ఎల్లుండి విడుదల కాబోతున్న కింగ్డమ్ కు ముందు రోజు అంటే రేపు రాత్రి స్పెషల్ ప్రీమియర్లు వేసే ప్లాన్ లో నిర్మాతలున్నట్టు ఒక వార్త బాగానే తిరిగింది. కానీ తర్వాత ఆ నిర్ణయం మార్చుకున్నారు. ఏపీలో టికెట్ రేట్ల పెంపుకి సంబంధించి అనుమతులు జూలై 31 నుంచే ఇచ్చినందు వల్ల పాత ధరలతో స్పెషల్ షోలు వేస్తే ఇబ్బందవుతుంది. అందుకే ఈ ఆలోచన మానుకున్నారనేది ఓపెన్ సీక్రెట్. అయితే ప్రాక్టికల్ కోణంలో ఆలోచిస్తే బుధవారం ప్రీమియర్లు ఎలా చూసుకున్నా రిస్క్ తో ముడిపడి ఉంటాయి. కంటెంట్ కాసేపు పక్కన పెడితే ఇటీవలే హరిహర వీరమల్లుకి అర్ధరాత్రి ఇవి చేసిన డ్యామేజ్ అంతా ఇంతా కాదు.
వీకెండ్ కాని వర్కింగ్ డే రోజు నైట్ ప్రీమియర్లు వేయడం చిన్న హీరోలకు వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే విడుదల రోజు ఉదయం ఆటకే జనాలు పరిగెత్తుకు రారు కాబట్టి సోషల్ మీడియా టాక్ కోసం అలా చేయడం సహజం. గతంలో తేజ సజ్జ, సుహాస్ లాంటి హీరోలు ఈ స్ట్రాటజీ వల్ల లాభపడ్డారు. కానీ విజయ్ దేవరకొండ వాళ్ళ సరసన రాడు. ఫ్లాపుల సంగతి సరికాని తనకు ఇప్పటికీ టయర్ 2 క్యాటగిరీలో మంచి డిమాండ్ ఉంది. అందుకే వరసగా సితార, మైత్రి, దిల్ రాజు బ్యానర్లలో ప్యాన్ ఇండియా మూవీస్ చేస్తున్నాడు. కింగ్డమ్ తన కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందింది కాబట్టి అస్సలు రిస్క్ తీసుకోకూడదు.
ఎలాగూ గురువారం రిలీజ్ కనక నాలుగు రోజుల వీకెండ్ దొరుకుతుంది. హరిహర వీరమల్లు స్లో అయిపోయాడు. ఫలితం స్పష్టంగా కనిపిస్తోంది. మహావతార్ నరసింహ రెండో వారం జోరు చూపించినా మాస్ ఆడియన్స్ మొగ్గు కింగ్డమ్ వైపే ఉంటుంది. అందులోనూ రెండు ఈవెంట్లు, ట్రైలర్, కదిలే సాంగ్ దెబ్బకు హైప్ అమాంతం పెరిగింది. అంచనాలు నిలబెట్టుకోవడమే బాలన్స్. ముందు రోజు షోలు వేసి టాక్ దెబ్బ తీసుకునే అవకాశం ఇవ్వకుండా ప్రాపర్ రిలీజ్ డేట్ నాడు ఉదయం ఏడు గంటలనుంచి షోలు వేయడం మంచి స్ట్రాటజీ. మేకర్స్ చాలా తెలివిగా అలోచించి నిర్ణయం తీసుకున్నారు.
This post was last modified on July 29, 2025 11:31 am
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…