ఫిలిం సెలబ్రెటీల విడాకులు ఈ మధ్య మామూలు వార్తలైపోయాయి. పెళ్లయిన కొన్నేళ్లకే సెలబ్రెటీ జంటలు విడిపోతున్న విషయం తెలిసి ఫ్యాన్స్ ఫీలవుతున్నారు కానీ.. తర్వాత ఇది మామూలే కదా అని సర్దుకుపోతున్నారు. గత కొన్నేళ్లలో వివిధ ఇండస్ట్రీలకు చెందిన పదుల సంఖ్యలో జంటలు విడిపోయాయి. ఇప్పుడు ఒకప్పటి స్టార్ హీరోయిన్ హన్సిక విడాకుల గురించి వార్తలు మొదలయ్యాయి. ఆమె సోహైల్ కటూరియా అనే తన స్నేహితుడిని పెళ్లి చేసుకుని మూడేళ్లు కూడా కాలేదు. చాలా గ్రాండ్గా పెళ్లి చేసుకోవడమే కాదు.. ఆ తతంగాన్నంతా డాక్యుమెంటరీగా చిత్రీకరించి ఒక ఓటీటీ సంస్థకు ఇచ్చింది ఈ జంట.
ఐతే రెండేళ్లకే వీళ్లిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని.. కొన్ని నెలలుగా హన్సిక భర్తకు దూరంగా.. తల్లితో కలిసి విడిగా ఉంటోందని మీడియాలో ప్రచారం జరుగుతోంది. సోహైల్ది ఉమ్మడి కుటుంబం అని.. అక్కడ హన్సిక ఇమడలేకపోయిందని.. అందుకే భర్తకు దూరంగా తల్లితో కలిసి ఉంటోందని వార్తలు వస్తున్నాయి. హన్సిక, సోహైల్ విడాకులు కూడా తీసుకోబోతున్నారని రూమర్లు వినిపిస్తున్నాయి. ఐతే మీడియా వాళ్లు ఈ విషయమై హన్సికను వివరణ కోరే ప్రయత్నం చేయగా.. ఆమె అందుబాటులోకి రాలేదు. కానీ సోహైల్ మాత్రం ఈ ప్రచారాన్ని ఖండించాడు. తమ మధ్య అంతా బాగుందని తెలిపాడు. కానీ హన్సిక ఈ విషయాన్ని ధ్రువీకరించకపోవడంతో విడాకుల వార్తలు నిజమే అనుకుంటున్నారు జనం.
హన్సిక పెళ్లి విషయంలో ఒక ట్విస్ట్ ఉంది. ఆమె పెళ్లాడింది తన ఫ్రెండ్ భర్తను కావడం గమనార్హం. సోహైల్ మొదటి భార్య.. హన్సికకు క్లోజ్ ఫ్రెండ్. సోహైల్ ఏమో హన్సిక సోదరుడికి స్నేహితుడు. మరి తన తొలి వివాహంలో ఏం సమస్యలు వచ్చాయో ఏమో.. భార్య నుంచి విడిపోయి హన్సికతో ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. కానీ మూడేళ్లు తిరక్కుండానే వీళ్లిద్దరూ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రచారం మొదలైంది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలి.
This post was last modified on July 22, 2025 3:33 pm
కొన్ని రోజులుగా ఉన్న అనుమానాలు ఈ రోజు మరింత బలపడిపోయాయి. ప్రభాస్ కొత్త సినిమా ‘ఫౌజి’ మరోసారి వాయిదా పడబోతోందని…
అమరావతి సౌండ్ లడఖ్ వరకు వినిపిస్తోందా..? ఇక్కడి విపక్షానికి మాత్రం అది వినిపించడం లేదా..? అమరావతి రాజధాని అంశానికి సంబంధించిన…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎంత చెబుతున్నా.. కొందరు నాయకులు తమ పంథాను మార్చుకోవడం లేదు.…
దేశ రాజధాని ఢిల్లీ.. ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు పోలీసుల పహారాలో ఉండనుంది. దాదాపు నగరం…
వైసీపీకి డేంజర్ బెల్స్ మోగుతున్నాయా.. ఉత్తరాంధ్రలో తాజాగా చోటు చేసుకున్న చిన్న శ్రీను వ్యవహారంతో పాటు.. పార్టీలో మరింత మంది…
జాంబీ సినిమాలో వైరస్ లాగా ఏఐ వాడకం క్రమంగా టెకీస్ నుంచి సామాన్యుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. ఒకరేమో వారణాసిలో మహేష్…