గత సినిమాలు లైగర్, ది ఫ్యామిలీ స్టార్ ఫలితాలతో సంబంధం లేకుండా విజయ్ దేవరకొండ కింగ్డమ్ కు సాలిడ్ ఓపెనింగ్ దక్కనుంది. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ట్రెండింగ్ లోకి వచ్చేసిన ఈ ప్యాన్ ఇండియా మూవీ ఏపీ, తెలంగాణలో చాలా చోట్ల ఉదయం 7 గంటల నుంచే షోలు మొదలుపెట్టబోతున్నారు. మెయిన్ సెంటర్స్ లో ఇప్పటికే హౌస్ ఫుల్స్ కాగా అదనపు స్క్రీన్లు జోడించే పనిలో డిస్ట్రిబ్యూటర్లు బిజీగా ఉన్నారు. ఓవర్సీస్ రిపోర్ట్స్ ఎలా ఉన్నా ఇండియా టాక్ పది గంటలకే వచ్చేస్తుంది కాబట్టి అది కనక పాజిటివ్ ఉంటే మధ్యాహ్నం నుంచే అనూహ్యమైన పికప్ చూడొచ్చని ట్రేడ్ వర్గాల అంచనా
ఇంత బజ్ వచ్చేందుకు కింగ్డమ్ విపరీతంగా ప్రమోషన్లు చేయలేదు. ట్రైలర్ కట్ ద్వారా ఒక ఇంటెన్స్ డ్రామాని చూపిస్తున్నామన్న హామీ ఇవ్వడం, అనిరుధ్ రవిచందర్ పాటలను సరైన పబ్లిసిటీతో జనాలకు చేరువ చేయడం, తిరుపతి హైదరాబాద్ ఈవెంట్ల ద్వారా రెండు రాష్ట్రాల ఫ్యాన్స్ ని సంతృప్తిపరచడం లాంటివి బజ్ పెరిగేందుకు దోహదపడ్డాయి. రెండు మూడు వాయిదాలు పడి కొంత ఆలస్యంగా వస్తున్నా సరే హైప్ విషయంలో కింగ్డమ్ సాలిడ్ గా ఉంటూ వస్తోంది. అన్నిటిని మించి మళ్ళీ రావా, జెర్సీ దర్శకుడిగా గౌతమ్ తిన్ననూరి బ్రాండ్ ఇప్పుడీ కింగ్డమ్ మీద మూవీ లవర్స్ లో ఆసక్తి కలిగేలా చేసింది.
రేపీ సమయానికి కింగ్డమ్ తాలూకు రిపోర్టులు రివ్యూలు హోరెత్తిపోతాయి. హరిహర వీరమల్లు కోలుకునే సూచనలు పెద్దగా లేకపోవడం రౌడీ బాయ్ ఎలా వాడుకుంటాడో చూడాలి. లక్కీగా హాలీవుడ్, బాలీవుడ్ నుంచి చెప్పుకోదగ్గ పోటీ లేకపోవడం చాలా పెద్ద సానుకూలాంశం. పైగా ఆగస్ట్ 14 వరకు బాక్సాఫీస్ కు గ్యాప్ వస్తుంది. అప్పటిదాకా థియేటర్స్ ఫీడింగ్ కి కింగ్డమ్ ఒకటే శరణ్యం. సో పాజిటివ్ టాక్ కనక తెచ్చుకుంటే ఏకధాటిగా రెండు వారాలు వసూళ్లు రాబట్టొచ్చు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించిన కింగ్డమ్ లో సత్యదేవ్ హీరో అన్నయ్యగా ముఖ్య పాత్ర పోషించగా స్టోరీ బ్యాక్ డ్రాప్ శ్రీలంకలో జరుగుతుంది.
This post was last modified on July 30, 2025 10:41 am
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష(ప్రధాన కాదు) నాయకుడు, వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అన్యాయంగా…