమైతే మాత్రం బాలయ్య విశ్వరూపానికి ఈసారి ఎలాంటి రికార్డులు బద్దలు కాబోతున్నాయో చూడాలి.
This post was last modified on August 28, 2025 10:27 am
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…