లక్ష్మి.. థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి ఓటీటీల్లో రిలీజైన ఇండియన్ సినిమాల్లో బిగ్గెస్ట్ అనదగ్గ చిత్రమిది. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన సినిమా అంటే ఇక దాని స్థాయేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంత భారీ చిత్రం ఓటీటీలో రిలీజవుతుందంటే ముందు చాలామంది నమ్మలేదు. కానీ ఆ తర్వాత ఆ సంగతే నిజమైంది. హాట్ స్టార్ సంస్థ భారీ మొత్తానికి హక్కులు కొని.. పెద్ద ఎత్తున సినిమాను ప్రమోట్ చేసి.. భారీ అంచనాల మధ్య దీపావళి కానుకగా ‘లక్ష్మి’ని స్ట్రీమ్ చేసింది.
ముందు ఉన్న అంచనాల వల్ల ఈ చిత్రానికి తొలి రోజు రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. ‘దిల్ బేచారా’ నెలకొల్పిన అత్యధిక డే-1 వ్యూస్ రికార్డును కొన్ని గంటల్లోనే ‘లక్ష్మి’ బద్దలు కొట్టేసింది. కానీ ఈ ఊపు తొలి రోజుకే పరిమితమైంది. ఇదొక చెత్త సినిమా అని ఇటు విమర్శకులు, అటు ప్రేక్షకులు ఏకాభిప్రాయం వ్యక్తం చేయడం.. చాలా దారుణమైన ఫీడ్ బ్యాక్ రావడంతో సినిమా తుస్సుమంది.
రెండో రోజు నుంచే ‘లక్ష్మి’ వార్తల్లో లేకుండా పోయింది. సినిమా చూసిన వాళ్లకు తలనొప్పి తప్పదన్న ప్రచారం గట్టిగా జరగడంతో జనాలు జడిసిపోయారు. సినిమాను మొదలుపెట్టినా పూర్తి చేయడం చాలా కష్టమైపోయింది. ఎటు చూసినా నెగెటివ్ వార్తలతో ‘లక్ష్మి’ డిజిటల్ మీడియంలో అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. తెలుగులో నిశ్శబ్దం లాంటి సినిమాల్ని టాక్తో సంబంధం లేకుండా చూసినట్లు ‘లక్ష్మి’ని చూడలేదని ట్రెండ్స్ను బట్టి స్పష్టంగా తెలుస్తోంది.
రెండు రోజుల తర్వాత ఈ సినిమాను అటు చిత్ర బృందం, ఇటు హాట్ స్టార్ వాళ్లు ప్రమోట్ చేయడం కూడా మానేశారు. ఈ సినిమా గురించి ట్వీట్లు వేసినా జనాలు బూతులు తిడుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ చేస్తే ఓపెనింగ్స్ వచ్చేవేమో కానీ.. తర్వాత నిలవడం కష్టమయ్యేది. బయ్యర్లకు నష్టాలు తప్పేవి కావు. ఈ రకంగా చూస్తే ఓటీటీ రిలీజ్ ద్వారా ‘లక్ష్మి’ మేకర్స్ సేఫ్ అయిపోయినట్లే.
This post was last modified on November 18, 2020 7:12 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…