Movie News

నలుగురు బన్నీలు ఒకేసారి కనిపిస్తే ?

మాములుగా హీరోలు డ్యూయల్ రోల్ చేస్తేనే ప్రేక్షకులు ప్రత్యేకమైన థ్రిల్ అనిపిస్తుంది. అలాంటిది ట్రిపుల్ రోల్ అంటే ఏ స్థాయిలో కిక్ ఇస్తుందో చెప్పనక్కర్లేదు. ఇప్పటి జనరేషన్ లో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరూ జై లవకుశ, అమిగోస్ ద్వారా చేసి చూపించారు. ఈ లిస్టులో అల్లు అర్జున్ చేరబోతున్నాడనేది కొత్త న్యూస్ కాకపోయినా ఇప్పుడో ట్విస్టు వచ్చి చేరింది. ముంబై వర్గాల టాక్ ప్రకారం బన్నీ రెండు మూడు కాదు ఏకంగా నాలుగు పాత్రల్లో కనిపించబోతున్నాడట. ఇది నిజంగా అభిమానులకు షాక్ ఇచ్చే రిపోర్ట్. అయితే దీని వెనుక పెద్ద కసరత్తు జరిగింది. అదేంటో చూద్దాం.

అట్లీ దర్శకత్వం వహించే ఈ మూవీలో హీరో ఫ్యామిలీకి సంబంధించి మొత్తం నాలుగు క్యారెక్టర్లు ఉంటాయి. ఒకటి తాత, మరొకటి తండ్రి, ఇంకో ఇద్దరు కొడుకులు. అందరికీ సమాన ప్రాధాన్యం ఉంటుంది. ముందు వేరే ఆర్టిస్టులను అనుకున్నప్పటికీ ఒకసారి ట్రై చేద్దామని బన్నీ మీద అన్నీ గెటప్స్ తో లుక్ టెస్ట్ చేశారట. అవి బ్రహ్మాండంగా ఉన్నాయని యూనిట్ సభ్యులు అభిప్రాయపడటంతో అట్లీ, అల్లు అర్జున్ ఇద్దరూ ఓకే అనుకున్నారని వినికిడి. అదే జరిగితే అప్పుడెప్పుడో స్వర్గీయ ఎన్టీఆర్ తర్వాత ఇన్ని పాత్రలు ఒకే సినిమాలో చేసిన ఘనత బన్నీకే దక్కుతుంది. ఇదంతా అధికారికంగా ధృవీకరణ కాలేదు.

పుష్ప 2 ది రూల్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని నిలబెట్టుకునే కసితో ఉన్న అల్లు అర్జున్ ఎలాంటి రిస్కుకైనా సై అంటున్నాడు. ముఖ్యంగా ఈ సినిమాతో ఇంటర్నేషనల్ మార్కెట్ ని కూడా టార్గెట్ చేస్తున్నారు. హీరోయిన్లుగా దీపికా పదుకునే, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ ఖరారు కాగా భాగ్యశ్రీ బోర్సే, రష్మిక మందన్నలు దాదాపు కన్ఫర్మ్ అయినట్టేనని అంటున్నారు. ఇంత గ్లామర్ కోటింగ్ ఉన్న స్టార్ సినిమా గత కొన్నేళ్లలో రాలేదనే చెప్పాలి. శ్రీలీల కూడా ఉంటే ఒక పనైపోయేది కానీ ఆ స్కోప్ లేదు కాబోలు. 2027 విడుదలను టార్గెట్ గా పెట్టుకున్న అట్లీ వచ్చే ఏడాది ద్వితీయార్థంలోగా షూటింగ్ ఫినిష్ చేయాలని ప్లాన్ చేసుకున్నాడు.

This post was last modified on July 12, 2025 3:51 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

భోజనంలో పురుగులు… వందేభారత్ రామానుజం ఏం చేశాడు?

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులకు అందించే భోజనం నాణ్యతపై మరోసారి పెద్ద వివాదం రాజుకుంది. పాట్నా నుంచి టాటానగర్ వెళ్లే…

29 minutes ago

చిరు బాబీ మిస్… వెంకీ అనిల్ ఫిక్స్

వరసగా సినిమాలు చేస్తున్నా సక్సెస్ మాత్రం అందని ద్రాక్ష పండులా మారిపోయిన ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి సరైన బ్రేక్…

1 hour ago

వెయ్యి కోట్ల విధ్వంసం వారం రోజుల్లోనే

అంచనాలకు మించి దురంధర్ ది రివెంజ్ అరాచకం చేస్తోంది. సరిగ్గా వారం రోజులు కావడం ఆలస్యం వెయ్యి కోట్ల క్లబ్బులోకి…

3 hours ago

మంగళగిరిని లోకేశ్ వీడాల్సిందేనా…?

లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఖరారైన నేపథ్యంలో దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఆయా పరిణామాలపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఈ…

4 hours ago

ప్రభాస్ ప్రేమిస్తే ఇంతే

నేటి తరం కుర్ర హీరోల్లో సంతోష్ శోభన్, సంగీత్ శోభన్ సోదరులకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే వీరిద్దరి…

4 hours ago

ఘోర బస్సు ప్రమాదం 10 మంది సజీవదహనం

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మార్కాపురం జిల్లాలోని రాయవరం సమీపంలో పలకల క్వారీల వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు…

6 hours ago