కొన్ని నిర్ణయాలు లైఫ్ లోనే కాదు సినిమాలకు సంబంధించి కూడా టైంకి తీసుకోవాలి. లేదంటే ఆశించిన ఫలితాలు దక్కవు. రామ్ చరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన రంగస్థలం ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేని కల్ట్ మూవీ. వచ్చి ఇన్ని సంవత్సరాలవుతున్నా సుకుమార్ తాలూకు మేజిక్ ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఆ మాటకొస్తే పుష్ప కన్నా బెస్ట్ వర్క్ ఇందులోనే ఉంటుందని చెప్పేవాళ్ళు ఎక్కువగా ఉన్నారంటే అది అబద్దం కాదు. అన్ని బాషల ఆడియన్స్ ని ఆకట్టుకునే కంటెంట్ ఉన్న రంగస్థలం హిందీ వెర్షన్ థియేట్రికల్ గా రిలీజ్ కాకపోవడం అభిమానులు ఇప్పటికీ వెలితిగా ఫీలవుతూ ఉంటారు.
నిజానికి రంగస్థలంలో నార్త్ ఆడియన్స్ ని ఆకట్టుకునే కంటెంట్ పుష్కలంగా ఉంది. కానీ నిర్మాతలు ఆ దిశగా ఎప్పుడూ ఆలోచన చేయకపోవడం విచిత్రం. పోనీ ఆర్ఆర్ఆర్ వచ్చాక రామ్ చరణ్ కు పెరిగిన క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ విడుదల చేయమని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కోరుకున్నా సరే నెరవేరలేదు. త్వరలో గోల్డ్ మైన్స్ శాటిలైట్ ఛానల్ లో హిందీ రంగస్థలం ప్రీమియర్ జరుపుకోనుంది. ఆగస్ట్ 24 ఆదివారం రాత్రి 8 గంటలకు ప్రసారం చేయబోతున్నారు. విశేషం ఏంటంటే దీనికి నెలరోజుల ముందు నుంచే సదరు ఛానల్ ప్రమోషన్లు, ప్రోమోలు మొదలుపెట్టేయడం.
టిఆర్పి వర్గాల అంచనాల ప్రకారం రంగస్థలం హిందీ ప్రీమియర్ కు భారీ రేటింగ్స్ రావోచ్చట. గేమ్ ఛేంజర్ డిజాస్టర్ అయినప్పటికీ ఆర్ఆర్ఆర్ లో వచ్చిన రామరాజు ఇమేజ్ చరణ్ సినిమాకు పెద్ద ఎత్తున స్పందన తీసుకొస్తుందని గోల్డ్ మైన్స్ యాజమాన్యం భావిస్తోందట. ఒరిజినల్ తెలుగు వర్షన్ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉన్నప్పటికీ హిందీ డబ్బింగ్ తో చూస్తే బాలీవుడ్ జనాలకు బాగా కనెక్ట్ అవుతుంది. అందుకే ఈ ఛాన్స్ వాడుకోవడానికి చూస్తున్నారు. అన్నట్టు ఆర్సి 17కి దర్శకుడు సుకుమారేనన్న సంగతి తెలిసిందే. ఈసారి రంగస్థలంను రెట్టింపు సినిమా ఆశిస్తున్నారు ఫ్యాన్స్.
This post was last modified on July 28, 2025 2:56 pm
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…