మీడియా ఇంటర్వ్యూల్లో, ప్రెస్ మీట్లలో చాలా ఓపెన్గా మాట్లాడే టాలీవుడ్ నిర్మాతల్లో నాగవంశీ ఒకరు. సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్ మీద సక్సెస్ ఫుల్గా సాగిపోతున్న నాగవంశీ.. మీడియా వాళ్ల ప్రశ్నలకు చాలా కొంటెగా సమాధానాలు ఇస్తుంటాడు. ఇండస్ట్రీలో జరిగే విడ్డూరాల మీద కూడా ఆయన సెటైరిగ్గానే స్పందిస్తుంటారు. పెద్ద సినిమాలకు వేసే కలెక్షన్ల పోస్టర్ల గురించి ఇప్పటికే ఒకట్రెండు సందర్భాల్లో కౌంటర్లు వేశారు నాగవంశీ. ఇప్పుడు మరోసారి ఇదే విషయమై పంచ్ వేశారు.
తన ప్రొడక్షన్ నుంచి గురువారం విడుదలవుతున్న ‘కింగ్డమ్’ సినిమాకు మంచి బజ్ కనిపిస్తున్న నేపథ్యంలో తొలి రోజు ఎంత వసూళ్లు రాబడుతుందని అడిగితే.. కలెక్షన్ పోస్టర్ది ఏముంది, ఎంత కావాలంటే అంత వేసుకుందాం అంటూ ఆయన స్పందించడం అందరినీ నవ్వుల్లో ముంచెత్తింది. హీరో విజయ్ దేవరకొండతో కలిసి ఆయనీ ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. ఈ రోజుల్లో ఒక సినిమాకు మంచి ఓపెనింగ్ తెచ్చుకోవడమే పెద్ద సవాలుగా మారిందని.. ఆ విషయంలో తాము సక్సెస్ అయ్యామని.. సినిమాకు మంచి హైప్ క్రియేట్ అయి, అడ్వాన్స్ బుకింగ్స్ గట్టిగా జరుగుతున్నాయని నాగవంశీ తెలిపాడు.
తొలి రోజు కూడా మంచి టాక్ వస్తుందని, కలెక్షన్లు చాలా బాగుంటాయని ఆశిస్తున్నట్లు చెప్పాడు. ఈ క్రమంలోనే కలెక్షన్ల పోస్టర్దేముంది ఎంత కావాలంటే అంత వేసుకుందాం అంటూ ఇండస్ట్రీలో కలెక్షన్లు పెంచి పోస్టర్లు వేయడం అనే కామన్ ప్రాక్టీస్ మీద సెటైర్ వేశాడు నాగవంశీ.
ఇక ఈ సినిమా ట్రైలర్లో కథ ఎక్కువగా రివీల్ చేయకపోవడం గురించి నాగవంశీ మాట్లాడుతూ.. ఆడియన్స్లో క్యూరియాసిటీ పెంచడానికి, అంచనాలు మరీ ఎక్కువ కాకుండా ఉండడానికే అలా చేశామని చెప్పాడు. తన అన్నను కాపాడడానికి హీరో ఎంత వరకు వెళ్లాడన్నదే ఈ సినిమా కోర్ పాయింట్ అని నాగవంశీ తెలిపాడు. సినిమా మొదలైన పది నిమిషాల తర్వాత ‘కింగ్డమ్’ అనే టైటిల్ వెనుక మర్మం ఏంటో అర్థమవుతుందని.. శ్రీలంక నేపథ్యంలో నడిచే సన్నివేశాలు ఈ చిత్రానికి హైలైట్ అవుతాయని నాగవంశీ చెప్పాడు.
This post was last modified on July 30, 2025 3:55 pm
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…
ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…
ఏప్రిల్ 30 పెద్ది రావడం లేదని లోకం కోడై కూస్తోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినా ఇతర నిర్మాతలు ఆ…