పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీలో వరుసబెట్టి సినిమాలు ప్రకటించడం.. అందులో రెండు చిత్రీకరణ దశలో ఉండటం తెలిసిన సంగతే. ‘వకీల్ సాబ్’ షూటింగ్ చివరి దశలో ఉండగా.. క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కోసం కొన్ని రోజులు పని చేశాడు. అనివార్య కారణాల వల్ల ఆ సినిమా చిత్రీకరణకు బ్రేక్ పడింది. షూటింగ్ పున:ప్రారంభం కావడానికి కొంచెం టైం పట్టేలా ఉంది.
ఐతే సినిమా మొదలై ఒకట్రెండు షెడ్యూళ్లు అయ్యాక కూడా ఇందులో కథానాయిక ఎవరన్న దానిపై స్పష్టత లేకపోయింది. కానీ ఇప్పుడు ఇందులో పవన్ సరసన ఓ యంగ్ హీరోయిన్ నటిస్తోందని గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు.. ‘ఇస్మార్ట్ శంకర్’తో మంచి క్రేజ్ సంపాదించిన నిధి అగర్వాల్.
ఆమె పవన్-క్రిష్ సినిమాలో కథానాయిక అంటూ సోషల్ మీడియాలో గత కొన్ని గంటల నుంచి గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఈ అప్డేట్తో కూడిన హ్యాష్ ట్యాగ్స్ తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మరో కథానాయిక అంటున్నారు. ఈ ప్రచారంలో నిజమెంతో కానీ.. పవన్ సరసన నిధి అనగానే జనాలకు ఏదోలా అనిపిస్తోంది. పవన్ పక్కన ఆమె మరీ చిన్నదిగా అనిపిస్తుందేమో అన్నది చాలామంది ఫీలింగ్.
ఇప్పటిదాకా నిధి కూడా యంగ్ హీరోల పక్కనే కనిపిస్తోంది. గ్లామర్తోనే ఇప్పటిదాకా పేరు సంపాదించిన నిధికి క్రిష్ సినిమాలో నటించేంత టాలెంట్ ఉందా అన్న సందేహం కూడా కలగక మానదు. అందుకే పవన్-క్రిష్ సినిమాలో నిధి కథానాయిక అనే అప్ డేట్పై చాలామంది నెగెటివ్గానే స్పందిస్తున్నారు. మరి ఈ చిత్రంలో ఆమె నిజంగానే కథానాయికగా కనిపించనుందా.. ఇది కేవలం రూమరా అన్నది చూడాలి.
పవన్ ఈ సినిమా చిత్రీకరణకు అనుకున్న సమయానికి వచ్చే పరిస్థితి లేకపోవడంతో క్రిష్ మధ్యలో వైష్ణవ్ తేజ్ హీరోగా ఓ సినిమాను మొదలుపెట్టి శరవేగంగా పూర్తి చేసే ప్రయత్నంలో ఉన్న సంగతి తెలిసిందే.
This post was last modified on November 21, 2020 9:36 pm
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…