మీడియా ఇంటర్వ్యూల్లో, ప్రెస్ మీట్లలో చాలా ఓపెన్గా మాట్లాడే టాలీవుడ్ నిర్మాతల్లో నాగవంశీ ఒకరు. సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్ మీద సక్సెస్ ఫుల్గా సాగిపోతున్న నాగవంశీ.. మీడియా వాళ్ల ప్రశ్నలకు చాలా కొంటెగా సమాధానాలు ఇస్తుంటాడు. ఇండస్ట్రీలో జరిగే విడ్డూరాల మీద కూడా ఆయన సెటైరిగ్గానే స్పందిస్తుంటారు. పెద్ద సినిమాలకు వేసే కలెక్షన్ల పోస్టర్ల గురించి ఇప్పటికే ఒకట్రెండు సందర్భాల్లో కౌంటర్లు వేశారు నాగవంశీ. ఇప్పుడు మరోసారి ఇదే విషయమై పంచ్ వేశారు.
తన ప్రొడక్షన్ నుంచి గురువారం విడుదలవుతున్న ‘కింగ్డమ్’ సినిమాకు మంచి బజ్ కనిపిస్తున్న నేపథ్యంలో తొలి రోజు ఎంత వసూళ్లు రాబడుతుందని అడిగితే.. కలెక్షన్ పోస్టర్ది ఏముంది, ఎంత కావాలంటే అంత వేసుకుందాం అంటూ ఆయన స్పందించడం అందరినీ నవ్వుల్లో ముంచెత్తింది. హీరో విజయ్ దేవరకొండతో కలిసి ఆయనీ ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. ఈ రోజుల్లో ఒక సినిమాకు మంచి ఓపెనింగ్ తెచ్చుకోవడమే పెద్ద సవాలుగా మారిందని.. ఆ విషయంలో తాము సక్సెస్ అయ్యామని.. సినిమాకు మంచి హైప్ క్రియేట్ అయి, అడ్వాన్స్ బుకింగ్స్ గట్టిగా జరుగుతున్నాయని నాగవంశీ తెలిపాడు.
తొలి రోజు కూడా మంచి టాక్ వస్తుందని, కలెక్షన్లు చాలా బాగుంటాయని ఆశిస్తున్నట్లు చెప్పాడు. ఈ క్రమంలోనే కలెక్షన్ల పోస్టర్దేముంది ఎంత కావాలంటే అంత వేసుకుందాం అంటూ ఇండస్ట్రీలో కలెక్షన్లు పెంచి పోస్టర్లు వేయడం అనే కామన్ ప్రాక్టీస్ మీద సెటైర్ వేశాడు నాగవంశీ.
ఇక ఈ సినిమా ట్రైలర్లో కథ ఎక్కువగా రివీల్ చేయకపోవడం గురించి నాగవంశీ మాట్లాడుతూ.. ఆడియన్స్లో క్యూరియాసిటీ పెంచడానికి, అంచనాలు మరీ ఎక్కువ కాకుండా ఉండడానికే అలా చేశామని చెప్పాడు. తన అన్నను కాపాడడానికి హీరో ఎంత వరకు వెళ్లాడన్నదే ఈ సినిమా కోర్ పాయింట్ అని నాగవంశీ తెలిపాడు. సినిమా మొదలైన పది నిమిషాల తర్వాత ‘కింగ్డమ్’ అనే టైటిల్ వెనుక మర్మం ఏంటో అర్థమవుతుందని.. శ్రీలంక నేపథ్యంలో నడిచే సన్నివేశాలు ఈ చిత్రానికి హైలైట్ అవుతాయని నాగవంశీ చెప్పాడు.
తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువ ఉద్యోగుల మరణ వార్తలు అమెరికా నుంచి వరుసగా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు…
వైసీపీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో ఆదివారం నిర్వహించిన కాపుల సభలో మాజీ మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన బొత్స…
బిచ్చగాడు హీరోగా విజయ్ ఆంటోనీకి ఫ్లాపులతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది. అయితే వరస డిజాస్టర్లు తన…
అగ్రరాజ్యం అమెరికాలో చదువుకునేందుకు వెళ్లేవారు అప్రమత్తం కావాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటి వరకు ఈ దేశంలో చదువుకునేందుకు వెళ్లేవారు.. ఎడ్యుకేషన్…
400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…
ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…