ఫిలిం సెలబ్రెటీల విడాకులు ఈ మధ్య మామూలు వార్తలైపోయాయి. పెళ్లయిన కొన్నేళ్లకే సెలబ్రెటీ జంటలు విడిపోతున్న విషయం తెలిసి ఫ్యాన్స్ ఫీలవుతున్నారు కానీ.. తర్వాత ఇది మామూలే కదా అని సర్దుకుపోతున్నారు. గత కొన్నేళ్లలో వివిధ ఇండస్ట్రీలకు చెందిన పదుల సంఖ్యలో జంటలు విడిపోయాయి. ఇప్పుడు ఒకప్పటి స్టార్ హీరోయిన్ హన్సిక విడాకుల గురించి వార్తలు మొదలయ్యాయి. ఆమె సోహైల్ కటూరియా అనే తన స్నేహితుడిని పెళ్లి చేసుకుని మూడేళ్లు కూడా కాలేదు. చాలా గ్రాండ్గా పెళ్లి చేసుకోవడమే కాదు.. ఆ తతంగాన్నంతా డాక్యుమెంటరీగా చిత్రీకరించి ఒక ఓటీటీ సంస్థకు ఇచ్చింది ఈ జంట.
ఐతే రెండేళ్లకే వీళ్లిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని.. కొన్ని నెలలుగా హన్సిక భర్తకు దూరంగా.. తల్లితో కలిసి విడిగా ఉంటోందని మీడియాలో ప్రచారం జరుగుతోంది. సోహైల్ది ఉమ్మడి కుటుంబం అని.. అక్కడ హన్సిక ఇమడలేకపోయిందని.. అందుకే భర్తకు దూరంగా తల్లితో కలిసి ఉంటోందని వార్తలు వస్తున్నాయి. హన్సిక, సోహైల్ విడాకులు కూడా తీసుకోబోతున్నారని రూమర్లు వినిపిస్తున్నాయి. ఐతే మీడియా వాళ్లు ఈ విషయమై హన్సికను వివరణ కోరే ప్రయత్నం చేయగా.. ఆమె అందుబాటులోకి రాలేదు. కానీ సోహైల్ మాత్రం ఈ ప్రచారాన్ని ఖండించాడు. తమ మధ్య అంతా బాగుందని తెలిపాడు. కానీ హన్సిక ఈ విషయాన్ని ధ్రువీకరించకపోవడంతో విడాకుల వార్తలు నిజమే అనుకుంటున్నారు జనం.
హన్సిక పెళ్లి విషయంలో ఒక ట్విస్ట్ ఉంది. ఆమె పెళ్లాడింది తన ఫ్రెండ్ భర్తను కావడం గమనార్హం. సోహైల్ మొదటి భార్య.. హన్సికకు క్లోజ్ ఫ్రెండ్. సోహైల్ ఏమో హన్సిక సోదరుడికి స్నేహితుడు. మరి తన తొలి వివాహంలో ఏం సమస్యలు వచ్చాయో ఏమో.. భార్య నుంచి విడిపోయి హన్సికతో ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. కానీ మూడేళ్లు తిరక్కుండానే వీళ్లిద్దరూ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రచారం మొదలైంది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలి.
This post was last modified on July 22, 2025 3:33 pm
భూమా ఫ్యామిలీకి రాజకీయాల్లో మంచి గుర్తింపే ఉంది. అయితే దివంగత భూమా నాగిరెడ్డి మరణానికి ముందే… ఆయన సతీమణి భూమా…
కాపు సామాజిక వర్గాన్ని తటస్థం చేయాలన్న దిశగా వైసీపీ అడుగులు వేగంగా పడుతున్నాయా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. ప్రస్తుతం…
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తమకు అనుకూలంగా ఉన్నవారు ఏం చేసినా ప్రభుత్వాలు పట్టించుకోవు అనే ఆరోపణలు తరచూ వస్తూ ఉంటాయి.…
దేవర బ్లాక్ బస్టర్ తర్వాత వార్ 2 విపరీతంగా నిరాశ పరచడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆశలన్నీ ప్యాన్ ఇండియా…
తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధిపతి విజయ్ రాజకీయ విమర్శలకు కేంద్రంగా మారారు. ఆయనను కార్నర్ చేస్తూ.. బీజేపీసహా ఇతర పార్టీలు…
ఇంకో రెండు రోజుల్లో దృశ్యం 3 విడుదల కానుంది. ఒరిజినల్ వెర్షన్ తో పాటు తెలుగు డబ్బింగ్ రిలీజ్ కానుండటంతో…