Movie News

‘కింగ్‌డమ్’ కలెక్షన్ల పోస్టర్.. ఎంత కావాలంటే అంత

మీడియా ఇంటర్వ్యూల్లో, ప్రెస్ మీట్ల‌లో చాలా ఓపెన్‌‌గా మాట్లాడే టాలీవుడ్ నిర్మాతల్లో నాగవంశీ ఒకరు. సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్ మీద సక్సెస్ ఫుల్‌గా సాగిపోతున్న నాగవంశీ.. మీడియా వాళ్ల ప్రశ్నలకు చాలా కొంటెగా సమాధానాలు ఇస్తుంటాడు. ఇండస్ట్రీలో జరిగే విడ్డూరాల మీద కూడా ఆయన సెటైరిగ్గానే స్పందిస్తుంటారు. పెద్ద సినిమాలకు వేసే కలెక్షన్ల పోస్టర్ల గురించి ఇప్పటికే ఒకట్రెండు సందర్భాల్లో కౌంటర్లు వేశారు నాగవంశీ. ఇప్పుడు మరోసారి ఇదే విషయమై పంచ్ వేశారు.

తన ప్రొడక్షన్ నుంచి గురువారం విడుదలవుతున్న ‘కింగ్‌డమ్’ సినిమాకు మంచి బజ్ కనిపిస్తున్న నేపథ్యంలో తొలి రోజు ఎంత వసూళ్లు రాబడుతుందని అడిగితే.. కలెక్షన్ పోస్టర్‌ది ఏముంది, ఎంత కావాలంటే అంత వేసుకుందాం అంటూ ఆయన స్పందించడం అందరినీ నవ్వుల్లో ముంచెత్తింది. హీరో విజయ్ దేవరకొండతో కలిసి ఆయనీ ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. ఈ రోజుల్లో ఒక సినిమాకు మంచి ఓపెనింగ్ తెచ్చుకోవడమే పెద్ద సవాలుగా మారిందని.. ఆ విషయంలో తాము సక్సెస్ అయ్యామని.. సినిమాకు మంచి హైప్ క్రియేట్ అయి, అడ్వాన్స్ బుకింగ్స్ గట్టిగా జరుగుతున్నాయని నాగవంశీ తెలిపాడు.

తొలి రోజు కూడా మంచి టాక్ వస్తుందని, కలెక్షన్లు చాలా బాగుంటాయని ఆశిస్తున్నట్లు చెప్పాడు. ఈ క్రమంలోనే కలెక్షన్ల పోస్టర్‌దేముంది ఎంత కావాలంటే అంత వేసుకుందాం అంటూ ఇండస్ట్రీలో కలెక్షన్లు పెంచి పోస్టర్లు వేయడం అనే కామన్ ప్రాక్టీస్ మీద సెటైర్ వేశాడు నాగవంశీ.

ఇక ఈ సినిమా ట్రైలర్లో కథ ఎక్కువగా రివీల్ చేయకపోవడం గురించి నాగవంశీ మాట్లాడుతూ.. ఆడియన్స్‌లో క్యూరియాసిటీ పెంచడానికి, అంచనాలు మరీ ఎక్కువ కాకుండా ఉండడానికే అలా చేశామని చెప్పాడు. తన అన్నను కాపాడడానికి హీరో ఎంత వరకు వెళ్లాడన్నదే ఈ సినిమా కోర్ పాయింట్ అని నాగవంశీ తెలిపాడు. సినిమా మొదలైన పది నిమిషాల తర్వాత ‘కింగ్‌డమ్’ అనే టైటిల్ వెనుక మర్మం ఏంటో అర్థమవుతుందని.. శ్రీలంక నేపథ్యంలో నడిచే సన్నివేశాలు ఈ చిత్రానికి హైలైట్ అవుతాయని నాగవంశీ చెప్పాడు.

This post was last modified on July 30, 2025 3:55 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

26 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

3 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago