స్పిరిట్.. మోస్ట్ అవైటెడ్ అప్‌డేట్

ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్‌గా అవ‌త‌రించినా.. చేస్తున్న‌వ‌న్నీ భారీ చిత్రాలే అయినా.. మంచి స్పీడుతో సినిమాలు లాగిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్. గ‌త ఏడాది క‌ల్కి చిత్రంతో ప‌ల‌క‌రించిన ప్ర‌భాస్.. ఈ ఏడాది చివ‌ర్లో రాజా సాబ్‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. ప్ర‌స్తుతం అత‌ను హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో ఫౌజీ చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఐతే ఈ చిత్రాల‌న్నింటికంటే ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఎక్కువ ఆస‌క్తి ప్ర‌ద‌ర్శిస్తున్న‌ది స్పిరిట్ మీదే అన‌డంలో సందేహం లేదు. అర్జున్ రెడ్డి, క‌బీర్ సింగ్, యానిమ‌ల్.. ఇలా తీసిన మూడు చిత్రాల‌తోనూ ప్ర‌కంప‌న‌లు రేపిన సందీప్ రెడ్డి వంగ‌.. ప్ర‌భాస్‌తో ఎలాంటి సినిమా తీస్తాడు.. వీరి కాంబినేష‌న్ ఎలా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుంది అని క్యూరియాసిటీతో చూస్తున్నారు ఫ్యాన్స్.

అయితే సినిమా అనౌన్స్ అయి రెండేళ్లు దాటినా.. ఇంకా సెట్స్ మీదికి మాత్రం వెళ్ల‌లేదు. షూటింగ్ ఇదిగో అదిగో అంటున్నారు కానీ.. ఎంత‌కీ సినిమా మొద‌లు కావ‌డం లేదు.
ఇలాంటి టైంలో స్వ‌యంగా సందీప్ రెడ్డి స్పిరిట్ షూట్ గురించి అప్‌డేట్ ఇచ్చాడు. విజ‌య్ దేవ‌ర‌కొండ కొత్త చిత్రం కింగ్‌డ‌మ్ ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా ఆ సినిమా హీరో, ద‌ర్శ‌కుడితో క‌లిసి ఒక ప్ర‌మోష‌న‌ల్ వీడియోలో పాల్గొన్నాడు సందీప్. చిట్ చాట్ లాగా సాగిన ఈ వీడియోలో విజ‌య్.. స్పిరిట్ గురించి అడిగాడు.

ఆ సినిమా గురించి అడ‌క్క‌పోతే సోష‌ల్ మీడియాలో త‌న‌ను తిట్టిపోస్తార‌ని విజ‌య్ పేర్కొన‌గా.. ఏం ప‌ర్లేదు దాని గురించి ప్ర‌శ్న అడ‌గొచ్చ‌ని, అది అడ‌గాల్సిన విష‌య‌మే అని సందీప్ పేర్కొన్నాడు. ఇంత‌కీ ఆ సినిమా షూటింగ్ ఎప్పుడు మొద‌లుపెడుతున్నారు అని అడిగితే.. సెప్టెంబ‌రు చివ‌రి వారం నుంచి చిత్రీక‌ర‌ణ ఉంటుంద‌ని స‌మాధాన‌మిచ్చాడు సందీప్. ఇక అప్ప‌ట్నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ఉంటుందా అని అడిగితే.. నాన్ స్టాప్‌గా కుమ్మేయ‌డ‌మే అంటూ న‌వ్వుతూ బ‌దులిచ్చాడు సందీప్. సెప్టెంబ‌రులో షూటింగ్ మొద‌లుపెట్టి నాన్ స్టాప్‌గా చిత్రీక‌ర‌ణ జ‌రిపారంటే.. ఇంకో ఏడాదిలో సినిమా రిలీజైపోవ‌చ్చు. అంటే 2026 చివ‌ర్లో స్పిరిట్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చే అవ‌కాశాలున్నాయ‌న్న‌మాట‌.