బాలీవుడ్లో నటుడిగానే కాక వ్యక్తిగానూ మంచి ఇమేజ్ ఉన్న హీరో ఆమిర్ ఖాన్. గత కొన్నేళ్లలో కొన్ని అనవసర వివాదాలతో కాస్త చెడ్డ పేరు తెచ్చుకున్నాడు కానీ.. బేసిగ్గా ఆమిర్కు వ్యక్తిగా మంచి పేరే ఉంది. అలాంటి వ్యక్తి మీద తన సోదరుడు సంచలన ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచాడు. ఆమిర్కు ఫైసల్ ఖాన్ అనే సోదరుడున్నాడు. వీళ్లిద్దరికీ చాలా కాలంగా విభేదాలు ఉన్నాయి. ఆస్తి పంపకాల విషయంలో కోర్టులో వీరి మధ్య కేసు కూడా నడుస్తోంది. అతను తన అన్న మీద చేసిన ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి.
తనను ఆమిర్ ఏడాది పాటు గదిలో బంధించినట్లు అతను మీడియాకు వెల్లడించాడు. కొన్నేళ్ల పాటు తాను అన్న వల్ల మనో వేదన అనుభవించినట్లు ఫైసల్ తెలిపాడు. తనకు మానసిక వ్యాధి వచ్చిందని.. తాను పిచ్చివాడినని.. సమాజానికి హాని చేస్తానని ఏవోవో అన్నారని.. కొన్ని విషయాల్లో తాను కుటుంబానికి సహకరించకపోవడంతో తనకు పిచ్చి అని వారు అనుకున్నారని ఫైసల్ తెలిపాడు.
తాను ఉచ్చులో కూరుకుపోయానని.. దాన్నుంచి ఎలా బయటపడాలో అర్థం కాలేదని అతనన్నాడు. ఏడాది పాటు ఆమిర్ తనను ఒక గదిలో బంధించాడని.. తన ఫోన్ కూడా లాగేసుకున్నారని.. బయటికి రానివ్వలేదని అతను తెలిపాడు. తన గది బయట బాడీ గార్డులను పెట్టారని.. తనకు మందులు, తిండి మాత్రమే అందించేవారని గుర్తు చేసుకున్నాడు. తన సోదరుడు, ఇతర వ్యక్తుల నుంచి తన తండ్రి తనను కాపాడతాడని అనుకున్నానని.. కానీ ఆయన్ని ఎలా సంప్రదించాలో తెలియలేదని.. దీంతో ఏం చేయలేక నిస్సహాయంగా ఉండిపోవాల్సి వచ్చిందని ఫైసల్ ఆవేదన వ్యక్తం చేశాడు. మరి ఈ ఆరోపణలపై ఆమిర్ ఎలా స్పందిస్తాడో చూడాలి.
This post was last modified on August 9, 2025 2:42 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…