ఎల్లుండి విడుదల కాబోతున్న కింగ్డమ్ కు ముందు రోజు అంటే రేపు రాత్రి స్పెషల్ ప్రీమియర్లు వేసే ప్లాన్ లో నిర్మాతలున్నట్టు ఒక వార్త బాగానే తిరిగింది. కానీ తర్వాత ఆ నిర్ణయం మార్చుకున్నారు. ఏపీలో టికెట్ రేట్ల పెంపుకి సంబంధించి అనుమతులు జూలై 31 నుంచే ఇచ్చినందు వల్ల పాత ధరలతో స్పెషల్ షోలు వేస్తే ఇబ్బందవుతుంది. అందుకే ఈ ఆలోచన మానుకున్నారనేది ఓపెన్ సీక్రెట్. అయితే ప్రాక్టికల్ కోణంలో ఆలోచిస్తే బుధవారం ప్రీమియర్లు ఎలా చూసుకున్నా రిస్క్ తో ముడిపడి ఉంటాయి. కంటెంట్ కాసేపు పక్కన పెడితే ఇటీవలే హరిహర వీరమల్లుకి అర్ధరాత్రి ఇవి చేసిన డ్యామేజ్ అంతా ఇంతా కాదు.
వీకెండ్ కాని వర్కింగ్ డే రోజు నైట్ ప్రీమియర్లు వేయడం చిన్న హీరోలకు వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే విడుదల రోజు ఉదయం ఆటకే జనాలు పరిగెత్తుకు రారు కాబట్టి సోషల్ మీడియా టాక్ కోసం అలా చేయడం సహజం. గతంలో తేజ సజ్జ, సుహాస్ లాంటి హీరోలు ఈ స్ట్రాటజీ వల్ల లాభపడ్డారు. కానీ విజయ్ దేవరకొండ వాళ్ళ సరసన రాడు. ఫ్లాపుల సంగతి సరికాని తనకు ఇప్పటికీ టయర్ 2 క్యాటగిరీలో మంచి డిమాండ్ ఉంది. అందుకే వరసగా సితార, మైత్రి, దిల్ రాజు బ్యానర్లలో ప్యాన్ ఇండియా మూవీస్ చేస్తున్నాడు. కింగ్డమ్ తన కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందింది కాబట్టి అస్సలు రిస్క్ తీసుకోకూడదు.
ఎలాగూ గురువారం రిలీజ్ కనక నాలుగు రోజుల వీకెండ్ దొరుకుతుంది. హరిహర వీరమల్లు స్లో అయిపోయాడు. ఫలితం స్పష్టంగా కనిపిస్తోంది. మహావతార్ నరసింహ రెండో వారం జోరు చూపించినా మాస్ ఆడియన్స్ మొగ్గు కింగ్డమ్ వైపే ఉంటుంది. అందులోనూ రెండు ఈవెంట్లు, ట్రైలర్, కదిలే సాంగ్ దెబ్బకు హైప్ అమాంతం పెరిగింది. అంచనాలు నిలబెట్టుకోవడమే బాలన్స్. ముందు రోజు షోలు వేసి టాక్ దెబ్బ తీసుకునే అవకాశం ఇవ్వకుండా ప్రాపర్ రిలీజ్ డేట్ నాడు ఉదయం ఏడు గంటలనుంచి షోలు వేయడం మంచి స్ట్రాటజీ. మేకర్స్ చాలా తెలివిగా అలోచించి నిర్ణయం తీసుకున్నారు.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…