ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ మంచి ఊపు మీదున్నారు. హరిహర వీరమల్లు థియేటర్ రన్ ఇంకా కొనసాగుతుండగానే ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్స్ మొదలుపెట్టేశారు. తాజాగా జరిగిన షెడ్యూల్ లో క్లైమాక్స్ పూర్తయినట్టు మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. కొంచెం వర్క్ మినహాయించి పవన్ వర్క్ దాదాపు అయిపోయినట్టే. పాటల అప్డేట్ ఇంకా తెలియాల్సి ఉంది. నిజానికి ఇంత స్పీడ్ ఫ్యాన్స్ ఊహించలేదు. ఎలాగూ సెప్టెంబర్ లో ఓజి ఉంది కాబట్టి ఉస్తాద్ ఇంకొంచెం ఆలస్యమైనా పరవాలేదని అనుకున్నారు. తీరా చూస్తే దర్శకుడు హరీష్ శంకర్ జెట్ స్పీడ్ తో పరుగులు పెట్టించి తుది ఘట్టానికి చేర్చేశాడు.
తేరి రీమేక్ గా మొదలైన ఈ యాక్షన్ మూవీ తర్వాత స్ట్రెయిట్ సబ్జెక్టుగా మారిందనే ప్రచారం జరిగింది కానీ అదెంత వరకు నిజమో సినిమా చూస్తే కానీ క్లారిటీ రాదు. ఇన్ సైడ్ టాక్ అయితే మెయిన్ పాయింట్ మాత్రమే తీసుకుని గుర్తుపట్టలేని మార్పులు చాలా చేశారని, పూర్తిగా ఫ్రెష్ ట్రీట్ మెంట్ తో ఫ్యాన్స్ ఊహించని స్థాయిలో మాస్ మీల్స్ ఉంటాయని టీమ్ సభ్యులు ఊరిస్తున్నారు. శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా, పార్తీబన్ విలన్ గా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ కు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ప్రధాన ఆకర్షణ కానుంది. ఇదే కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ ని మించిన టెర్రిఫిక్ ఆల్బమ్ ని మూవీ లవర్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.
ఇదంతా చూస్తుంటే నవంబర్ కల్లా ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ కాపీ రెడీ అయిపోయినా ఆశ్చర్యం లేదు. కాకపోతే విడుదల తేదీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఓజి సెప్టెంబర్ లో వచ్చేది ఖాయమే అయితే రెండు నెలల్లో రెండు పవన్ కళ్యాణ్ సినిమాలు వచ్చిన అరుదైన రికార్డు ఉంటుంది. అప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చి 2026 వేసవిలో ఉస్తాద్ ని దింపితే బాగుంటుంది. రాజకీయాల దృష్ట్యా పవన్ ఇకపై సినిమాలు చేయడం అనుమానంగా ఉంది కాబట్టి దానికి అనుగుణంగా రిలీజ్ ప్లాన్స్ ఉండాలి. అన్నట్టు ఉస్తాద్ భగత్ సింగ్ లో మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ మంచి పవర్ ఫుల్ ఫైట్స్ ఉన్నాయట. ఫ్యాన్స్ కోరుకునేది అవేగా.
This post was last modified on July 29, 2025 12:59 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…