ఒకప్పుడు వసూళ్ల పరంగా రికార్డులు నెలకొల్పుతూ.. ఇండస్ట్రీ హిట్లు కొడుతూ టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడిగా ఉండేవాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఖుషి, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది లాంటి చిత్రాలు సాధించిన వసూళ్లు చూసి ఆయా సందర్భాల్లో అందరూ ఆశ్చర్యపోయారు. బాహుబలి కంటే ముందు ఇండస్ట్రీ రికార్డ్ పవన్ పేరిటే ఉంది. ఐతే రాజకీయాల్లో బిజీ అయ్యాక పవన్కు సినిమాల మీద ఫోకస్ తగ్గిపోయింది. సరైన కాంబినేషన్లు కుదరలేదు. ఎక్కువగా రీమేక్లు చేశాడు.
దీంతో ఆయన సినిమాల బిజినెస్, వసూళ్ల స్థాయి పడిపోయింది. అదే సమయంలో వేరే స్టార్లు ముందుకు దూసుకెళ్లిపోయారు. వంద కోట్ల షేర్ అన్నది చాలామందికి కేక్ వాక్ అయిపోయింది. కానీ పవన్ మాత్రం ఇంకా ఆ ఘనతను అందుకోలేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. గత దశాబ్ద కాలంలో ఆయన చేసిన స్ట్రెయిట్ మూవీస్ అజ్ఞాతవాసి, హరిహర వీరమల్లు డిజాస్టర్లు కాగా.. రీమేక్ మూవీస్ ఒక స్థాయికి మించి ఆడలేకపోయాయి. దీంతో వంద కోట్ల షేర్ అన్నది పవన్కు ఇప్పటికీ కలగానే ఉంది. కానీ ఈ కలెక్షన్ల రికార్డులు ఎప్పుడూ ఆయన దృష్టిలో ఉండలేదు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో పార్టీని నడపడానికి మాత్రమే సినిమాలు చేస్తున్నానని ఆయన చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి.
ఐతే పవన్ కొత్త సినిమా ‘ఓజీ’కి ఉన్న అనూహ్యమైన హైప్ దృష్ట్యా వంద కోట్ల షేర్ అన్నది లాంఛనమే అనడంలో సందేహం లేదు. టాక్ ఎలా ఉన్నా ఈ సినిమా వంద కోట్ల షేర్ సాధించడానికి అడ్డంకులేమీ లేనట్లే. ఐతే పవన్ ఆ ఘనతను సాధిస్తే సరిపోదు. దానికి రెట్టింపు వసూళ్లు రాబడితేనే ‘ఓజీ’ని సక్సెస్ ఫుల్ సినిమాగా నిలబెట్టగలడు. ఎందుకంటే ఈ సినిమాకు బిజినెస్ ఆ రేంజిలో జరిగింది. ఓజీ నైజాం హక్కులు మాత్రమే రూ.60 కోట్లు పలకడం విశేషం. ఆంధ్రా రైట్స్ రూ.75 కోట్లు, రాయలసీమయ హక్కులు రూ.25 కోట్ల దాకా పలికినట్లు సమాచారం.
ఓవర్సీస్ రైట్స్ అన్నీ కలిపితే మొత్తం బిజినెస్ లెక్క రూ.200 కోట్లకు చేరుతోంది. అంటే ఆ మేరకు ‘ఓజీ’ షేర్ రాబట్టాల్సి ఉంది. అంటే గ్రాస్ కలెక్షన్లు రూ.350 కోట్లను దాటిపోవాలి. సినిమా సోలోగా దసరా సెలవుల్లో రిలీజవుతోంది. హైప్ మామూలుగా లేదు. కాబట్టి కావాల్సిందల్లా పాజిటివ్ టాకే. అది వచ్చిందంటే ఇప్పటిదాకా రూ.100 కోట్ల షేర్ కూడా సాధించని పవన్.. నేరుగా రూ.200 కోట్ల షేర్ క్లబ్బులోకి అడుగు పెట్టేస్తాడు.
This post was last modified on August 25, 2025 5:13 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…