తమిళంలో మంచి పేరున్న హీరోయిన్లలో ఒకరైన లక్ష్మీ మీనన్ విచిత్రమైన వివాదంతో వార్తల్లో నిలిచింది. ఆమెపై కేరళలోని కొచ్చిలో కిడ్నాప్ కేసు నమోదు కావడం గమనార్హం. అంతేకాక ఆమె పరారీలో ఉంది. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆమె కిడ్నాప్ చేసి హింసించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఇంతకీ ఏం జరగిందంటే..?
కొచ్చిలో ఇటీవల ఒక బార్ దగ్గర లక్ష్మీ మీనన్, ఆమె స్నేహితులకు.. ఒక ఐటీ ఉద్యోగి బృందంతో గొడవ జరిగింది. ఐతే ఆ గొడవ కాస్త సద్దుమణిగాక కూడా లక్ష్మీ మీనన్, ఆమె స్నేహితులు ఊరుకోలేదు. పంతం పట్టి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని తమ వాహనంతో వెంబడించారు. ఆ వ్యక్తిని ఒక చోట పట్టుకుని కారులోకి బలవంతంగా ఎక్కించారు. లోపల అతడిపై తీవ్రంగా దాడి చేశారు. దీంతో ఆ ఉద్యోగి తనను కిడ్నాప్ చేసి దాడి చేశారంటూ లక్ష్మీ మీనన్, ఆమె స్నేహితులపై కేసు పెట్టాడు. ఐతే పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళ్తే లక్ష్మి వారి చేతికి చిక్కలేదు. ఆమె పరారీలో ఉందని పోలీసులు తెలిపారు. ఆమె కోసం గాలింపు చేపడుతున్నట్లు వెల్లడించారు.
లక్ష్మి మీనన్ చాలా చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగు పెట్టింది. తమిళంలో ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టిన ‘కుంకి’ (తెలుగులో గజరాజు)లో నటించే సమయానికి ఆమె వయసు 19 ఏళ్లే. కోలీవుడ్లో ఇంకా పాండియనాడు, నాన్ సిగప్పు మనిదన్, జిగర్ తండా లాంటి సూపర్ హిట్ సినిమాల్లో ఆమె నటించింది. మాతృ భాష మలయాళమే అయినా ఆమెకు తమిళంలోనే మంచి పేరు వచ్చింది. డబ్బింగ్ సినిమాలతో లక్ష్మికి తెలుగులోనూ మంచి గుర్తింపే లభించింది. ఈ మధ్య ఆమెకు కాస్త సినిమాలు తగ్గాయి. ఇలాంటి టైంలో ఈ వివాదంతో వార్తల్లోకి వచ్చింది.
గోదావరి జిల్లాల రాజకీయం ఎప్పుడూ హాట్ హాట్గానే ఉంటుంది. ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తీర్పు ఇస్తే రాష్ట్రంలో…
ఒక సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ అంటే సాధారణంగా క్రేజ్ ఎక్కువగానే ఉంటుంది. అందుకే పుష్ప 2, కెజిఎఫ్ 2,…
తెలంగాణలో జనసేన అధినేత పవన్కల్యాణ్.. ఈ నెల 2న నిర్వహించ తలపెట్టిన తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభకు పోలీసులు అనుమతి…
దర్శకుడు సురేందర్ రెడ్డి పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. కారణం పవన్ కళ్యాణ్ అంగీకారం వస్తే సినిమా మొదలుపెట్టాలి. ఈ…
ఏపీలో ప్రతిపక్ష పార్టీ(ప్రధాన కాదు)గా ఉన్న వైసీపీ రెండేళ్ల కాలంలో ఏం చేసింది? ఏం సాధించింది? అనేది ఆసక్తికరం. శుక్రవారం(జూన్…
దర్శకులందు అనిల్ రావిపూడి వేరయాని ఊరికే అనలేదు. షూటింగ్ మొదలుపెట్టడానికి ముందే తనదైన ప్రమోషన్లతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్…