పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత మూడు నెలల నుంచి గ్యాప్ లేకుండా షూటింగ్స్లో పాల్గొంటున్నారు. తన పెండింగ్ ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నారు. ముందుగా ‘హరిహర వీరమల్లు’ను పూర్తి చేశారు. ఆ చిత్రం ఈ రోజు రిలీజైపోయింది కూడా. ‘ఓజీ’ షూట్ను కూడా పవన్ అవగొట్టేశాడు. పవన్తో సంబంధం లేని సన్నివేశాలను కూడా పూర్తి చేసి ఇటీవలే గుమ్మడికాయ కొట్టేసింది చిత్ర బృందం.
‘ఓజీ’ పని పూర్తి చేశాక ఆలస్యం చేయకుండా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెట్లోకి కూడా అడుగు పెట్టేశాడు పవన్. ఐతే పవన్ పెండింగ్ పెట్టిన ప్రాజెక్టుల్లో తక్కువ చిత్రీకరణ జరుపుకున్నది ఈ చిత్రమే కాబట్టి.. ఇది పూర్తి కావడానికి చాలా టైం పడుతుందేమో అనుకున్నారంతా. కానీ ఈ సినిమా షూట్, రిలీజ్ గురించి పవన్ ఇచ్చిన అప్డేట్ చూసి ఇప్పుడందరూ షాకైపోతున్నారు.
‘ఉస్తాద్ భగత్ సింగ్’కు సంబంధించి తన పని ఇంకో ఐదారు రోజులు మాత్రమే మిగిలి ఉందని పవన్ చెప్పడం విశేషం. అంతే కాక ఈ చిత్రం డిసెంబరు లేదా జనవరిలో రిలీజవుతుందని కూడా ఆయన ప్రకటించారు. పవన్ ‘ఉస్తాద్’ సెట్లోకి అడుగు పెట్టింది గత నెలలోనే. ఐతే గ్యాప్ తీసుకోకుండా వరుసగా కాల్ షీట్స్ ఇవ్వడంతో దర్శకుడు హరీష్ శంకర్ చకచకా ఆయన మీద సీన్లు లాగించేస్తున్నట్లున్నాడు.
హరీష్ మామూలుగానే స్పీడ్ అన్న సంగతి తెలిసిందే. పైగా పవన్కు ఉన్న బిజీ షెడ్యూల్ దృష్ట్యా ఆయన దొరికినపుడు ఇంకా వేగం చూపించాలి. ఎప్పుడో స్క్రిప్టు రెడీ చేసి పెట్టుకోవడం, పక్కాగా షెడ్యూళ్లు ప్లాన్ చేయడంతో షూటింగ్ శరవేగంగా జరిగిపోతున్నట్లుంది. పవన్ మీద సన్నివేశాలు అవగొట్టేశారంటే.. సినిమాను పూర్తి చేయడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు. ‘హరిహర వీరమల్లు’ వచ్చిన రెండు నెలలకే ‘ఓజీ’ రానుండగా.. ఆ తర్వాత మూణ్నాలుగు నెలలకే ‘ఉస్తాద్’ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుందన్నమాట.
This post was last modified on July 24, 2025 5:02 pm
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…
ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…