తమిళంలో మంచి పేరున్న హీరోయిన్లలో ఒకరైన లక్ష్మీ మీనన్ విచిత్రమైన వివాదంతో వార్తల్లో నిలిచింది. ఆమెపై కేరళలోని కొచ్చిలో కిడ్నాప్ కేసు నమోదు కావడం గమనార్హం. అంతేకాక ఆమె పరారీలో ఉంది. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆమె కిడ్నాప్ చేసి హింసించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఇంతకీ ఏం జరగిందంటే..?
కొచ్చిలో ఇటీవల ఒక బార్ దగ్గర లక్ష్మీ మీనన్, ఆమె స్నేహితులకు.. ఒక ఐటీ ఉద్యోగి బృందంతో గొడవ జరిగింది. ఐతే ఆ గొడవ కాస్త సద్దుమణిగాక కూడా లక్ష్మీ మీనన్, ఆమె స్నేహితులు ఊరుకోలేదు. పంతం పట్టి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని తమ వాహనంతో వెంబడించారు. ఆ వ్యక్తిని ఒక చోట పట్టుకుని కారులోకి బలవంతంగా ఎక్కించారు. లోపల అతడిపై తీవ్రంగా దాడి చేశారు. దీంతో ఆ ఉద్యోగి తనను కిడ్నాప్ చేసి దాడి చేశారంటూ లక్ష్మీ మీనన్, ఆమె స్నేహితులపై కేసు పెట్టాడు. ఐతే పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళ్తే లక్ష్మి వారి చేతికి చిక్కలేదు. ఆమె పరారీలో ఉందని పోలీసులు తెలిపారు. ఆమె కోసం గాలింపు చేపడుతున్నట్లు వెల్లడించారు.
లక్ష్మి మీనన్ చాలా చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగు పెట్టింది. తమిళంలో ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టిన ‘కుంకి’ (తెలుగులో గజరాజు)లో నటించే సమయానికి ఆమె వయసు 19 ఏళ్లే. కోలీవుడ్లో ఇంకా పాండియనాడు, నాన్ సిగప్పు మనిదన్, జిగర్ తండా లాంటి సూపర్ హిట్ సినిమాల్లో ఆమె నటించింది. మాతృ భాష మలయాళమే అయినా ఆమెకు తమిళంలోనే మంచి పేరు వచ్చింది. డబ్బింగ్ సినిమాలతో లక్ష్మికి తెలుగులోనూ మంచి గుర్తింపే లభించింది. ఈ మధ్య ఆమెకు కాస్త సినిమాలు తగ్గాయి. ఇలాంటి టైంలో ఈ వివాదంతో వార్తల్లోకి వచ్చింది.
This post was last modified on August 28, 2025 8:05 am
ఒకప్పుడు మంచి స్నేహితులుగా ఉన్న తమిళ స్టార్ హీరో ధనుష్, అగ్ర కథానాయిక నయనతార.. కొన్ని కారణాల వల్ల శత్రువులుగా…
ఎప్పుడు ఎవరి కెరీర్ ఎలా మలుపు తిరుగుతుందో చెప్పలేం. తమిళ కుర్రాడు ప్రదీప్ రంగనాథన్కు... నాలుగేళ్ల ముందు వరకు తమిళనాడులోనే…
బీఆర్ ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ సీఎం కేసీఆర్ తనయ, మాజీ ఎంపీ కవిత ఈ నెలలో…
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బ్యాటర్ల విధ్వంసం ముందు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తోకముడిచింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో…
ఎంత పెద్ద స్టార్ హీరో నటించిన సినిమా అయినా సరైన రీతిలో ప్రేక్షకులకు దానిని చేరవేయడం చాలా అవసరం. కానీ…
ఉప్పెనతో డెబ్యూ చేసిన హీరోయిన్ కృతి శెట్టి వరసగా సినిమాలైతే చేస్తోంది కానీ విజయ లక్ష్మి మాత్రం రానని మొండికేస్తోంది.…